19, మే 2024, ఆదివారం

సద్గుణములను

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *నతథేచ్ఛన్తి కల్యాణాన్*

       *పరెషాం వేదితుం గుణాన్*

      *యథేషాం జ్ఞాతుమిచ్ఛన్తి*

      *నిర్గుణ్యం పాపచేతసః!!*


*_విదుర నీతి_*


*తా𝕝𝕝 పాపాత్ములు ఇతరుల దుర్గుణములను తెలుసు కొనుటకు ఆసక్తి గలవారగుదురు...అంతగా వారి సద్గుణములను అన్వేషించుటకు ఆసక్తులు కారు ...*


🧘‍♂️🙏🪷 ✍️🙏

ఆదివారం,మే19,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


ఆదివారం,మే19,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:ఏకాదశి మ1.09 వరకు

వారం:ఆదివారం(భానువాసరే )

నక్షత్రం:హస్త రా2.48 వరకు

యోగం:వజ్రం ఉ11.25 వరకు

కరణం:భద్ర మ1.09 వరకు

తదుపరి బవ రా2.05 వరకు

వర్జ్యం:ఉ9.31 - 11.18

దుర్ముహూర్తము:సా4.38 - 5.29

అమృతకాలం:రా8.09 - 9.55

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: వృషభం

చంద్రరాశి :కన్య

సూర్యోదయం:5.31

సూర్యాస్తమయం:6.21

 *ఏకాదశి*


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ శంకర జయంతి ప్రత్యేకం            

          (ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


                           భాగం 7/10 


శంకరుల అవతారం 


6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు 


    ఇతర మతాలలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్కటే గ్రంథం. సాధనలో ఏ స్థాయివారికైనా ఒకటే పద్ధతి తప్పని సరి. 

    కానీ హిందూత్వం - వివిధస్థితులలో, స్థాయిలలో ఉన్నవారికి సాధనలో వారిస్థాయి ఎరిగి, ఆ పైస్థితికి చేరుకునేందుకు సాహిత్యం వివిధ రకాలుగా ఉంటుంది. 

    జగద్గురువులు ఈ విషయానికి సంబంధించి, గ్రంథాలను మూడు రకాలుగా వర్గీకరించి అందించారు. అందులో 


అ) స్తోత్రాలు:— సామాన్యులకు కూడా ఇహలోక సుఖంతోనూ, మోక్షము సులభంగా పొందేలాగానూ వివిధ దేవతలని స్తుతిస్తూండేవి స్తోత్రాలు. 

      శంకరులు అందించిన అనేక దేవుళ్ళమీద అనేక స్తోత్రాలతోపాటు శివానందలహరి, సౌందర్యలహరి వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


ఆ) ప్రకరణ గ్రంథాలు:— విశేషమైన శాస్త్ర జ్ఞానంలేక, కొద్ది అవగాహనగల మధ్యస్థాయి వారికోసం ఉద్దేశింపబడినవి. 

    పైస్థాయికి చెందిన జ్ఞాన సంబంధ విషయసారాన్ని గ్రహించి మరింత ఉన్నత స్థాయికి చేర్చే - ఆత్మబోధ,అపరోక్షానుభూతి, వివేకచూడామణి మొదలైనవి జగద్గురువులందించిన రెండవ కోవకు చెందినవి. 


ఇ) ప్రస్థాన త్రయం - భాష్యాలు:— మూడవ భాగంగా, శాస్త్ర పండితులకు మాత్రమే అధ్యయనం చేయడానికి సాధ్యమయ్యే వ్యాఖ్యాన గ్రంథాలు భాష్యాలు. 

     వివిధ శాస్త్ర సంప్రదాయాలతో సమన్వయిస్తూ శ్రుతి స్మృతులలోని వాక్యాలనుదహరిస్తూ, అద్వైత సిద్ధాన్తాన్ని బలపరుస్తూ శంకరభగవత్పాదులు భాష్యాలు రచించారు. 

     బ్రహ్మసూత్రాలుగా పిలువబడే శారీరక మీమాంసా, ఉపనిషత్తులు,భగవద్గీతపై వ్రాసిన భాష్యాలని ప్రస్థానత్రయంగా పిలుస్తారు. ఆ భాష్యాలను శంకరులు అనుగ్రహించారు. ఇవి గొప్ప శాస్త్రజ్ఞానంగల పండితుల స్థాయికి అవుసరమైనవి. 


     ఇట్లా సాధారణ, మధ్య, పాండిత్య స్థాయిలలో మూడు రకాల సాహిత్యాన్ని అనుగ్రహించారు శంకరులు. 

     తద్వారా ఏ స్థాయిలవారైనా, మూడంచెల మార్గం ద్వారా మూడుమెట్లు ఎక్కి ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం కల్పించారు. 


                              కొనసాగింపు 


                              =x=x=x= 


   — రామాయణం శర్మ 

            భద్రాచలం

పూజా విధానంలో

 మన పూజా విధానంలోని -  అంతరార్థములు...!!*


1. గంటలు :


దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 


ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 

రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.


2.దీప హారతి:


దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 


దైవమే కాంతి. 

ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు ,కాంతివి నీవే. 


నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 

మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.


3. ధూపం:


భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 

వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 


వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 

విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 

అందరిలో కలుగుతుంది.


ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 

జ్ఞప్తి చేసినట్లవుతుంది.


4. కర్పూర హారతి:


వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 


ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 

భక్తులు కోరుకుంటారు.


5. గంధపు సేవ:


ఈ సేవలో చాలా అర్థం ఉంది. 

భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 


అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 

ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి.


 ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 

ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 


6. పూజ:


దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 


కాని భగవంతునికి వీటితో పనిలేదు. 

నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 

కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.


7 పత్రం(శరీరము):


ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 

పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.


8 పుష్పం (హృదయము):


ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 

అని అర్థం కాదు. 


సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 

అని అర్థం. 


ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.


9 ఫలం (మనస్సు):


మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.

దాన్నే త్యాగం అంటారు.


10. తోయం(నీరు):


భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 

దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 

దైవానికే అర్పితం కావాలి.


11 కొబ్బరికాయలు:


హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 

దానిలో ఉండే నీరు సంస్కారము. 


కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 


అదే నిజమైన నివేదన. 

లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 

హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 


హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 

మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.


మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.


12. నమస్కారము:


చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 

ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.


13. ప్రదక్షిణము:


ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 

ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 


అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

(సేకరణ)...

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

9848647145

భుక్తికే ఉపయుక్తము

సుభాషితం - 1142

--------------

🌺వాగ్వైఖరీ శబ్దఝరీ

     శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్ |

     వైదుష్యం విదుషాం తద్వద్

     భుక్తయే న తు ముక్తయే ||

(వివేకచూడామణి

       అనర్గళ వాక్చాతుర్యం, మంచి శబ్దప్రవాహం, శాస్త్రాలకు వ్యాఖ్యానం చేయు కౌశలం అలాగే శాస్త్రపాండిత్యము - ఇవన్నీ భుక్తికే ఉపయుక్తము కాని ముక్తికి కాదు.

🌺ప్రభ,హైదరాబాద్.

     10-5-2024

నీభాగ్యంబుసామాన్యమే

 నీభాగ్యంబుసామాన్యమే!!


బ్రాహ్మీదత్తవరప్రసాదుడ,వురుప్రజ్ఞావిశేషోదయా

జిహ్వస్వాంతుడ,వీశ్వరార్చన కళాశీలుండ ,వభ్యర్హిత

బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్ధ నిర్ధారిత

బ్రహ్మజ్ఞానకళా నిధానమవు,నీభాగ్యంబుసామాన్యమే!!

శృంగారనైషధం-శ్రీనాధకవిసార్వభౌముడు.- అవతారిక-13పద్యం!!

        కాశీఖండమయః పిండమ్-నైషధం విద్వదౌషధం-అనేది పండితవాక్యం.ఇది

హర్షనైధమునకే వర్తించునని కొందరందురుగాక! శ్రీనాధకృతికిని ఇదివర్తించునన్నది,


ఈపద్యమేనిరూపణము.

          శ్రీహర్షుని కృతినాంధ్రీకరింపవలెనన్న ఆకవి కెంతసత్తువకావలెను.ఎన్ని విషయములు తెలియవలెను. ముందు

ఆతడుసరస్వత్యుపాసకుడైనకాని సాధ్యపడదు.ముందుగాశ్రీనాధునకు గలయోగ్యలెట్టివో పరిశీలింపుడు.


1 బ్రాహ్మీదత్తవరప్రసాది. ఉపాసనాబలం

తనబలంగా జోడించుకున్నవాడు.కాబట్టి రచనకు తిరుగుండదు.

2ఉరుప్రజ్ఞావిశేషోదయాహిజ్వస్వాంతుడవు."ఉరుప్రజ్ఞ-అంటే కావ్యోత్పత్తిహేతువులలో ముఖ్యమైన "ప్రతిభ"- ఆప్రతిభాసమున్మేషంలో ఆదిశేషునిప్రభావగుంభితమనంబుగలవాడవు.

3ఈశ్వరార్చన కళాశీలుండు.

        పరమేశ్వరారాధన మొకకళగా నెరిగినవాడు.శివారాధనాతత్పరుడు.

శివార్చనాఫలము అష్టవిధవిభూతులు.

అందులో వశిత్వమున్నది.అదియే కావలసినది తలచినంతనే మూలకావ్యార్ధమంతయు వశమే!

4అభ్యర్హితబ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్ధ నిర్ధారిత

బ్రహ్మజ్ఞానకళానిధానం. అష్టాదశపురాణసముదాయమునగలతాత్పర్యార్ధమునందుసూచింపబడిన

పరంబ్రహ్మస్వరూపమును నిరూపణముచేయగలవాడు.

     ఇదీ శ్రీనాధునికవనసత్వము.

కవితాసామర్ధ్యము.

     ఈమాటలు శ్రీనాధకృతి స్వీకృత సుకృతి మామిడి సింగనా మాత్యుని మాటలు!

          "అహో !కవిసార్వభౌమా!శ్రీనాధకవీంద్రా!నీకవనసామర్ధ్యముఅపురూపము,అనన్యసామాన్యము.


"నాస్తియేషాం యశఃకాయే జరామరణజం భయమ్!!

                             

                                   స్వస్తి!🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                         🙏

కుటుంబం ప్రధానం.

 తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా GV ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు.

ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.

తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి అసలు విషయం చెప్పాడు. అది విన్న మన భారతీయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తైవాన్ మిత్రుడు భారతీయుణ్ణి అడిగిన ప్రశ్న:

 ‘‘200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు’’

‘‘బహుశా 10 వేల మంది ఉండి ఉండవచ్చు’’ బదులిచ్చాడు భారతీయుడు

 ‘‘మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?వాళ్ళందరూ భారతీయులే కదా? ఔనంటావా?

నిరాయుధులుగా ఉన్న 1300 మందిని కాల్చిపారేయమని జనరల్ డయ్యర్ ఆదేశించాడు. అప్పడు కాల్పులు జరిపింది బ్రిటిష్ ఆర్మీ కాదు. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?’’అడిగాడు తైవాన్ స్నేహితుడు.

మరో ప్రశ్న అడిగాడు తైవాన్ స్నేహితుడు

‘‘ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించారు? భారతీయులను తమ బానిసలుగా భావించారు. మీలోనే కొందరిని మతం మార్చి మీకు వ్యతిరేకంగా పోరాడేలా చేసారు. మీలోనే కొందరు డబ్బు కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిత్రుడా, మీ ప్రజలే శతాబ్దాల పాటు మీ ప్రజల్ని చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు కోసం. మీలాంటి స్వార్ధపరులు, మోసగాళ్ళు, విద్రోహులు, అల్ప బుద్ధులు, శత్రువులతో స్నేహం చేసి, తమ వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారిని మా దేశస్తులు ద్వేషిస్తారు’’ అన్నాడు

మరో విషయం చెప్పాడు తైవానీయుడు. ‘‘బ్రిటిషర్లు హాంగ్ కాంగ్ ని స్వాధీనం చేసుకొన్నప్పుడు ఒక్క స్థానికుడు కూడా సైన్యంలో చేరలేదు. తమ వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం వారికి లేదు.

కపట మనస్తత్వం కలిగిన చాలా మంది భారతీయులు ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉంటారు. ముందూ వెనకా ఆలోచించరు’’ 

‘‘అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఉతమిచ్చేందుకు వెనుకాడరు. భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరూ మీ కుటుంబం ప్రధానం. సమాజం, దేశం ఏమైపోయినా సరే మీకు బాధనిపించదు’’ అని ముగించాడు తైవాన్ దేశస్తుడు

 

ఇది మనకెవరికీ మింగుడు పడని చేదు నిజం.

దేశాన్ని నాశనం చేస్తుంది.

 శ్లోకం:☝️

*ఏకం విషరసో హన్తి*

 *శస్త్రేణైకశ్చ హన్యతే |*

*సరాష్ట్రం సప్రజం హంతి*

 *రాజానం మంత్రవిప్లవః ||*


భావం: విషం ప్రయోగంతో ఒకరిని మాత్రమే చంపవచ్చు. ఆయుధంతో ఒకరిని [లేదా కొందరిని] చంపవచ్చు. కానీ పీడిత ప్రజల రహస్యమైన విప్లవం చాపకిందనీరులా వ్యాపించి, ఆ దేశ పౌరులను మరియు రాజుతో సహా మొత్తం దేశాన్ని నాశనం చేస్తుంది.

పంచాంగం 19.05.2024

 ఈ రోజు పంచాంగం 19.05.2024  Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: ఏకాదశి తిధి భాను వాసర: హస్త నక్షత్రం వజ్ర యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి మధ్యాహ్నం 01:48 వరకు.

హస్త రాత్రి 03:14 వరకు. 

సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:38


వర్జ్యం : పగలు 09:46 నుండి ఉదయం 11:34 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:55 నుండి 05:47 వరకు.


అమృతఘడియలు : పగలు 08:31 నుండి 10:19 వరకు.


రాహుకాలం : సాయంత్రం  04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



ఈ రోజు సర్వేషాం మోహిన్యేకాదశి , పరుశరామైకాదశి 


శుభోదయ:, నమస్కార:

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల

 సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.19.05.2024

ఆది వారం (భాను వాసరే)

***********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే ఏకాదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  ఏకాదశ్యౌపరి ద్వాదశ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.31

సూ.అ.6.21

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

ఏకాదశి మ.1.08 రకు. 

ఆది వారం. 

నక్షత్రం హస్త రా.తె.2.51 వరకు. 

అమృతం రా. 8.12 ల 9.58 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.39 ల 5.30 వరకు.  

వర్జ్యం ఉ. 9.34 ల 11.20 వరకు. 

యోగం వజ్రం ఉ.11.26  వరకు.  

కరణం భద్ర ప. 1.08 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

****************   

  పుణ్యతిధి శూన్యతిథి. 

  ****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

వైశాఖ మాసం - శుక్ల పక్షం*

 *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

        *వైశాఖ మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి      : *ఏకాదశి* మ1.09 వరకు

🔯వారం   : *ఆదివారం* (భానువాసరే )

⭐నక్షత్రం  : *హస్త* రా2.48 వరకు

✳️యోగం : *వజ్రం* ఉ11.25 వరకు

🖐️కరణం  : *భద్ర* మ1.09 వరకు

            తదుపరి *బవ* రా2.05 వరకు

😈వర్జ్యం   :   *ఉ9.31 - 11.18*

💀దుర్ముహూర్తము : *సా4.38 - 5.29*

🥛అమృతకాలం    :  *రా8.09 - 9.55*  

👽రాహుకాలం       : *సా4.30 - 6.00*

👺యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*

🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *కన్య*

🌅సూర్యోదయం: *5.31* || 🌄సూర్యాస్తమయం:*6.21*

 👉 *అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం*

   మతత్రయ ఏకాదశి*

*గోమాతను పూజించండి*

*గోమాతను సంరక్షించండి* ఇరగవరపు రాధాకృష్ణ🙏

అమ్మకి ఏమి కావాలి?

 అవును

అమ్మకి ఏమి కావాలి?


పిల్లలు చదువుకొని

ఎక్కువ మార్కులు

తెచ్చుకుంటే

ఆ పిచ్చి తల్లి

కళ్ళల్లో

మెరుపులు


అదే పిల్లలు

పెద్దవారై

మంచి ఉద్యోగాలలో

స్థిరపడితే

ఆ అమ్మ

కళ్ళలో కాంతులు


ఒక గొప్ప వ్యక్తిని

వెతికి వెతికి

భాగస్వామిని చేసి

వారి సంతోషాలకు

ఆనందలకు

ఆనంద బాష్పాలు

రాలుస్తుంది


కానీ


ఆ పిల్లల

నిరాదారణకు లోనై

అవమానాల పాలై

బ్రతుకు భారమైనపుడు

ఆ కళ్ళలో

కన్నీటి సుడులు


కంటికి రెప్పలా

కాపాడితే

బిడ్డలు ఇచ్చే బహుమతి

తడి ఆరని

చీరకొంగు


కంటి నిండా నిద్ర లేక

మౌనంగా

ఎన్నో రాత్రులు

రోదిస్తూ ఉన్నా

తలరాత అనుకొని

సర్దుకు పోతుంది కానీ

శాపాలు పెట్టలేదు


కనపడని దేవుడి కోసం

గుళ్ళు గోపురాలు

కానుకలు ఇస్తాము

కనిపించే దైవాన్ని

నిర్లక్ష్యం చేస్తాము


ఆ దైవాన్ని మెప్పించలేము 

ఈ దైవాన్ని నొప్పిస్తే

18, మే 2024, శనివారం

Portable bike


 

Panchaag


 

*శ్రీ శరవు మహాగణపతి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 321*


⚜ *కర్నాటక  :- మెంగళూరు*


⚜ *శ్రీ శరవు మహాగణపతి ఆలయం*



💠 శరవు మహాగణపతి ఆలయం కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.  

ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.


💠 "షరవు" అనేది "షరము" నుండి ఉద్భవించింది, అంటే బాణం.  

సుమారు 8 శతాబ్దాల క్రితం, "స్థలపురాణం" లేదా స్థానిక పురాణ వర్ణనలు, తుళువ ప్రాంతానికి చెందిన అత్యంత శక్తివంతమైన రాజు, మహారాజు వీరబాహు, ఒక ఆవును బాణంతో  పొరపాటున చంపాడు. 


🔆 ఆలయ విశిష్టత


💠 800 సంవత్సరాల క్రితం వీరబాహు రాజు ప్రసిద్ధ తుళు రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకరోజు, వీరబాహుడు వేట యాత్రకు వెళ్ళాడు, ఆ సమయంలో అతను రైతుల పంటలను నాశనం చేసిన అడవి జంతువులను చంపాడు. అతను ప్రసిద్ధ శివాలయం స్వర్ణ కడలి క్షేత్రంతో కూడిన విశాలమైన అటవీ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మంజునాథుని భక్తిశ్రద్ధలతో పూజించాడు. అతనికి పశ్చిమాన దట్టమైన అడవి కనిపించింది.


💠 అడవి మధ్యలో పులి, ఆవు ఒకదానికొకటి దగ్గరగా నిలబడి ఉండటాన్ని చూసిన తుళురాజు ఆవుపై దాడి చేయబోతోందని భావించాడు. 

రాజు పులిపై బాణం విసిరాడు కానీ దురదృష్టవశాత్తు అది ఆవును చంపింది. 

ఈ గోహత్య సంఘటనతో కలత చెందిన రాజు ఈ పాపానికి పరిహారం కోసం భరద్వాజ మహర్షి వద్దకు పరుగెత్తాడు.


💠 గోహత్య జరిగిన ప్రదేశంలో శివునికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించమని ఋషి రాజుకు సలహా ఇచ్చాడు.

అటువంటి చర్య రాజు చేసిన పాపాన్ని పోగొట్టడమే కాకుండా రాబోయే తరాలకు శ్రేయస్సుని కలిగిస్తుందని మహర్షి అన్నారు. ఆవు చనిపోయిన నాలుగు చదరపు మైళ్ల ప్రాంతానికి 'శరపట్టణ' లేదా 'శరవు' అనే పేరు వచ్చింది. 

తర్వాత భరద్వాజ మహర్షి ఆలయ నిర్మాణం గురించి రాజుకు సూచనలు ఇచ్చాడు. 

మొదట, ఆలయాన్ని నిర్మించే ముందు, తుళు రాజు ఉత్తరాన ఒక ట్యాంక్ నిర్మించాలి. ఆలయానికి దక్షిణంగా ఆవు రాతి విగ్రహాన్ని నిర్మించాలి. 

ఋషి తన ధ్యాన శక్తితో గోరక్షం దగ్గర ప్రవహించే నేత్రావతి నది గోముఖం నుండి తీర్థంగా ఉద్భవించేలా చూస్తానని రాజుకు హామీ ఇచ్చాడు.


💠ఈ ప్రదేశంలో ప్రతిష్టించబడే శివలింగాన్ని శరబేశ్వర అని పిలుస్తారు మరియు ట్యాంక్ను శరబేశ్వర తాటక్ అని పిలుస్తారు. 

అప్పుడు రాజు గర్భగుడి, ముఖమంటపం, మరియు గోపురాన్ని నిర్మించవలసి వచ్చింది. భరద్వాజ మహర్షి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడు.

రాజు, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, లక్ష మంది బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వవలసి వచ్చింది. 

శరబేశ్వరుడు ఇప్పుడు కాశీ విశ్వనాథుడు అని పిలుస్తాడని ఋషి రాజుతో చెప్పాడు.


💠 గంగా తీర్థం (గంగా పవిత్ర జలం) అని పిలువబడే శరతీర్థం మరియు శరపుర కాశీ క్షేత్రం (కాశీ విశ్వనాథుని నివాసం)గా ప్రసిద్ధి చెందింది. 

తరువాత, ఒక రోజు, గణపతి ఈ ప్రదేశాన్ని సందర్శించి, ఆలయ దక్షిణ గోడపై ప్రత్యక్షమవుతాడు. 

శరబేశ్వర స్వామికి ఆయన సామీప్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఆలయాన్ని శ్రీ శరవు మహా గణపతి ఆలయం అని పిలుస్తారు. 


💠 వీరబాహుడు తన భార్యతో కొంతకాలం షరాపురలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ కాలంలో, గంగావాడి అధిపతి (ప్రస్తుతం బంగాడి అని పిలుస్తారు) చంద్రశేఖర్ జైన్ జైన మతాన్ని విడిచిపెట్టి, తనను తాను విష్ణువు భక్తుడిగా మార్చుకున్నందున హోయసల రాజు విష్ణువర్ధన్ పట్ల ద్వేషం పెంచుకున్నాడు.


💠 విష్ణువర్ధన్తో జరిగిన యుద్ధంలో చంద్రశేఖర్ జైన్ మరణించాడు. అతని కుమారుడు వీర నరసింహ బంగార్రాజు ఆశ్రయం కోసం వీరబాహు రాజును సంప్రదించాడు. 

ఋషి యొక్క ఉదాహరణలో, వీరబాహు అతనిని దత్తత తీసుకున్నాడు, అతనిని తన చట్టబద్ధమైన వారసుడిగా చేసాడు. 

వీర నరసింహ బంగార్రాజు శివాలయానికి తూర్పున ఒక రాజభవనాన్ని నిర్మించి నివసించాడు.


💠 ఒకరోజు బంగార్రాజుకు మంగళ దేవి కలలో కనిపించి గోరక్నాథ్ ఆశ్రమానికి పశ్చిమాన రాతి విగ్రహం కోసం వెతకమని చెప్పింది. 

ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి దానికి మంగళ దేవి అని పేరు పెట్టాలని ఆమె అతనికి సూచించింది. 

శరవు మరియు మంగళ దేవి మధ్య ఉన్న ప్రాంతానికి మంగళపూర్ అని పేరు పెట్టాలని కూడా ఆమె ఆదేశించింది.

ఆ ప్రాంతమే నేడు మంగళూరు గా పిలవబడుతుంది.


💠 ఈ ఆలయంలో ప్రధాన దేవతలు మహాగణపతి, శరబేశ్వర, మంగళ దేవి, కుద్రోలి మరియు కద్రి.  

ఈ ఆలయానికి గణేష్ చతుర్థి, సంక్రాంతి మరియు దసరా రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.



💠 ఈ ఆలయం వార్షిక "రథోత్సవం" చంద్రమాన యుగాది, దీపోత్సవం లేదా దీపాల పండుగ మరియు శంకస్తి చతుర్థి రోజులలో ప్రారంభమయ్యే ప్రత్యేక సందర్భాలలో, చాలా పెద్ద సంఖ్యలో భక్తులు శరబేశ్వర స్వామి మహాగణపతి యొక్క పవిత్రమైన "దర్శనం" కలిగి ఉంటారు. 

ఈ ఆలయం నిజానికి యక్షగాన, నృత్య నాటకం మొదలైన అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు మరియు మానవతా మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా కేంద్రంగా ఉంది.


💠 మంగళూరు రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిమి దూరం

సూర్య ద్వాదశ నామాలు

 సూర్య ద్వాదశ నామాలు


1. ఓం మిత్రాయ నమః


2. ఓం రవయే నమః


3. ఓం సూర్యాయ నమః


4. ఓం భానువే నమః


5. ఓం ఖగాయ నమః


6. ఓం పూష్లే నమః


7. ఓం హిరణ్య గర్భాయ నమః


8. ఓం మరీచియే నమః


9. ఓం ఆదిత్యాయ నమః


10 ఓం సవిత్రే నమః


11 ఓం అర్కాయ నమః


12 ఓం భాస్కరాయ నమః

ఒక సంఘటన

 ఒక సంఘటన 

చాలా సంవత్సరాల క్రితం అంటే 40 ఏళ్ళ పైబడే ఉండవచ్చు. నేను ఖమ్మం బస్టాండులో బస్సుకోసం 5వ నెంబర్ ప్లాటుఫామ్ మీద ఎదురుచుస్తూవున్నాను. సమయం 5-30 అయ్యింది. చాలా సేపటివరకు బస్సు రాలేదు దాదాపు 6 గంటల సమయంలో బస్సు వచ్చింది. నేను ఇల్లేందు వెళ్ళాలి అతి కష్టం మీద బస్సులోకి నా శరీరాన్ని చేర్చాను. ఆలా ఎందుకు అన్నానంటే అక్కడ చాలా సేపటివరకు బస్సు రానందు వల్ల రెండు బస్సులకు సరిపడా జనం వున్నారు. నేను గేటు దగ్గరే ఉండటంతో వెంటనే చాకచేక్యంగా బస్సులోకి దూరాను. అంతే వెనుకవాళ్ళ తోపుడుతో ముందుకు దూసుకొని వెళ్ళాను కానీ నాకు కూర్చోటానికి సీటు దొరకలేదు. అతి కష్టం మీద వెనక టైర్లు వుండే చోట నిలుచో గలిగాను. చుట్టూ చూసాను ఎక్కడైనా సీటు కాళిగా ఉందా అని కానీ ఒక్క సీటు కూడా కాళీ లేకపోగా నిలుచోవటమే అతి కష్టంగా అయ్యింది. లోపల గాలి ఆడటం లేదు. ఎప్పుడు బస్సు బయలుదేరుతుందా అని ఎదురు చూడసాగాను. కుడి ప్రక్క చిన్న తలుపు తీసుకొని డ్రైవరు లోపలి చొరబడ్డాడు. ఆ ఇక బస్సు బయలు దేరుతుంది అని నేను అనుకున్నాను. 

చిన్నగా డ్రైవరు వైర్లు కలిపి (ఆర్టీసీ బస్సులకు తాళం తీసి దాని వైర్లు ముడి వేసి పెట్టేవారు ఆ రెండు వైర్లు కలిపితే అప్పుడు స్టార్ట్ అయ్యేది)  బస్సును స్టార్టు చేసాడు.  అంతే ముందు ఆడవారి సీట్లలోంచి ఒక స్త్రీ పెద్దగా అరిచింది. అది నాకు పాము అన్నట్లు వినపడింది. నిజానికి ఆమె ఏమున్నదో నాకు తెలియదు. అరుపు మాత్రం ప్రాణం పోయినట్లు అరిచింది. అంతే కిటికీలలో పట్టిన వాళ్ళు అంతా ఒక్క క్షణంలో దూకారు. ముందు సీట్లలో వున్నవారు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లారు. ఒక్క క్షణంలో బస్సు మొత్తం కాళీ అయ్యింది. చుట్టూ చుస్తే బస్సులో నేను ఒక్కడినే వున్నాను. నేను కిటికీలోంచి దుకాణాల (అప్పుడు నేను చిన్నగా కిటికీలోంచి దుకే అంత సైజులోనే వుండే వాడిని) లేక బస్సు కాళీ అయింది కాబట్టి డోరులోంచి వెళదామా అని ఆలోచించిన తరువాత నాకు తట్టింది ఏమిటంటే ఆ అరచిన ఆమె పాము అన్నది కదా ముందు క్రింద ఎక్కడ పాము ఉందొ చూద్దాము అని సెట్ల మీద నిలుచొని చుట్టూ చూసాను. ఆ డిమ్ లైట్ల వెలుతురులో నాకు సెట్ల మధ్య ఏది కదిలినట్లు కనపడలేదు. 

అప్పుడు డ్రైవరు వచ్చి ముగ్గురు కూర్చునే ఆడవారి సెట్లలో మూడవ సీటు పైన సీటు తీసి క్రింద బ్యాటరీ వైరు గట్టిగా పిట్ చేస్తున్నాడు. నేను అడిగాను ఏమైందని. దానికి ఆయన లూసు కనెక్షన్ ఉండటం వలన బస్సు స్టార్ట్ చేసినప్పుడు బ్యాటరీ   వైరు దగ్గర స్పార్క్ వచ్చింది దానికి ఒక పల్లెటూరు ఆమె బస్సు తగలబడినట్లు అరిచింది అని అన్నాడు. ఆ మాటలకు నాకు ధైర్యం వచ్చింది నేను ముందరి రెండు సీటర్ సెట్లో కూర్చున్నాను. అక్కడ బయట వున్నవారిని డ్రైవరు లోపలికి రండి ఏమి ప్రమాదం లేదు అంటే జనం మళ్ళి  పుట్టలోని చీమలు వచ్చినట్లుగా వచ్చి బస్సునిండా చేరారు.  కాకపొతే ఇందాకటి సంఘటనకు కొంతమంది భయపడి వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని తెలిసింది.  నాకు తెలిసిన ఆమె ఒకామె ఈ విషయం గూర్చి తరువాత చెప్పి తనకు ఆ భయానికి బీపీ బాగా పెరిగి ఆస్పటలులో చేరినట్లు చెప్పింది. 

సామాన్య మానవులకు వస్తువులమీద అవగాహన లేకపోవటంతో వాళ్ళు బాధపడతారు ఇతరులను బాధపెడతారు అని అనటానికి ఇది ఒక ఉదాహరణ.

మీరు భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు

అమెరికా ఖరీదైన దేశం

 *అమెరికా ఖరీదైన దేశం, కానీ దాని పౌర సేవలు అత్యున్నత ప్రమాణాలు.*


 *వేసవిలో, తెలంగాణ లోని వరంగల్ నుండి ఒక కుటుంబం సెలవు కోసం యుఎస్ వెళ్ళింది. అందులో ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు మరియు ఆ వ్యక్తి తండ్రి ఉన్నారు.*


*న్యూయార్క్ నగరంలో మూడు రోజుల తర్వాత, వారు నయాగరా జలపాతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. NYC నుండి నయాగరా వరకు ఉన్న ఇంటర్‌స్టేట్ హైవే అద్భుతంగా ఉంది.*


 *వారి వెనుక కారులో ఒక 80 పైబడిన వయస్సు గల అమెరికన్ మహిళ వస్తుంది.*

 *భారతీయ పిల్లలు వెనుక సీటుపై మోకరిల్లి, వెనుకకు చూస్తూ, నవ్వుతూ, వెనక్కి ఊపుతూ వెనుక కారులో వస్తున్న అమెరికన్ లేడీకి చేతులు ఊపుతూ ఉంటారు.*


*అకస్మాత్తుగా అమెరికన్ లేడీ కి ముందు కారులో ప్రయాణిస్తున్న భారతీయుల కారు వెనుక సీటు కిటికీలో నుండి ఒక వృద్ధ భారతీయుడి తల బయటకు వచ్చి రక్తం వాంతి చేసుకోవడం చూసింది.*


*ఆమె తన కారును పక్కన ఆపి వెంటనే సహాయం కోసం 911కి కాల్ చేసింది.*


*వెంటనే, ఆకాశంలో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ కనిపించింది. అది ఒక మైలు ముందుకి దిగి, కారును ఆపమని భారతీయ కుటుంబానికి సంకేతాలు ఇచ్చింది మరియు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వృద్ధుడిని దాదాపు ICUలో ఉన్న ఛాపర్‌లోకి తీసుకెళ్లారు. ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది.*


*హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులు పర్యవేక్షించబడ్డాయి. సూచనలను అందించడానికి జాన్ హాప్‌కిన్స్ నుండి ఒక స్పెషలిస్ట్ MD వీడియో కాల్‌లో ఉన్నారు.*

*అరగంటలో, వృద్ధుడు క్షేమంగా ఉన్నాడని మరియు మళ్లీ ప్రయాణించడానికి సరిపోతాడని ప్రకటించారు.*


*అమెరికన్ లేడీ 👍 త్వరిత సహాయం మరియు సమయానుకూల చర్యకు అభినందనలు!*


*ఈ సేవల కోసం, వ్యక్తి నుండి $ 5,000 డాలర్లు వసూలు చేయబడింది..*


*ఒక భారతీయ కుటుంబానికి ఇది చాలా డబ్బు.*


*ప్రణాళికేతర ఆర్థిక ఖర్చులతో, ఆ వరంగల్ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు మరియు అతని తండ్రిని తిడుతూ..*


  *"పాన్ (కిళ్ళీ) తిని కారులోంచి ఉమ్మివేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు?"*

🤪😂🤣🤪😂

బ్రాహ్మణులు

 బ్రాహ్మణోత్తములందరికి నమస్కారం!

ప్రస్తుతం ప్రమాదంలో పడుతున్న మానవతా విలువల పరిరక్షణ కోసం ప్రపంచ శాంతి కోసం భారతదేశ విశ్వగురు స్థానంలోకి రావడం కోసం ప్రపంచంలో ఉన్న ఏడు కోట్ల 80 లక్షల మంది బ్రాహ్మణులు కచ్చితంగా ఏకం కావలసిన తరుణం ఆసన్నమైంది. 2026 ఏప్రిల్ 20 పరుశరామ జయంతి రోజు సరికి యా వత్తు ప్రపంచ బ్రాహ్మణ మహాశక్తి ఏకం కాబోతోంది. 

యావత్తు ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణ అందరిని మరియు బ్రాహ్మణ సంఘాలను కలిపే వారిదిగా 

 *బ్రాహ్మణ విరాట్ పరివార్* ఆవిర్భవించింది.

ప్రతి రాష్ట్రంలో 33 విభాగాలుగా విభజించబడి ప్రతి విభాగంలో 33 మంది నాయకులతో సుమారు 1000 మందితో ప్రతి రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం

*బ్రాహ్మణ విరాట్ పరివార్ విభాగాలు*

1. వైదిక పరివార్ (వేద పండితుల విభాగం) 

2. పురోహిత్ పరివార్ 

3. ప్రభుత్వ అర్చక అండ్ ఎండోమెంట్ పరివార్ 

4. అర్చక పరివార్ 

5. ధార్మిక పరివార్ ( పంచాంగ కర్తలు, జ్యోతిష్య పండితులు, ప్రవచనకర్తలు)

6. ఆధ్యాత్మిక సేవా పరివార్ (ఉపాసకులు, వివిధ ఆధ్యాత్మిక పీఠ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక సంస్థల్లో పని చేసే వ్యక్తులు) 

7. ఉపాధ్యాయ పరివార్ (SGT అండ్ స్కూల్ అసిస్టెంట్)

8. అధ్యాపక్ పరివార్ (జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్) 

9. ప్రాధ్యాపక్ పరివార్ (ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు)

10. విద్యా సంస్థ నిర్వాహక పరివార్ (విద్యాసంస్థలు మరియు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు) 

11. శిక్షా ప్రబోధక్ పరివార్ (education&job consultants and HR)

12. చికిత్సక్ పరివారం (Doctors wing)

13. చికిత్సా సహాయక్ పరివార్ (diagnostic centres, medical shops and medical representives) 

14. దేశీయ & ప్రత్యామ్నాయ వైద్య పరివార్ (ఆయుర్వేద హోమియోపతి నేచురోపతి ఫిజియోథెరపీ...)

15. చికిత్సాలయ్ నిర్వాహక పరివార్ (Hospital administrators and management persons)

16. అది వక్తా పరివార్(Advocates wing)

17. ప్రశాసన్ పరివార్(కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్) 

18. సంగణక తంత్రజ్ఞ పరివార్ (software and technology) 

19. భూ&గృహ నిర్మాణ& వ్యాపార్ పరివార్ (real estate and construction)

 20. శ్రామిక పరివార్ (trade unions) 

21. కార్యక్రమ నిర్వాహక పరివార్ (event managers , caterers and marriage consultants)

22. యాత్ర &ఆవాసాది నిర్వాహ పరివార్ (tours travels and hotels)

23. సమాజ్ సేవక్ పరివార్ (social activists &NGO , other organisers)

24. వార్తా ప్రచారక్ పరివార్ 

(Print media, electronic media and social media) 

25. విచార్ మంతన్ పరివార్ (retired employees wing) 

26. మహిళా శక్తి పరివార్ (women wing)

27. యువశక్తి పరివార్(youth wing) 

28. రాజనీతిక్ పరివార్(political wing)

29. వ్యాపారి పరివార్

(Business ring and industrialists)

30. సాహిత్యిక్ పరివార్

(కవులు ,సాహితీవేత్తలు & రచయితలు) 

31. కళోపాసక్ పరివార్ (సినీ మరియువివిధ రంగాల కళాకారులు )

32. అర్థజ్ఞ పరివార్ (C.A and  bankers, loan providers...)

33. కిసాన్ పరివార్ (agricultural wing)


విచ్చలవిడిగా విడాకులు

 కాఫీ కబుర్లు 


 -- విచ్చలవిడిగా విడాకులు.


.  కుప్పకూలుతున్న వివాహ వ్యవస్థ..  ---- కొన్ని కొన్ని మాటలు పదాలు తొలగిపోతున్నాయి.. సామెతలకి అర్ధాలు మారిపోతున్నాయి.  పురుషాధిక్యతకి కాలం చెల్లింది.  ఆడది అబల కాదు సబల అని అందరికీ తెలిసింది.   దౌర్బల్యం కాదు.. మనోబలమే ఆడదాని ఆయుధం.  ఉద్యోగ వివాహ రీత్యా కొత్త జీవితం చవి చూడబోతున్న సగటు స్త్రీ ఆలోచనల్లో పెనుమార్పులు.. ఊహించని వాస్తవాలు.  అప్పట్లో సగటు స్త్రీ కోరుకునేది.. తనని ప్రేమించే భర్త, చక్కటి సంసార బంధం, ముత్యాల్లాంటి పిల్లలు.. ఇవే.  ఇప్పుడు యువతి కోరుకునేది.‌.  లక్షకి పైన జీతం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న భర్త, మూడో వ్యక్తి ప్రమేయం లేని సంసారం, ఆధునిక జీవనశైలి.  ఆడపిల్లలు కూడా ఉద్యోగస్తులే, భర్తల ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న భార్యలు ఉన్నారు.  అంటే ఇంకొకరిపై ఆధారపడవలసిన అవసరంలేదు. స్వేచ్ఛగా ఉండొచ్చు.. యథేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు.  ఎవరిని కేర్ చేయాల్సిన అవసరమే లేదు.  సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే దూరప్రాంతాలే, దూరదేశాలే.  ఐనవాళ్ళకి బంధువులకి దూరంగా.. పూర్తి స్వాతంత్ర్యం జీవితం.  భర్త చాటుమాటున్న భార్య..  ఇప్పుడు తన భర్తనే ఒకాట ఆడించేస్తుంది.. కబాడీ ఆడేసుకుంటుంది..  సంపాదన స్టేటస్, లైఫ్ స్టైల్ ముఖ్యం అంటోంది‌‌.. అందాన్ని హరించే మాతృత్వం అవసరం లేదంటోంది.. జీవితాన్ని హాయిగా అనుభవిస్తూ యాభై ఏళ్ల జీవితం చాలంటోంది.. అనారోగ్య బాధలతో అరవై దాటిన వృద్ధాప్యం ఎందుకని ప్రశ్నిస్తోంది..  30 సంవత్సరాల తరువాత జీవితం గురించి ఆలోచనే వ్యర్ధం అంటోంది..  ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్ల ఫుడ్డే కావాలంటోంది..  వంటగది వ్యర్ధం అంటోంది..  హాయిగా ఉన్న ప్రతీరోజూ పండుగే అంటోంది.  భర్త ఆలోచనలు గుణాలు ఏమాత్రం నచ్చకపోయినా అవసరం లేదని విడాకుల వైపు పరుగెడుతోంది.  సహజీవనం ఉత్తమం అంటోంది.  భారతీయ వనిత ఎంతగా ఎదిగిపోయింది.. ఫలితంగా పెద్దలకి భావి జీవితం అయోమయం.  తప్పు పట్టాల్సిన అవసరంలేదు.  కాలం ఆధునికత సంతరించుకుంది.  పప్పన్నం ఎప్పుడు పెడతారు..  సంవత్సరం తిరిగేసరికి పండంటి మనవణ్ణో మనవరాలినో చేతిలో పెట్టాలి కోడలా .. వంటి డైలాగ్స్ కి కూడా కాలం చెల్లిపోయింది.  గొడ్రాలు అంటే ఏమిటో నేటి యువతకి తెలియదు.  డిటాచ్మెంట్ యుగంలో ఉన్నాం. ఎక్కడో ఉన్న   మన పిల్లలకి మన గురించి పట్టించుకునే తీరిక ఓపిక ఉండవు.  ఐనా అరుదుగా.. దూరంలో ఉన్నా తల్లిదండ్రుల బాధ్యతల్ని పట్టించుకుంటూ అవసరాలు సమకూరుస్తున్న పిల్లలు కూడా లేకపోలేదు.  ఈ కోవలో ఉన్న పెద్దలు అదృష్టవంతులే కదా..  ----- సేకరణ

భరద్వాజమహర్షికథ

 #వేదములయొక్కకథ #వేదపురుషవర్ణన #వేదశాఖలవివరం


#భరద్వాజమహర్షికథ


ఒకప్పుడు వేదాల్ని సంపూర్ణంగా అధ్యయం చేయదల్చుకున్నాడు భరద్వాజ మహర్షి, అతడు బ్రహ్మచర్యను అవలంభించి ముమ్మారు చతుర్ముఖ బ్రహ్మ వరం చేత దీర్ఘాయుష్షును పొందాడు. నాలుగు యుగాలూ అయిదువేలసార్లు తిరిగితే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. భరద్వాజ మహర్షి అటువంటి బ్రహ్మ దినాలు మూడు జరిగినా గురువు దగ్గర వేదాధ్యయనం చేయడానికి చాలలేదు. బ్రహ్మ గురించి నిష్టాగరిష్ఠతతో తపస్సు చేస్తే, బ్రహ్మ సాక్షాత్కారం గావించి విషయం తెలుసుకుని “భరద్వాజా! వేదం నాకే పూర్తిగా తెలియదు. నీకు వేదరాశిని చూపిస్తాను. చూడు!" అని చెబుతూ కోటి సూర్యుల కాంతితో పోటీపడి వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అనేక వేదరాశులను చూపించాడు. అది చూసిన భరద్వాజుడు భయభ్రాంతుడై “ఆహా! ఏమిటిది? నేను ఇంతకాలం అధ్యయనం చేసింది ఇందులో అణుమాత్రం కూడా లేదే! మరి అటువంటిది ఈ వేదాలన్నీ అధ్యయనం చేయడం ఎన్ని బ్రహ్మకల్పాలకైనా సాధ్యపడుతుందా?” అని అనుకున్నాడు. భరద్వాజ మహర్షి బ్రహ్మకు నమస్కరిస్తూ “తండ్రీ! ఈ వేదశాస్త్రాలను తిలకించిన నాకు మతిపోయినంతైంది. అందుచేత నాకెంత కావాలో మీరే నిర్ణయించండి?” అని అన్నాడు. అపుడు బ్రహ్మ, అనంతానంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికిళ్ళు తీసి

అతనికి ఇచ్చి "భరద్వాజా! ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!” అని వరాన్ని ప్రసాదించాడు. ఇంకా ఆ మూడు పిడికిళ్ళ వేదాన్ని అధ్యయనం చేయడం ఇంతవరకూ పూర్తికాలేదు.


 అందుచే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తూ వ్యాసుడి రూపంలో అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. వాటిని తన ప్రియ శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులనే వారికి ఒక్కొక్కరికి ఒక్కో వేదం చొప్పున తెలిపారు. వ్యాసమహర్షి దగ్గర వారు, ఒక కల్పాంతం వరకూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటిది అల్పాయుష్కులైన మీరిద్దరూ నాలుగు వేదాలను పూర్తిగా అధ్యయనం చేసామని అనుకోవడం ఎంతో అహంకారంతో కూడుకున్నది! వేదం అంతా అధ్యయనం చేయడం ఏ ఒక్కరివల్లా అయ్యే పనికాదు. గనుకనే వ్యాసుడు దాన్ని నాలుగు భాగాలుగా విడదీశాడు. 


#ఋగ్వేదము   ఋగ్వేదాన్ని తన ప్రియశిష్యుడైన పైలుడికి బోధించి "ఋక్కులు చాలా మహిమాన్వితాలు ఈ ఋగ్వేదాన్ని ముందుగా ధ్యానించాలి" అని చెప్పాడు. అప్పుడు పైలుడు “గురుదేవా! ఈ ఋక్కుల్ని ఎలా ధ్యానించాలో మీరే తెలపండి!” అని వేడుకున్నాడు. “నాయనా! విను. ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం. దీని గోత్రం ఆత్రేయస, గాయత్రీ ఛందము, దీనికి బ్రహ్మ అధిదేవత. దీని వర్ణంఎరుపును, తామరాకుల వంటి కళ్ళు, మధురమైన కంఠం, ఉంగరాల జుట్టు, చంద్రవంక లాంటి మీసకట్టు, రెండు మూరల కొలతగల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ఊహించి ధ్యానించు. ఇందులో చర్చ, శ్రావకం, చర్చకం, శ్రవణీయపారం, క్రమపారం, జట, రథక్రమం, దండక్రమం అనే అష్టభాగాలున్నాయి. ఆ క్రమానుసారమే దాన్ని జాగ్రత్తగా పారాయణం చేయాలి. ఇక అశ్వలాయని, సాంఖ్యాయని, శాకలా, భాష్కలా, మాండుకేయులనే అయిదు శాఖలు ఈ వేదానికున్నాయి” అని పైలుడికి ఋగ్వేదం గురించి వివరించాడు.


#యజుర్వేదము

 ఆ తర్వాత తన రెండవ ప్రియశిష్యుడు వైశంపాయనునికి యజుర్వేదం బోధించి, దాని లక్షణాల గురించి ఇలా చెప్పసాగాడు. “నాయనా! ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం. దీనికి గోత్రం భరద్వాజస, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. చేతిలో కపాలాన్ని ధరించి సన్నగా ఉండి, అయిదు మూరల పొడవున్న తామ్రవర్ణదేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. దీనికి ఎనభై అయిదు శాఖలున్నా ప్రస్తుతం పద్దెనిమిది శాఖలు మాత్రమే మిగిలున్నాయి. ఈ వేదం యజ్ఞ యాగాదుల గురించి వివరంగా చెబుతోంది. దీనికి మూలం మంత్ర బ్రాహ్మణ సంహిత. దీనికి ఛందస్సు భాషా, ప్రతిపదము, అనుపదము, మీమాంస, న్యాయం, ధర్మం, తర్కం అనే ఎనిమిది ఉపాంగాలు. దీనికి శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం అనే ఆరు అంగాలున్నాయి” ఇంత విస్తారంగల ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పాడు. 


#సామవేదము

మూడవ ప్రియ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని గురించి ఇలా ఉపదేశించాడు. “గంధర్వం సామవేదానికి ఉపవేదం. దీనికి అధిదేవత విష్ణువు. జగతీ ఛందస్సు, గోత్రం కాశ్యప. మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రం, దండము ధరించి, ఆరు మూరల పొడవుగల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి. ఈ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వారెవ్వరూ లేరు”అని చెప్పాడు.

#అధర్వణవేదము

 నాల్గవ ప్రియ శిష్యుడైన సుమంతుడికి అధర్వణ వేదం బోధించి "అస్త్రరూపం అధర్వణ వేదానికి ఉపవేదం. గోత్రం బైజానకము. అధిదేవత ఇంద్రుడు. త్రిష్ఠుప్ ఛందస్సు, ఈ వేదానికి తీక్షణమైన ఆకారం, నల్లని రంగుగల కామరూపుడు, ఏకపత్నీవ్రతుడు, ఏడు మూరల పొడవుగల దేహంగల వాడు వేదపురుషుడు. ఈ వేదానికి శాఖలు తొమ్మిది, కల్పాలు అయిదు ఉన్నాయి. మన భరతభూమిలో అన్ని వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేయగల అతిరధులెందరో ఉండేవారు. అందుచేతనే ఈ వేదాలన్నీ ఇప్పటికీ నిలిచివున్నాయి.


గురుచరిత్ర నుండి :-

తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


Post:- సనాతన ధర్మం

Facebook:- 


రావిచెట్టు-మహిమ-2

 భారతీయ సంస్కృతి:రావిచెట్టు-మహిమ-2


రావిచెట్టును శనివారం తాకవచ్చు అని శాస్త్రములో చెప్పబడింది.ఇలా చెప్పడములో ఒక అభిప్రాయము కనిపిస్తుంది. దీనికిఅనేక కారణములు . ఏదయినా సూక్ష్మముగా పరిశీలించాలి. పూర్వకాలంలో ప్రజలను హింసించి వేధించే రాక్షసులు ఉండేవారు. ఒకడు పూర్వకాలము రూపము ధరించి ఉంటాడు.రెండవవాడు చెట్టు వద్ద ఉండి దూరముగా పోయే వారిని పిలిచి చెట్టును తాకమని చెప్పేవాడు. అలా త తాకగానే హింసాప్రవృత్తి గల వాడు నిజరూపముతో కనిపించి వానిని సంహరించేవాడు. ఇద్దఱు భక్షించేవారు. శనైశ్చరులవారు వారిని సంహరించి ప్రజలకు మేలు చేసారు. శనిచాలా బలి. అందుకని భక్తితో శనివారం తాకుతారు. తాకితే పుణ్యము కూడ వస్తుంది. ఇది కాక శనివారం రావిచెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది రావిచెట్టు చక్రధారి శ్రీమహావిష్ణువు.పుత్రులు లేని స్త్రీలు రావిచెట్టు కొమ్మకు ఎఱ్ఱని దారము కట్టి తమను అనుగ్రహించమనే ఆచారము ఉంది. ఆచారాలలో ధర్మము గలదు. రావిచెట్టును ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు సంతానమును కలుగుతుంది.ఆగాలి తగలాలి. వంధ్యాదోషాలను, గర్భాశయదోషాలను పోగొట్టే శక్తి ఈ చెట్టు గాలికి ఉంది.


(ఇంకా ఉంది) మీ నిష్ఠల సుబ్రహ్మణ్యశాస్త్రి

Abhiruchi Caterers hyderabad

 Abhiruchi Caterers

9000160619

9652771122

References seeking from Event managers,  prospective brides,  bridegroom and respective parents,  relatives and within their circle. 


 Delicious

 Food Morning to all  


*Abhiruchi Shiva Kumar 


Founder & Director 

Abhiruchi Caterers 

(The ZZZABBBURRRdust Food Makers)

*Since nearly 2 Decades

*Capacity ::

 10 wedding catering at a time and 10000 plates under one roof

*Specialists::

Weddings. Receptions up-to 600kms

corporate,  house parties all other occasions up-to 90kms

*USP::Hygienic and Delicious Food


Thank you

Abhiruchi Shiva Kumar

Canada visas

 Dear Sir | Friends,


common types of Canada visas along with their names:


🇨🇦 1. Visitor Visa (Temporary Resident Visa) 🛂

🇨🇦 2. Study Permit (Student Visa) 📚

🇨🇦 3. Work Permit (Employment Visa) 💼

🇨🇦 4. Express Entry (Permanent Residency Visa) 🛂

🇨🇦 5. Family Sponsorship Visa (Family Class Sponsorship) 👨‍👩‍👧‍👦

🇨🇦 6. Working Holiday Visa (International Experience Canada) 🌎

🇨🇦 7. Provincial Nominee Program (PNP) Visa 🏞️

🇨🇦 8. Super Visa (Parent and Grandparent Visa) 👵👴

🇨🇦 9. Business Visa (Investor Visa, Entrepreneur Visa) 💼

🇨🇦 10. Refugee and Humanitarian Visa (Asylum Seeker Visa) 🤝


These visa types cater to various purposes and circumstances for individuals planning to visit, study, work, or immigrate to Canada. 

అశోక చక్రవర్తి*

 *హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్*.


[ Courtesy : Sridhar ] 


♦️ మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??❓❓❓❓❓.


▪️ఎంత ఆలోచించినా❓ "సమాధానం" దొరకలేదు కదా! 

మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 


▪️ # అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 

" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


▪️# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.


▪️ # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... ( *అనడం సరికాదు. అశోక చక్రవర్తి - కొంత భూ భాగానికి పరిమితమై అఖండ భారత్ ను పాలించాడు. కానీ, మనకు చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే - మొట్ట మొదటి గొప్ప చక్రవర్తి ఈ భూ మండలాన్నంతటినీ పరిపాలించి - యింతటి చక్రవర్తి ఈ భూ మండలం మీద వేరే ఎవరు లేడని, అందరి చేత వినోళ్ల కొనియాడబడిన భారత చక్రవర్తి : ✅పృథ్వి మహారాజు / పృధు చక్రవర్తి✅*


# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 


# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.

▪️ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 


▪️# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 


▪️# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది

భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 


▪️ # వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేoడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలు నిర్మించ బడ్డాయి. 


▪️# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 


▪️# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి. *చంపడం ఆగిపోయింది*. 


▪️# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* " జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? ❓❓❓❓❓.


▪️లేదా ......

*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* ❓❓❓❓❓.


▪️ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??❓❓❓❓❓. ( *అసలు చరిత్రను మరుగు పరచి - తప్పుడు చరిత్ర ను ఈ దేశం పిల్లలకు స్కూళ్లలో బోధించిన నెహ్రూ దీనికి కారణం* )


▪️# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 

*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? ❓❓❓❓❓.


▪️ *చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 


▪️చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు అలెగ్జాండర్ 

" *వెనుదిరగవలసి వచ్చింది* ".


▪️# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 




♦️ *వర్ధిల్లాలి భారతి యశస్సు*

*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*


 ♦️ *భారత్ మాతాకీ జై* 🇮🇳

✊✊✊✊✊✊


🕉️ *హరిః ఓమ్*.

తిరుమల సర్వస్వం

 🌹 *ఓం నమో వేంకటేశాయ*🌹

*తిరుమల సర్వస్వం*…🙏


"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన

వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"

                  


అనగా - "విశ్వంలో తిరుమలకు సమానమైన పుణ్యక్షేత్రం లేదనీ, గతంలోగానీ - వర్తమానంలోగానీ - భవిష్యత్తులోగానీ శ్రీవేంకటేశ్వరునితో సరితూగ గల దేవుడు లేడని, ఉండబోడని" అర్థం.


అటువంటి దైవం నివసించే "బంగారుమేడ" నిర్మాణవైశిష్ఠ్యం గురించి మనం తెలుసుకో బోతున్నాం. శ్రీవారి ఆలయానికి మరోపేరే *బంగారు మేడ*. 


*శ్రీవారి ఆలయ నిర్మాణ వైశిష్ఠ్యం*

----------------------------------------

సప్తగిరులు, అంటే *శేషాచలం, గరుడాచలం, వేంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం* అనే *ఏడుకొండల* శిఖరశ్రేణుల మధ్య కొలువైన శ్రీవారి ఆలయం, మూడు ప్రాకారాలు - మూడు ప్రదక్షిణ మార్గాలతో విరాజిల్లుతోంది. అయితే, కేవలం *వైకుంఠ ఏకాదశి - ద్వాదశి పర్వదినాల్లో మాత్రం తెరిచివుంచే వైకుంఠద్వారంతో కలుపుకుంటే, నాలుగు ప్రాకారాలు, నాలుగు ప్రదక్షిణ మార్గాలుగా చెప్పుకోవచ్చు. *ప్రాకారము* అంటే *'కుడ్యము' లేదా 'గోడ'.* 


అ ప్రాకారాలు వరుసగా -


1. మొదటి ప్రాకారము లేదా *మహా ప్రాకారము*

2. రెండవ ప్రాకారము లేదా *సంపంగి ప్రాకారము*

3. మూడవ ప్రాకారము లేదా *విమాన ప్రాకారము*

4. నాలుగవ ప్రాకారము లేదా *వైకుంఠ ప్రాకారము*


ప్రతి ప్రాకారాన్ని చుట్టి ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని కూడా అదే పేరుతో పిలుస్తారు. 


ఒకటవ ప్రాకారానికి చుట్టూ, దేవాలయానికి బాహ్యంగా ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని *మహా ప్రదక్షిణమార్గం*, 


మొదటి మరియు మరియు రెండవ ప్రాకరాల మధ్యభాగాన్ని *సంపంగి ప్రదక్షిణ మార్గం*, 


రెండవ మరియు మూడవ ప్రాకారాల మధ్యభాగాన్ని *విమాన ప్రదక్షిణమార్గం,*


మూడవ మరియు నాల్గవ ప్రాకారాల మధ్యభాగాన్ని *వైకుంఠ ప్రదక్షిణమార్గం* - గా  పిలుస్తారు.


మొదటి మూడు ప్రదక్షిణ మార్గాలూ మనకు సుపరిచితమే గానీ, మహద్భాగ్యంగా చెప్పుకోబడే, వైకుంఠప్రదక్షిణ మార్గం చూడగలగటం మాత్రం అత్యంత అరుదుగా, శ్రీవారి సంపూర్ణ కటాక్షంతో మాత్రమే జరుగుతుంది. 


ఈ ప్రాకారాలు మరియు ప్రదక్షిణమార్గాల గురించి వీలైనంత వివరంగా తెలుసుకుందాం...


*మహా ప్రదక్షిణమార్గం*

--------------------------------

ప్రధానాలయం చుట్టూ సుమారు ఇరవై అడుగుల ఎత్తు, 1350 అడుగుల చుట్టుకొలతతో గంభీరంగా కానవస్తున్న దీర్ఘచతురస్ర ప్రాకారం చుట్టూ బాహ్యంగా ఉండే ప్రదక్షిణ మార్గాన్ని *మహాప్రదక్షిణమార్గం* గా పిలుస్తారు. ఈ మార్గం లోనే నాలుగు మాడవీధులు ఉన్నాయి.  


ఈ ప్రాకారం ప్రదక్షిణ పూర్తిచేస్తే మనం - ఆలయాన్నీ, ఆలయం వెనుకభాగంలో ఉండే ప్రేక్షక గ్యాలరీలను, లడ్డూ కౌంటర్లనూ, ఆదివరాహస్వామి ఆలయాన్నీ, స్వామిపుష్కరిణినీ - ఓ మారు చుట్టినట్లే. అంటే, ఈ మహాప్రాకారాన్ని చుట్టి ఉండే, విశాలమైన తూర్పు-దక్షిణ-పడమర-ఉత్తర మాడవీధుల్లో, సవ్యదిశగా సంచరిస్తా మన్నమాట. స్వామివారి ఊరేగింపులన్నీ ఈ 

మాడవీధుల్లోనే జరుగుతాయి.


ఈ వీధులన్నీ ఒక్కప్పుడు చాలా ఇరుకుగా ఉండేవి. అయితే, కాలం గడుస్తున్నకొద్దీ, వీటిని వెడల్పుగా, అధునాతనంగా - శ్రీవారి ఉత్సవరథాలు నిరాటంకంగా తిరగటానికి, ప్రేక్షకులు గ్యాలరీలలో సౌకర్యవంతంగా కూర్చొని తిలకించడానికి వీలుగా తీర్చిదిద్దారు. అయితే, ఈ విస్తరణ కార్యక్రమం వల్ల ఆ వీధుల్లో ఒకప్పుడు ఉండేటటువంటి - శిల్పకళ ఉట్టిపడే అనేక మంటపాలు, కట్టడాలు కనుమరుగయ్యాయి.  ఈ మధ్యకాలం వరకూ కూడా, ఆలయానికి ఎదురుగా, చాలా సందడిగా ఉండే "వెయ్యికాళ్ళ మంటపం" మనకు సుపరిచితమే. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది. దాని కథా - కమామిషు మరోసారి తెలుసుకుందాం.


ఈ నాల్గు మాడవీధుల కలయికతో ఏర్పడే చతుర్భుజి  కి ఆగ్నేయమూలలో స్వామివారి మందిరం కొలువై ఉంటుంది. 


ఈ *మహాప్రదక్షిణమార్గం* లేదా 'మాడవీధుల' లో ఉండే విశేషాల్ని ఇప్పుడు పరికిద్దాం -


ఆలయ మొదటిప్రాకారం లేదా మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ, ఆలయానికి తూర్పుగా *మహాద్వారం*, దానికి ఎదురుగా, ఆలయానికి వెలుపల *గొల్లమంటపం* ఉంటాయి. ఈ మంటపం గురించి కూడా మరోసారి ముచ్చటించు కుందాం. 


*తూర్పు మాడవీధి* లో, మహాద్వారానికీ - గొల్లమంటపానికి మధ్య నుంచి దక్షిణదిశగా వెళితే, మాడవీధి చివరగా, ప్రాచీనమైన పాత సహస్రదీపాలంకరణ సేవ మంటపం వస్తుంది. సాధారణ సమయాల్లో ఈ మంటపం మూయబడి ఉంటుంది.  సహస్రదీపాలంకరణ సేవను ప్రస్తుతం దానికి ఎడం ప్రక్కనే ఉన్న విశాలమైన మంటపంలో జరుపుతున్నారు. ఆ పాతమండపం వెనుక, ఎత్తైన ప్రదేశంలో హాథీరాంబాబా మఠం ఉంటుంది.


తూర్పుమాడవీధి చివరినుంచి కుడిప్రక్కకు తిరిగి, *దక్షిణమాడవీధి* లో ప్రవేశించి తిన్నగా వెళితే, మొదటగా ఎడం ప్రక్కన "సుపథం" మార్గం కనపడుతుంది. అది దాటగానే, సంపంగి వృక్షాలనీడలో తిరుమలనంబి ఆలయం, దాని తరువాత క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి వెళ్ళే ఓవర్ బ్రిడ్జి కనపడతాయి. 


దక్షీణమాడవీధిలో చివరగా ఉండే అనంతాళ్వార్ తోట ప్రవేశమార్గం మీదుగా కుడిప్రక్కకు తిరిగితే *పడమర మాడవీధి* లోకి ప్రవేశిస్తాము. వెంటనే మనకు "చిన్నజియ్యంగారిమఠం", "గోవిందనిలయం" అనబడే అర్చకుల క్వార్టర్సు కనబడతాయి. అంటే ఇప్పుడు మనం సరిగ్గా ఆలయం వెనుకవైపు ఉన్నామన్నమాట. 


ఆ వీధిలో తిన్నగా వెళ్ళి మరలా కుడి ప్రక్కకు తిరిగి *ఉత్తరమాడవీధి* లోకి ప్రవేశించగానే, వరుసగా - లక్ష్మీనరశింహస్వామి ఆలయం (ఈయన భోగనరశింహుడు. యోగనరశింహుడు విమాన ప్రదక్షిణంలో ఉంటారు), వైఖానస అర్చకనిలయం, స్వామిపుష్కరిణి, ఆదివరాహస్వామి ఆలయం, వ్యాసరాజ ఆహ్నీకమండపం, దాని ప్రక్కనే కోనేటిగట్టు ఆంజనేయస్వామి ఆలయం, వాటికి ఎదురుగా వైఖానస ఆగమశాస్త్రానికి మూలపురుషుడైన విఖనసమహర్షి ఆలయం, ప్రక్కనే రాధాగోపాల ఆలయం, దాన్ని ఆనుకుని చదువులతల్లి సరస్వతికే గురువైన హయగ్రీవుని ఆలయం కనపడతాయి. 


అవి దాటి మళ్ళా కుడిప్రక్కకు తిరిగి *తూర్పు మాడవీధి* లోకి ప్రవేశించి తిన్నగా వెళితే మనకు కుడిప్రక్కగా ఆలయ మహాద్వారం వస్తుంది. అంటే, మనం మహాప్రదక్షిణ పూర్తి చేసుకుని, బయలుదేరిన చోటికే తిరిగి చేరుకున్నా మన్నమాట. ఈ ప్రదక్షిణ మార్గంలో, ఆదివవరాహుని ఆలయం, స్వామిపుష్కరిణి, వ్యాసరాజమంటపం, ఆంజనేయుని ఆలయం, ప్రధానాలయం తప్ప మిగిలినవన్నీ మనకు ఎడం ప్రక్కనే ఉంటాయి. 


తూర్పు మాడవీధిని మినహాయిస్తే, మిగిలిన మూడు మాడవీధుల  ప్రాంతమంతా, ఇరువైపులా, విశాలమైన ప్రేక్షక గ్యాలరీలు ఉంటాయి. బ్రహ్మోత్సవసమయంలో ఈ గ్యాలరీలన్నీ, స్వామివారి వాహనసేవలను చూడటానికి వేచిఉండే లక్షలాది భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి. ఈ మాడవీధులను అనుసంధానిస్తూ, స్వామివారి భక్తాగ్రేసరులైన హాథీరామ్ బాబా, తిరుమలనంబి, అనంతాళ్వార్, తరిగొండ వెంగమాంబ గార్ల స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆయా సందర్భాలలో వాటి గురించి తెలుసుకుందాం.


*మహాద్వారం*

------------------------------

మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ ఉన్న ద్వారమే *మహాద్వారం.* ఇదే ఆలయం యొక్క *ప్రవేశ ద్వారం.* ఇది తప్ప ఆలయం లోనికి ప్రవేశించటానికి, బయటకు నిష్క్రమించడానికి వేరే మార్గంలేదు. దీనికే "పడికావలి", "సింహద్వారం", "ముఖద్వారం", తమిళంలో "పెరియ తిరువాశల్ (పెద్దవాకిలి)" - అంటూ అనేక పేర్లు ఉన్నాయి. ఈ పెద్దవాకిలికి ఇత్తడిరేకు తాపడం చేయబడిన కారణంగా, దీన్ని "ఇత్తడివాకిలి" అనికూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించే భక్తులు ఒకటవ వైకుంఠం క్యూ, లేదా  రెండవ వైకుంఠం ద్వారా మాత్రమే వచ్చి, ముందుగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన నిరంతరం ప్రవహించే నీటితో పాద ప్రక్షాళన చేసుకొని, 'మహాద్వారం' గుండా ఆలయంలోకి ప్రవేశించాలి. ఈ మార్గానికి ఇరుప్రక్కలా అత్యద్భుత శిల్పకళతో అలరారుతూ, సమాంతరంగా ఉండే రెండు రాతిద్వారాలు ఉన్నాయి. బయటి వైపు ద్వారానికి  రెండు పెద్ద చెక్కవాకిళ్ళు (తలుపులు) అమర్చబడి ఉన్నాయి. ఉత్తరంవైపు ఉన్న పెద్దవాకిలి నందుండే చిన్న తలుపులో నుంచి, మహాద్వారం మూసిఉండే సమయంలో  ఆలయసిబ్బంది రాకపోకలు సాగిస్తారు.


*మహాద్వారం గోపురం* లేదా *మహారాజగోపురం*

----------------------------

మహాద్వారం పైభాగాన - శిల్పకళా  చాతుర్యం ఉట్టి పడుతూ, యాభై అడుగుల ఎత్తుతో, ఐదు అంతస్తులతో, శ్వేతవర్ణంతో, సప్త కలశాలతో శోభితమైన *రాజగోపురం* లేదా *మహాద్వారగోపురం* విరాజిల్లుతూ ఉంటుంది. ఉత్సవసమయాల్లో పుష్పాలంకృతమై, విద్యుద్దీపాల కాంతిలో మరింత శోభాయమానంగా ఉంటుంది. 13 వ శతాబ్ధంలో ప్రారంభమైన ఈ రాజగోపుర నిర్మాణం, తరువాతి కాలంలో అంచెలంచెలుగా పూర్తైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.


*శంఖనిధి - పద్మనిధి*

------------------------------

పాదప్రక్షాళన చేసుకోగానే, ఆలయ మహాద్వారానికి ఇరువైపులా దిగువభాగంలో, సుమారు రెండు అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరు శ్రీవారి సంపదను సంరక్షించే దేవతలు. ఆనందనిలయుని అంతులేని ఆస్తుల్ని అమరులే రక్షించాలి గానీ, అల్పమానవుల్ల అవుతుందా?

ఇతిహాసాల ప్రకారం, ఒకానొకప్పుడు కుబేరుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి శంఖనిధి, పద్మనిధి, పుష్పకవిమానాలను వరాలుగా పొందాడు. శ్రీవారికి, పద్మావతీ పరిణయ సందర్భంలో తాను అప్పుగా ఇచ్చిన 14 లక్షల బంగారు నాణాల్ని వడ్డీతో సహా తిరిగి తీసుకునే నిమిత్తం, కుబేరుడే ఆ బ్రహ్మదత్త దేవతలను శ్రీవారి సంపదలకు కాపుంచాడని భక్తుల విశ్వాసం. 

ఇందులో - ఎడమవైపు, అంటే దక్షిణదిక్కులో ఉండే రక్షకదేవతయైన *శంఖనిధి* రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. మందిరంలోకి ప్రవేశించేటప్పుడు, ఈ దేవతను స్ప్రుశించి నమస్కరించుకోవచ్చు. కుడి వైపున ఉండే దేవత *పద్మనిధి* రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. క్యూ నిబంధన కారణంగా, దేవాలయం లోంచి  బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ దేవతను స్ప్రశించగలం. 

ఈ నిధిదేవతల పాదాలవద్ద, ఆరంగుళాల ఎత్తుగల, నమస్కారభంగిమలో ఉన్న విజయనగర రాజైన అచ్యుతరాయలు విగ్రహాన్ని చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విగ్రహాల్ని ఆ రాజే ప్రతిష్ఠించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆగమశాస్త్రనుసారం, ఈ నిధిదేవతలను ఆలయ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయడం సాంప్రదాయం. 


*అనంతాళ్వార్ గడ్డపార (గునపం)*

------------------------------------

పడికావలి దాటగానే, దేవాలయంలోకి వెళ్తుంటే, ద్వారానికి ఉత్తరంవైపు పై భాగంలో, ఓ 'గునపం' లేదా 'గడ్డపార' గోడకు వ్రేలాడదీయబడి ఉంటుంది. ఇది సుమారు వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనది.  దీనికి సంబంధించి, అత్యంత ఆసక్తికరమైన కథను శ్రీవారి మహాభక్తుడు *అనంతాళ్వార్* చరిత్రలో వివరంగా తెలుసుకుందాం. సాక్షాత్తూ శ్రీవారి గడ్డాన్ని గాయపరిచి, ఆ గాయం ఎల్లవేళలా పచ్చకర్పూరంతో అలంకరించి ఉండబడడానికి కారణమైన గునపాన్ని - ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, బయటకు నిష్క్రమించేటప్పుడు తప్పక దర్శించుకుందాం. 


అసంకల్పితంగానే మనమిప్పుడు ఆలయంలోనికి, అంటే రెండవ ప్రదక్షిణ మార్గమైన *సంపంగి ప్రదక్షిణ మార్గం* లోనికి ప్రవేశించి, దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం !!!

----------------------------------------


సంపంగి ప్రదక్షిణమార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎనలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారివారి కాంశ్యప్రతిమలు - మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతిమండపం, ప్రతి ప్రతిమ మనను చరిత్ర లోతుల్లోకి తీసుకొని పోతుంది. ఆ విశేషాలన్నింటినీ మరొకసారి.. తెలుసుకుందాం !!!

      *గోవిందా! గోవిందా!!*     

            *గోవిందా!!!*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🚩🚩🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*


   🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*🙏

వైశాఖ పురాణం🚩*_ _*9

 🍁 *శనివారం  - మే 18, 2024*🍁

_*🚩వైశాఖ పురాణం🚩*_   

   _*9 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

     *సతీదేహ త్యాగము*


☘☘☘☘☘☘☘☘☘

అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ ! ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా ! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను , పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా ! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము, పరలోక సంబంధము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబంధములుగ జలసేవ , అన్నసేవ , ఔషధసేవయని ఇహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును ఇహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ , విష్ణుసేవ , ధర్మమార్గసేవయను మూడునూ ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.


ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారముగ ఉపయోగపడినట్లుగ ఇహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు, విష్ణు, ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతీ ! యీ  కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును, ఆనందమును కలిగించును.


పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి *"నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను , చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు , ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను, పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా ! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని ఇచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు , సర్వోత్తముడు , దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ , భార్యను జూచి భర్త లేచినట్లుగ, సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను, దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు.


కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని , ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే ఇట్లనెను. ఓహో ! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము ! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా ! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా ! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును, యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును ?   లోకములు, శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది ఇతని యైశ్వర్యము. ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. *'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు"* అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను.


యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.


పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా ! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.


యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను.


తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రీ ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త - లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా ?  ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా ? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి ? విధివిధానము వీరికి విముఖమైయున్నదా ? అని సతీదేవి పలికెను.


సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను , తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను, శివుని బహువిధముల నిందించెను.


రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి.


*వైశాఖ పురాణం తొమ్మిదవ* 

   *అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

          🍁 *శనివారం*🍁

       🌹 *మే 18, 2024*🌹

        *దృగ్గణిత పంచాంగం*                  

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -  వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*

*తిథి : దశమి* ఉ 11.22 వరకు ఉపరి *ఏకాదశి* 

వారం :*శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : ఉత్తర* *రా 12.23* వరకు ఉపరి *హస్త*

*యోగం  : హర్షణ**ఉ  10.25* వరకు ఉపరి *వజ్ర*

*కరణం : గరజి* ఉ 11.22 వణజి రా 12.37 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 10.30 - 12.00  సా 05.00 - 06.00* 

అమృత కాలం : *సా 04.16 - 06.04

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం : శేషం ఉ 07.14 వరకు*

*దుర్ముహుర్తం : ఉ 05.36 - 07.19*

*రాహు కాలం : ఉ 08.50 - 10.27*

గుళిక కాలం :*ఉ 05.36 - 07.13*

యమ గండం :*మ 01.41 - 03.18*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.36* 

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల  :‌ తూర్పు* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*

అపరాహ్న కాలం :*మ 01.22 - 03.57*

*ఆబ్ధికం తిధి : వైశాఖ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం :*సా 03.57 - 06.32*

ప్రదోష కాలం :*సా 06.32 - 08.45*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

_________________________

       🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

🌹 *మనోజవం మారుతతుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం* 

*వాతాత్మజం వానరయూథ ముఖ్యం* 

*శ్రీరామదూతం శిరసా నమామి* 

*శ్రీరామ రామ రామేతి* 

*రమే రామే మనోరమే* 

*సహస్రనామ తత్తుల్యం*

*రామ నామ వరాననే*🙏🙏🙏

🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 2 .

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 2 . 


      అంతకు ముందు పోస్టు నందు మీకు దక్షిణావర్తి శంఖం గురించి మీకు వివరించాను . ఇప్పుడు మీకు దక్షిణావర్తి శంఖం యొక్క పూజావిధానం వివరిస్తాను . 


     ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించుకుని ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని కొత్త గుడ్డని పరచి దానిపై శంఖువు యొక్క శిఖరం తూర్పు ,ఉత్తర ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్నిరకాల స్నానాలు చేయించాలి . మొదట శుద్ధోదక స్నానం అనగా శుభ్రమైన నీటితో స్నానం తరువాత పంచామృత స్నానం ( తేనె , ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , బెల్లం పంచామృతాలు .బెల్లం లేనప్పుడు పంచదార వాడవచ్చు .)  అటుపిమ్మట ఫలోదక స్నానం అనగా కొబ్బరి , బత్తాయి , నారింజ మొదలైన ఫలరసాలతో స్నానం చివరగా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి . 


                శుద్ధోధక స్నానం అయిన తరువాత శంఖానికి బొట్టుపెట్టి పసుపు , గంధములు మిశ్రమములు లేపనం చేసి ఆసనం పైన కూర్చుండబెట్టిన తరువాత ధూపదీపాలను సమర్పించాలి . అగరుబత్తి ధూపముతో పాటు సాంబ్రాణి ధూపము కూడా వేయవలెను . తరువాత పుష్పాలతో  అర్చిస్తూ క్రింద చెప్పబోవు మంత్రమును 1116 సార్లు ఉచ్చరించాలి . 


 మంత్రం  - 


 ఓం శ్రీo దక్షణావర్తి శంఖాయ నమః . 


       ఇక్కడ ముఖ్యముగా మరొక్క విషయాన్ని గుర్తు ఉంచుకొనవలెను . శంఖపూజ చేయుటకు మునుపు గణపతి పూజ చేయవలెను . హోమాము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం 1116 సార్లు మంత్రోచ్ఛారణతో హోమము చేయించి ఆ హోమగుండము నందలి విభూధిని శంఖానికి మొత్తం లేపనం చేసి ఆ తరువాత శంఖాన్ని పూజాస్థలము నందు పెట్టుకోవాలి . నైవేద్యం ఏదైనా తియ్యని వస్తువును సమర్పించవచ్చు . ఓపిక ఉన్నవారు శ్రీమహాలక్ష్మి సహస్త్ర నామార్చన చేయించుట మంచిది . 


  దక్షిణవర్తి గృహము నందు ఉండటం వలన కలిగేడు శుభాలు  - 


 *  ఈ శంఖువు యే గృహము నందు ఉండునో ఆగృహము నందు దరిద్రం అనే మాట వినిపించదు . 


 *  గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడును . 


 *  అన్నగృహములో అన్నవృద్ధి , లాకర్లు , అలమారాలు వాటిలో ధనవృద్ధి , పూజగది యందు ఉంచిన సమస్త సంపదల వృద్ది జరుగును . 


 *  దీని యందు గంగాజలం నింపి చల్లిన బ్రహ్మహత్యాది పాపాలు నశించును . సమస్త వస్తువులు , గృహము అంతా చల్లిన అన్ని రకాల దోషాలు పోవును భూతప్రేత , పిశాచ బాధ తప్పును . 


 *  నెగిటివ్ శక్తి నశించును . 


      పైన చెప్పిన ఫలితాలు సంపూర్ణముగా సిద్ధించాలి అంటే దోషములు లేనటువంటి శంఖువు సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహము నందు ఉంచుకొనవలెను . 


  దోషములు గురించి వివరణ - 


   *  పగిలినది , విరిగినది , ముక్క ఊడినది పనికిరాదు . 


 *  శంఖు పైభాగములో గరుకుగరుకుగా ఉండరాదు . 


 *  మచ్చలు , లోపలికి అణిగి ఉండునట్లు గుంతలుగా ఉండరాదు . 


 *  శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడం గాని విరిగిగాని ఉండరాదు . 


       శంఖువు తెలుపు రంగుతో ఉన్న సర్వశ్రేష్ఠం . అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్న కొంత పరవాలేదు . ఈ శంఖువు పుజ చేయుటకు గురువారం పుష్యమి నక్షత్రం , ఆదివారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు చాలా మంచిది . ఈ సమయాన్ని "పుష్యార్క యోగము " అని అందురు . లేకున్న విజయదశమి రోజు , కార్తీక పౌర్ణమి రోజు , మకరసంక్రాంతి రోజు పూజ జరిపించుటకు ఉత్తమమైన దినములు .  


       పైన చెప్పిన సమయములు దగ్గరలో లేకున్న రేవతి , విశాఖ , పుష్యమి , శ్రవణం , రోహిణి నక్షత్రాలు బుధ , గురు , శుక్రవారాలలో కలిసినవి సంభవిస్తే ఆ సమయాలలో పూజ  చెయవలెను . ఆయా గ్రహాల సహస్రనామాలతో పూజ చేయుట చాలా మంచిది . 


                సమాప్తం    


  

   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వేదవిద్యార్థులు కావలెను

 దయచేసి దీనిని విస్తృతంగా షేర్ చేయండి.


వేదవిద్యార్థులు కావలెను


శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవీ వేదవిద్యాలయము నందు 108మంది వేదవిద్యార్థులకు ఉచితముగా భోజన వసతులు ఏర్పాటుచేసి నాలుగు వేదములు చెప్పాలని సంకల్పించాము. కావున ఉపనయన సంస్కారం అయిన 9సంవత్సరముల నుండి 13 సంవత్సరముల వయస్సుగల బ్రాహ్మణ బ్రహ్మచారులు కావలెను. |బ్రహ్మచారులతల్లిదండ్రులు శీఘ్రముగా మమ్ములను సంప్రదించి వేదమంత్రములను చదివే అద్భుత | అవకాశమును మీ అబ్బాయికి కల్పించగలరు. వేదములు అంతరించిపోతున్నాయి వాటిని కాపాడు కోవాల్సినబాధ్యత ప్రతిభారతీయుడి మీదఉంది. కావున ఈవిషయాన్ని అందరికి షేర్చేసి వేదమాతను సేవించగలరు.


ఇట్లు తోటపల్లి చక్రవర్తి అవధాని శ్రీదేవీ వేదవిద్యాలయం, శ్రీశైలం. ໖໖: 9010291299, 9951499444

Btatuku


 

Siva



 

సర్వవ్యాపక చైతన్యమే

 *మోహముద్గరమ్*

(శ్రీ ఆదిశంకరకృతం)



శ్లో𝕝𝕝 

*త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః*

*వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః* ౹

*భవ సమచిత్తః సర్వత్ర త్వం*

*వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం* ॥24॥


భావం: *నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే*. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండుము.

కలవారి కోడలు

 కలవారి కోడలు

సంపాదన:చెన్నాప్రగడ పద్మావతి, పెదరావూరు

కలవారి కోడలు కలికి కామాక్షి

కడుగుచున్నది పప్పు కడవలోపోసి.

అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న

కాళ్ళకు నీళ్లిచ్చి కన్నీరునింపె.



"ఎందుకో కన్నీరు ఏమికష్టమ్ము?

తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు,

ఎత్తుకో బిడ్డను, ఎక్కు అందలము,

మీ అత్త మా మలకు చెప్పిరావమ్మ"


"కుర్చీపీటమీద కూర్చున్న అత్త,

మా అన్నలొచ్చారు మముబంపుతార?"

"నేనెరుగ నేనెరుగ, మీమామ నడుగు!"


"పట్టెమంచముమీద పడుకున్నమామ,

మా అన్నలొచ్చారు మముబంపుతార?"

"నేనెరుగ నేనెరుగ, మీబావనడుగు!"


"భారతము చదివేటి భావ, పెదబావ,

మా అన్నలొచ్చారు మముబంపుతార?"

"నేనెరుగ నేనెరుగ, మీ అక్కనడుగు"


"వంటచేసేతల్లి, ఓ అక్కగారూ,

మా అన్నలొచ్చారు మముబంపుతారా?"

"నేనెరుగ నేనెరుగ, నీభర్తనడుగు"



"రచ్చలోవెలిగేటి రాజేంద్రభోగి,

మా అన్నలొచ్చారు మముబంపుతార?"

"పెట్టుకో సొమ్ములూ, కట్టుకో చీర,

పోయిరా సుఖముగా పుట్టినింటికిని."



1960 దశకంలో రెండో తరగతి తెలుగు వాచకంలో ఈ గేయం పాఠ్యాంశంగా ఉండేది. అప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది ఈ గేయం చూస్తే. అప్పట్లో మనము బట్టీ పట్టి అభినయిస్తూ చెప్పేవాళ్ళం. చందమామ సంచికలో ఓసారి ప్రచురించిన గేయం ఇది.

ప్రయత్నం చేస్తే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో॥ *ఉద్యమేన హి సిద్ధ్యన్తి కార్యాణి న మనోరథైః*

        *న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః* !!


భావం: *ప్రయత్నం చేస్తే పనులు సిద్ధిస్తాయి కానీ? ఊరికే కోరికలు ఉన్నంతమాత్రాన సిద్ధించవు*.... సింహం నిద్రపోతూ ఉంటే మృగాలు వచ్చి దాని నోటిలో ప్రవేశించవు కదా ?.....


     👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః*

*వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః* ౹

*భవ సమచిత్తః  సర్వత్ర త్వం*

*వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం* ॥24॥


భావం: *నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే*. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.

రఘునాథ గద్యం


 

Deeni bhaavamemi


 

Help


 

*శ్రీ మంజునాథ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 320*


⚜ *కర్నాటక  :- కద్రి-మెంగళూరు*


⚜ *శ్రీ మంజునాథ ఆలయం*



💠 సహ్యాద్రిలో నివసించే పరశురాముడు క్రూరులైన క్షత్రియులను చంపి కశ్యపునికి భూములను దానం చేశాడని ప్రతీతి.  

అతను నివసించడానికి స్థలం కోసం శివుడిని ప్రార్థించాడు.  కడలి క్షేత్రంలో తపస్సు చేస్తే పరమశివుడు లోకకల్యాణం కోసం మంజునాథునిగా అవతరిస్తానని పరమశివుడు పరశురాముడికి అభయమిచ్చాడు.  

శివుని ఆజ్ఞ ప్రకారం పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలో విసిరి తపస్సు కోసం ఒక స్థలాన్ని సృష్టించాడు.  

పరశురాముని ప్రార్థనలకు తలొగ్గిన పరమశివుడు పార్వతీదేవితో మంజునాథునిగా దర్శనమిచ్చి లోకకళ్యాణం కోసం కద్రిలో బస చేశాడు.  

మంజునాథుని ఆజ్ఞ ప్రకారం సప్తకోటి మంత్రాలు ఏడు తీర్థాలుగా అవతరిస్తాయి.


💠 కద్రి మంజునాథేశ్వర ఆలయం మంగళూరులో ఉంది.  ఇది కద్రి కొండలపై ఉన్న మంజునాథ లేదా శివుని యొక్క అద్భుతమైన ఆలయం.


💠 మంజునాథేశ్వర దేవాలయం 10వ లేదా 11వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు.  ఇది 14వ శతాబ్దంలో పూర్తి రాతి నిర్మాణంగా మార్చబడింది.

10వ శతాబ్దం ప్రారంభంలో కద్రి బౌద్ధులకు కేంద్రంగా ఉండేది.  తరువాత బౌద్ధమతం తిరస్కరించబడినప్పుడు నాథ పంథా (ఒక కొత్త మత విశ్వాసం) ఇక్కడ ఉనికిలోకి వచ్చింది. 


💠 నాథ ప్రాంతం అనేది బౌద్ధమతంలోని మహాయాన విభాగం నుండి వజ్రయానం నుండి పొందిన మత విశ్వాసాల యొక్క సవరించిన రూపంగా నమ్ముతారు.  

తర్వాత నాథ ప్రాంతమంతా శివుడిని దేవతగా ఆరాధించడం ఎక్కువైంది.  అనుచరులను జోగి అని మరియు మఠాలను స్థానికులు జోగిముట్ అని పిలుస్తారు


💠 ఈ ప్రదేశాలలో లభించిన తొలి శాసనాలలో కద్రిని కద్రికా విహార అని మరియు మంగళపురాన్ని మంగళపుర అని పిలిచేవారు.

12వ శతాబ్దంలో అద్భుతమైన దేవాలయం విలక్షణమైన హిందూ నిర్మాణ శైలిలో (హిందూ ఆగమ శాస్త్రం) నిర్మించబడింది.  

తరువాత దీనిని 14-15వ శతాబ్దంలో గ్రానైట్ రాయితో పునర్నిర్మించారు మరియు మంజునాథ భగవానుడి పంచ లోహ విగ్రహాన్ని స్థాపించారు. 


💠 ఇప్పుడు, ఈ ఆలయ ప్రధాన దేవత మంజునాథ, ఇందులో శివలింగం ఉంది.  మూడు ముఖాలు మరియు ఆరు చేతులతో కూర్చున్న స్థితిలో ఉన్న లోకేశ్వరుని విగ్రహం భారతదేశంలోనే అత్యుత్తమ కాంస్య విగ్రహంగా పరిగణించబడుతుంది.  

ఇది దాదాపు 1.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.


💠 జోగీలు పరమశివుని భక్తురాలైనందున, శివుని రూపమైన మంజునాథుడిని పూజిస్తారు.  జోగిముట్ చుట్టూ పాండవ గుహలు అని పిలువబడే గుహలు ఉన్నాయి మరియు జోగిమట్ ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.  జోగిముట్ మరియు చుట్టుపక్కల అనేక చిన్న దేవాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఇది ఈ ప్రదేశానికి పవిత్ర రూపాన్ని మరియు వాతావరణాన్ని ఇస్తుంది.


💠 ఆలయం వెనుక భాగంలో ఎత్తైన ప్రదేశంలో సహజమైన నీటి బుగ్గ ఉంది.  దానిని గోముఖ అంటారు.  

కాశీలోని భాగీరథి నది నుండి నీరు ప్రవహిస్తుంది కాబట్టి దీనికి కాశీ భగీరథి తీర్థం అని పేరు వచ్చిందని నమ్ముతారు.  

ఈ బుగ్గ నుండి నీటిని దాని ప్రక్కనే ఉన్న వివిధ పరిమాణాలలో తొమ్మిది చెరువులలోకి వదులుతారు.  ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు సందర్శకులు ఈ చెరువులలో స్నానం చేస్తారు.



💠 వార్షిక జాతర మహోత్సవం జనవరి నెలలో జరుగుతుంది.  మకర సంక్రాంతి రోజున 9 రోజుల పండుగ ప్రారంభమవుతుంది.  మలరాయ దైవ బండారాన్ని కద్రి కంబాల గనడ కొట్టిగె ఇంటి నుండి ఊరేగిస్తారు 

ఉదయం పూట తీర్థ స్నానము, ద్వజస్తంభ ఆరోహణ, కంచి స్తంభాల వెలిగింపు, బలి ఉత్సవము జరుగుతాయి.


💠 ఉత్సవ బలి నాలుగు రోజుల పాటు జరుగుతుంది, ఇక్కడ మంజునాథ స్వామి వరుసగా నాలుగు దిక్కులలోని నాలుగు కట్టలను సందర్శిస్తాడు.


💠 పండుగ ఏడవ రోజున, సవారి "ఏడవ దీపోత్సవం" జరిగిన తర్వాత మరియు "మహా అన్న సమర్పణే"          

 (సామూహిక అన్నసంతర్పణ ) జరుగుతుంది.

ప్రసాదం అందించే రుచికరమైన వంటకాలను తినడానికి వేలాది మంది ప్రజలు గుమిగూడుతారు.


💠 మహా రథోత్సవం : 

 మరుసటి రోజు సామూహిక అన్నదానం, మహారథోత్సవం నిర్వహిస్తారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీ మంజునాథ స్వామి ఆశీస్సులు పొందేందుకు మరియు ఈ మహోత్సవంలో భాగస్వామ్యానికి తరలివస్తారు.

బెల్లి రథోత్సవం లేదా వెండి రథోత్సవం తరువాత జరుగుతుంది.


 💠 తులాభార సేవ, అవభృత స్నాన, చంద్రమండలోత్సవ, ధ్వజ అవరోహణ జరుగుతాయి.

ఉప్పును తగ్గిస్తే

 *ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు*


అధిక మోతాదుతో రోగాలు కొని తెచ్చుకొంటున్నాం

తాజా ఆహారం, సుగంధ ద్రవ్యాలతో చెక్‌ పెట్టండి

ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన

న్యూఢిల్లీ, మే 16: ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది.


దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్‌ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపింది.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్దల్లో సగటు ఉప్పు వాడకం 10.78 గ్రాములుగా ఉందని.. ఇది తాము సూచించిన 5 గ్రాముల పరిమితి కంటే ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్‌, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్‌, మెనియర్స్‌, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది. అధిక ఉప్పు వాడకం వల్ల ఏటా 18.9 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది. తాజా, తక్కువగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తినడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చని డబ్ల్యూహెచ్‌ వో సూచించింది. ఉప్పు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సలహా ఇచ్చింది.

మంచి జరుగుతుంది

 

సుభాషితం:


అభివాదన శీలస్య-నిత్యం వృద్ధోప సేవిన:

1 చత్వారి తస్య వర్ధంతే-కీర్తి రాయు ర్యశో బలం11


తేటగీతి:


మనసు దీర పెద్దలకు నమస్కరించి

 ప్రతి దినము వారి సేవలో బరగువార్కి 

మహిత కీర్తి, యాయుషు, శక్తి, మంచి పేరు 

తప్పక లభించు నాలుగు గొప్పగాను.


భావం: ప్రతి రోజూ పెద్దవారికి నమస్కరించి, 

సేవ చేసే వారికి కీర్తి, ఆయుష్షు, మంచి పేరు, శక్తి..అనేవి నాలుగు తప్పకుండా లభిస్తాయి.




పెద్దవారు ఎదురైనప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారము చేయువారికి మంచి జరుగుతుంది అనడంలో సందేహములేదు

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం       

          ( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )


                           భాగం 6/10 


శంకరుల అవతారం 


5.వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 


    ఈ రోజుల్లో, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్చన/ప్రార్థన/ఆరాధన విధానాన్ని ఒక్కొక్కరు తీసికొనివస్తున్నారు. అనేక సందర్భాలలో ఇతర దేవతారాధనలని నిరసించడం కూడా చూస్తూన్నాం. 

    మిగతా విధానాలపై కనీస అవగాహనలైనాలేక, తమదే సర్వస్వమనుకునే అనేక వర్గాలు తయారవుతున్నాయి. 

    యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో, శాస్త్రంపై సరియైన అవగాహనలేకుండానూ, 

    వారివారి పద్ధతులు మాత్రమే సరియైనవి అనినమ్మే ఆధునిక గురువుల విధానాలపై అందరూ ఆధారపడుతున్నారు. 


    పూర్వపురోజుల్లో ఏ యతి వచ్చినా, 

    చాతుర్మాస దీక్షకై, సంచారము ఆపి, ఆయా ప్రదేశాలలో ఆగిపోయినా, 

    ఆ ప్రాంతాలవారు సాంప్రదాయ భేదాలేవీలేకుండా, అందరూ ఆ యతిని దర్శించుకోవడం, వారిచ్చే సందేశం వినడం, పాదపూజలు చేయడం జరిగేవి. 

    దీనికి సరియైన కారణం జగద్గురువుల దృక్పథం. 


వివిధ ఆరాధనలు - పంచాయతనం  


    ఆదిశంకరులు ఆ రోజులలోనే వివిధ ఆరాధనా విధానాలని సమన్వయపరచి,  పంచాయతన పూజావిధానం ద్వారా అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. 

    దాని ద్వారా తత్త్వాన్ని తెలుపుతూ సమైక్య ఆరాధనా విధానాన్ని పటిష్ఠవంతంగా స్థిరపరిచారు.  


పంచశీర్షాలు 


గణపతి అథర్వశీర్షం, 

సూర్య అథర్వశీర్షం, 

నారాయణ అథర్వశీర్షం, 

శివ అథర్వశీర్షం, 

దేవీ అథర్వశీర్షం 

    - అనే ఐదు ప్రామాణికాలలో, 

    మొదటి నాల్గిటిలో "సృష్టి స్థితిలయా"లకి సంబంధించి ఒకే లక్షణాలు వర్ణించబడ్డాయి. 

    నాల్గవదైన దేవీ అథర్వశీర్షంలో మరింత ప్రత్యేకత కనిపిస్తుంది. 

    ఈ ఐదు దైవాలకి సంబందించి, దేశంలో ప్రధానంగా ఐదు ఆరాధనలు ఉన్నాయి.  

    అవి, గాణాపత్య, సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ అనే ఐదు మతాలకి చెందినవి. 


పంచభూతాలు - ఐదుగురు దేవుళ్ళు 


    పంచభూతాలతోనే ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ఐదు శక్తులూ ఐదు దేవతలకి సణబంధించినవిగా ప్రతిపాదింపబడ్డాయి.  

      అవి 

*శక్తి(పృథ్వి - భూ), 

*గణపతి(ఆపః - నీరు), 

*సూర్యుడు(తేజః - అగ్ని), 

*విష్ణువు(వాయుః - గాలి), 

*శివుడు(ఆకాశః)గా పంచభూతాలతో అన్వయించబడ్డాయి. 


విశేషం 


    పరమాత్మ ఒక్కొక్క కల్పంలో పంచభూతాలలో ఒక్కొక్కదానిని ఆధారంగా చేసికొని, ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాడు. 

    ఒక కల్పంలో వ్యాపకుడుగాయున్న విష్ణువై అవతరించాడు. ఆ కల్పంలో పరబ్రహ్మను నారాయణుగా స్తుతించారు. ఆ రూపంలో ఆయననర్చించిన ఉపాసకులు వైష్ణవులయ్యారు. నారయణ సూక్తం వంటివి ఆయనని స్తుతిస్తాయి. 

    అలాగే మరొక కల్పంలో సూర్యుడు అరుణంవంటివాటితో స్తుతించబడ్డాడు. 

    మరొక కల్పంలో అమ్మవారు శక్తిగా ఆరాధింపబడుతుంటే, మేధాసూక్తం,శ్రీసూక్తం వంటివి అమ్మవారిని కీర్తించాయి. 

    శివుని రుద్రంతో ఒక కల్పంలోనూ, 

    గణపతిని గణపతి సూక్తంవంటివాటితో మరొక కల్పంలోనూ స్తుతించారు. 


ఆరాధనా ప్రత్యేకత 


    పరమాత్మ వివిధ కాలాలలో వివిధ రూపాలుగా అవతరించినా, అన్నిరూపాలనీ ఎల్లప్పుడూ మనం ఉపాసించడం విశేషం. 

    ఐదు మూర్తులనీ ఒకేచోట చేర్చి, తాను ప్రధానంగా ఉపాసించే దేవతని మధ్యలోనూ, 

    మిగిలిన నలుగురినీ నలుమూలలానూ ఉంచి,  ఆరాధించే పంచాయతనాన్ని శంకరులు ఎంతగొప్పగా సమన్వయపరిచారో కదా! 


    ఈ విధంగా ఐదు రకాల ఆరాధనలలో, ఐదురకాల కేంద్రాలతో (Vishnu centric, Siva centric, Devi centric, Sun centric and Ganesh centric), ఐదుగురు దేవతలనూ కొలవడం అత్యంత ఆవశ్యకం. 


పంచభూతాలు - ప్రపంచము - పాంచభౌతిక దేహము 


    పంచభూతాలూ ఒక్కొక్కదానిలో సగభాగం (1/2),  మిగిలిన నాలుగూ కలిసి (1/8+1/8+1/8+1/8=1/2) సగంగా ఉంటాయి. దానిని పంచీకరణము అంటారు. 

    ఆ ఐదూ కలిస్తేనే ప్రపంచం.  

    పాంచభౌతిక దేహం కూడా ఆ ఐదిటి కలయికే!

    ఐదూ కలిస్తేనే దేహం, ప్ర-పంచమూ కూడా కదా! 


    వేదప్రతిపాదిత ఈ విధానాన్ని వెలికితీసి, ఆనాడే మనకి అందించిన శంకరుల అవతారం ఎంత విశిష్టమైనదో కదా! 


                         కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం -‌ దశమి - ఉత్తరాఫల్గుణి -‌‌ స్థిర వాసరే* (18.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విరాళాలు

 విరాళాలు ఇవ్వగలరు 


రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 


 


ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 


9848647145

శనివారం రాశి ఫలితాలు

 *

*18-05-2024 

 శనివారం స్థిరవాసరః

రాశి ఫలితాలు

•••••┉━•••••┉━━

మేషం

చిన్ననాటి  మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు.

---------------------------------------

మిధునం

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంద

---------------------------------------

కర్కాటకం

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు

---------------------------------------

సింహం

దైవ  కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

కన్య

సోదరులతో  కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి.  వ్యాపారస్తులకు నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

---------------------------------------

తుల

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  చిన్ననాటి  మిత్రుల నుండి ధన  సహయం  అందుతుంది.  స్ధిరాస్తి  క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృశ్చికం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన  వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.

---------------------------------------

ధనస్సు

ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.

---------------------------------------

మకరం

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో  పెద్దలతో  సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.

---------------------------------------

కుంభం

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

---------------------------------------

మీనం

వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.  నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.