16, జులై 2025, బుధవారం

Panchaag


 

పంచపునీతులు

 *పంచపునీతులు.....*


*⭐ వాక్ శుద్ధి*

*⭐ దేహ శుద్ధి* 

*⭐ భాండ శుద్ధి* 

*⭐ కర్మ శుద్ధి* 

*⭐ మన శుద్ధి*


*💠 వాక్ శుద్ధి :*

*వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు... పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు... మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.*


*💠 దేహ శుద్ధి :*

*మన శరీరం దేవుని ఆలయం వంటిది... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, రెండు పూటలా స్నానం చెయ్యాలి... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.*


*💠 భాండ శుద్ధి :*

*శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది.*


*💠 కర్మ శుద్ధి :*

*అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.*


*💠 మనశ్శుద్ధి :*

*మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి... మనస్సు చంచలమైనది... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి.*


*👉ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!*


*👉ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!*


*👉నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!*


*👉యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!*


*👉సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!*


*👉గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!*


*👉సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!*


*👉పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!*


*👉మనిషిలో భక్తి ప్రవేశిస్తే మనిషి మాధవుడు అవుతాడు !!*


*┈┉┅━❀꧁హరే కృష్ణ ꧂❀━┅┉┈*

         *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🦚📿🦚 🙏🕉️🙏 🦚📿🦚

ఆంజనేయ స్తుతి

 🌸ఆంజనేయ స్తుతి🙏

సీస పద్యం

రామభక్త హనుమ రావయ్య వేగమే 

పావన హనుమయ్య పరమ పురుష

సంజీవ రాయుడా సర్వజ్ఞ సామీర

సత్వరమే రమ్ము సాధు చరిత 

పవనతనయ మము పాలింప వయ్యనీ

సేవయే మాకును చింత తీర్చు

జలధిని దాటియు జానకి జాడను 

తెలిపిన తేజస్వి ధీరహనుమ

తే,గీ సూర్యుని దరికి చేరియు శ్రుతులు నేర్చి

వ్యాకరణపండితుడవైన వాయుపుత్ర

రామసుగ్రీవులకుమైత్రి లక్షణముగ

నెరిపినట్టిప్రసన్నాంజనేయ శరణు 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

పాండవ బీడు

 *పాండవ బీడు: (మాటల మూటలు - బూదరాజు రాధాకృష్ణ)*



భారత కథను ఉగ్గుబాలతో నేర్చినందువల్ల కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన పాండవులూ, వారి పరిపాలనలో అనాథలు, విధవలు, వృద్ధులు, యుద్ధంతో సంబంధంలేని వ్యక్తులూ ఉన్నందువల్ల దేశం బీడుగా మారిందనే భావమూ ఒంటపట్టి ఈ మాటకు విశేషార్థం వచ్చింది. నిజానికి పాడవ/ పాండవ అనే తెలుగు మాటకు 'దున్నని భూమి' అని అర్థం. వ్యవసాయానికి పనికిరాని బంజరు నేలనూ ఊసర క్షేత్రాలనూ మరుభూములనూ పాడవ భూములు.. తెలంగాణలో పడావు భూములు అంటారు. పాండవ అనేది దానికి రూపాంతరం. పాడవ/పాండవ బీడు అని ఈ అర్థాల్లో నిఘంటువులకెక్కిన మాట ఇది. ధ్వని సాదృశ్యంవల్ల తెలుగు సంస్కృతాల్లోని పాండవ శబ్దమూ పాండురాజు సంతానమూ ఒకటేనన్న భ్రమ కలిగిందన్నమాట. యువకులందరూ యుద్ధంలో హతులైనారు కాబట్టి పాండవుల పరిపాలనలో సేద్యం మందగించి రాజ్యం బీడుగా మారిందన్న భావం ఈ భ్రమకు ప్రధాన కారణం. పాదవ శబ్దం పాడు (బడిన) నేల అనే సమాసంలోని ' "పాడు'కు సంబంధించింది. పురాణకథలకున్న ప్రాబల్యమటువంటిరి.


సేకరణ

ఈశ్వరేచ్ఛ

 *_“ఈశ్వరేచ్ఛ” అంటే...ఏంటి???_*

=================



*ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. దాన్నే మనం "ఈశ్వరేచ్ఛ" అంటాం.* 


*దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం......* 


*ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం.*


*ప్రతి మనిషికీ ప్రతీ సంఘటనకీ తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని అతిక్రమించకూడదు.*


*అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య సంబంధితం కాదు. ఉద్యోగం చేస్తున్నచోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు. (అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉన్నప్పటికీ) ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు. అంతవరకే. ఆ హద్దు మీరవద్దు. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్నిఅతిక్రమించిన దోషం కలుగుతుంది.*


*శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు. మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన పరిథిని అతిక్రమించలేదు.*


*శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీశక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు.*


*కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళుమరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు.*

*భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు.*


*సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు.* 

*గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.. “ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు.*

*నువ్వు చేయవలసింది, నీ పరిథిలో చేయమని చెప్పాడు. ’ధర్మంపాటించు’ అన్నాడంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు.*


*కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు...”నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు. నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడే తప్ప “నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు. అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా…! అలా చేయలేదు.*


*అంటే... మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. “ఈశ్వరేచ్ఛ" అంటే కూడా అదే. ఏ కర్మకు ఏ ఫలితాన్నివ్వాలో నిర్దేశించడం తప్ప మరోటికాదు.*

నినుసేవించిన కష్టముల్ గలుగనీ

 శు భో ద యం 🙏


నినుసేవించిన కష్టముల్ గలుగనీ

నిత్యోత్సవంబ్బనీ జనిమాత్రుండననీమహాత్ముడననీ సంసారమోహంబు పై

కొననీ జ్ఞానముగలుగనీ గ్రహగతుల్గుదింపనీకీడు వ

చ్చిన రానీ అవినాకు భూషణములే!శ్రీకాళహస్తీశ్వరా!!

-శ్రీకాళహస్తీశ్వరశతకము-మహాకవి ధూర్జటి.


     స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! కష్టములే రానిమ్ము నష్టములేరానిమ్ము.సుఖములేరానిమ్ము దుఃఖములేరానిమ్ము సంసారవ్యామోహము ఆక్రమింపనిమ్ము,.గ్రహదుర్దోషములేకలుగనిమ్ము. మేలురానీ కీడు రానీ అవియెల్ల నీ ప్రసాదములేయని భావింతును. నిన్నువిడువను .నీసేవమరువనని దీనిభావము.

 భక్తునకు ఉండవలసినది

ఇటువంటి నమ్మకము.పట్టుదల.దీక్ష!

                         స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌟🌷🌟🌷🌷🌷🌷🌷

శ్రీమద్భాగవత కథలు*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹మంగళవారం 15 జూలై 2025🌹*

          ఈ రోజు నుంచి 

                   2️⃣``    

           *ప్రతిరోజూ...* 

  *మహాకవి బమ్మెర పోతనామాత్య..*

``

                  

     *శ్రీమద్భాగవత కథలు*               

```

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి తెనిగించి, ఆ అమృత భాండాగారాన్ని అచ్చతెలుగు వారందరికీ అందించారు. 


సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. 

```

‘పలికెడిది భాగవతమటనే పలికిన భవహర మగునట’``` అని తన 

వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో పోతన చెప్పారు.```

 

*భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలి కైన దమ్మిచూలి కైన*

*విభుదజనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపఱతు!*

```

పోతనార్యుని కవితా వైదుష్యానికి మచ్చుతునక ఈ పద్యం. ఈ చిన్న పద్యంలో ఎంతో గొప్ప భావం ఉన్నది. భాగవతం పురాణ గ్రంధమే కాక వేదాంత ధోరణి, తత్త్వము నిబిడీకృతమయిన మహా కావ్యము. దీనిలో భక్తితో పాటు వేదాంత ధోరణి అంతటా కనిపిస్తుంది. అందుకే భాగవతాన్ని అర్థం చేసుకొనుట కష్టమని పోతన విన్నవించుకున్నాడు. అదియునూ సామాన్యముగానా! శివునికి, బ్రహ్మకు కూడా సాద్యం కాదన్నాడు. మరి మహావిష్ణువు గురించి ఎందుకు చెప్పలేదు? 


ఈ కావ్యములో గాధలన్నియూ ఆయనవే కదా! అతని కధ చెప్పుకోవడం అతనికే సాద్యం. మరి పండితులకు కవులకు సామాన్యులకు కొరక బడేది కాదని సున్నితముగా చెబుతూ ఆ నారాయణుని కీర్తించాడు. భక్త శిఖామణి కృతికర్త. భక్త రక్షకుడు కృతి భర్త, కధానాయకుడు. దీనిలో ఇన్ని మర్మాలున్నాయి కనుకనే బ్రహ్మకు శివునకు మాత్రమే తప్ప నేనెంతవాడిని ‘విభుధ జనుల వలన విన్నంత కన్నంత’ అని సెలవిచ్చి తప్పించుకున్నాడు కాని వారెవరో చెప్పలేదు. 


ఆ కాలంలో విష్ణు కధలను చాలమంది పండితులు కధలు కధలుగా చెప్పుకునే సంప్రదాయముండెనేమో? ఆ వివరాలను సేకరించి, కావ్య రచనకు పూనుకున్నాడు. కాని అంతకు ముందే మూల భాగవతానికి (వ్యాసభాగవతం) వ్యాఖ్యానం వ్రాసిన శ్రీధర పండితుని మాత్రం చాలా వరకు కావలసిన చోట్ల వినియోగించుకున్న వివరాలు కావ్యమంతటా కనిపిస్తుంది. కొన్ని ఘట్టాలలో అతనిని మించి, సాహసించి, స్వతంత్రించి, ప్రయోగించిన, ఘాటుదనం కనిపిస్తుంది. ఇది ఈ భక్తకవి కవితారీతి.


```

*ఎన్నిసార్లు విన్నా.. పఠించినా.. పారాయణం* *చేసినా తనివితీరనివి భాగవత కథలు. పౌరాణికులు* *ధార్మికులు, మహాత్ములు ఈ కథలను సప్తాహంగానో, ప్రసంగాల ద్వారానో, సత్సంగాల్లోనో ప్రవచనాలందించడం సంప్రదాయం. ఈ భాగవత కథలను ఎంతో సరళంగా, ఆసక్తికరంగా, తమ కలం ద్వారా అందించారు*

 *ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనం జ్వాలానరసింహారావు గారు*

``

*చదివెడిది భాగవతమిది, చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్*

*చదివినను ముక్తి కలుగును, చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై*```

 

అంటూ సాక్షాత్తూ పోతనామాత్యులు ఆవహించినట్లుగా ఎంతో భక్తితో, అనురక్తితో, మీదు మిక్కిలి శ్రద్ధతో, దీక్షగా భాగవత కథాస్రవంతిని తమ కలం ద్వారా ఈ పుస్తకాన్ని, గళం ద్వారా సామాజిక మాధ్యమాల్లో అందించి అందరినీ ముగ్ధులను, పునీతులను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న విపత్కర సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమై స్వీయనిర్బంధంలో ఏదో వ్యాపకంతో కాలక్షేపం చేస్తుండగా, వనం జ్వాలానరసింహారావు గారు కేవలం ఆధ్యాత్మిక వ్యాపకంతో గత ఆరునెలలుగా క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. 


జ్వాలాగారు మొదట వేదభాష్య గ్రంథాలనన్నిటినీ తిరగేసి, తర్వాత భాగవత కథారచనను ఆరంభించి అంకితభావంతో ఒక పవిత్రయజ్ఞంలా పూర్తిచేశారు. గతంలో ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు (వాసుదాసస్వామి) తెనిగించిన ‘మందరం’ రామాయణం (పూర్వ) ఆరుకాండలను ఎంతో సరళంగా వచనంతో ‘మందర మకరందం’ గ్రంథాలుగా వెలువరించగా, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ఇస్తూ ఆరు గ్రంథాలను రామకార్యంగా సభాక్తికంగా ప్రచురించింది. దర్శనమ్ సహా వివిధ పత్రికల్లో వారు రాసిన వ్యాసాల సంకలనం ‘ధర్మధ్వజం’ అనే గ్రంథాన్ని కూడా దర్శనమ్ వెలువరించి పాఠకలోకానికి ఉచితంగా అందించింది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ చదవదగిన, ప్రతి ఇంటిలో దాచుకోదగిన

``` *శ్రీవనం జ్వాలానరసింహారావు* గారి *కలం నుంచి జాలువారిన ‘శ్రీమద్భాగవత కథలు'* పవిత్ర గ్రంథాన్ని కూడా ప్రచురించే భాగ్యం కలగటం దర్శనమ్ పరివారం భాగ్యం. ఈ అవకాశాన్ని కల్పించిన 

శ్రీ వనం జ్వాలానరసింహారావు గారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు. వారి ఆధ్యాత్మిక రచనాస్రవంతి ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పుస్తకానికి లేఔట్ సెట్టింగ్ అందించిన శ్రీనివాసరావు త్రిపురాన గారికి, అందమయిన ముఖచిత్రాన్ని అందించిన రామోజు గణేశ్ గారికి, పుస్తకాన్ని ముద్రించిన శ్రీ సాయి తిరుమల ప్రింటర్స్ అధినేత లక్ష్మి నర్సు గారికి ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు.

``

                              

             *(సశేషం)*


*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)

__________________ 

     *జ్వాలా వారి విశిష్ట* 

     *వ(ర)చనామృతం* 

                      

  *‘శ్రీమద్భాగవత కథలు'*


*మరుమాముల వెంకటరమణ శర్మ (పబ్లిషర్)

*సంపాదకులు, దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక.```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వ్రాసెను ఖడ్గసృష్టి కృతి

 *వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగ కవీంద్రుడునౌ రవీంద్రుcడే*

ఈ సమస్యకు నా పూరణ. 


వేసట నొందె నా సఖుడు విప్పడు చూపడు వాని పత్రమున్ 


వ్రాసితి నేదొ తోచినటు వాస్తవ మెంతయొ యీ పరీక్షలో 


కూసితి పిమ్మటన్ వినగ కూరిమి మిత్రుల ముందు నిట్లుగా


"వ్రాసెను ఖడ్గసృష్టి కృతి వంగ కవీంద్రుడునౌ రవీంద్రుcడే".


అల్వాల లక్ష్మణ మూర్తి.

చమత్కార పద్యం

 చమత్కార పద్యం


ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం


*అంచిత చతుర్ధ జాతుడు*

*పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్*

*గాంచి, తృతీయం బక్కడ*

*నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!*


*భావం:*

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 


ఏమీ అర్థం కాలేదు కదా!? 


ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 


చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*

 పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*

ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*

 తృతీయము అంటే *అగ్ని ,*

 ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి.... 


*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని... భావం* 


 *ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవి గారికి నమస్సుమాంజలి.!!!* 🙏

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 ఐదవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 

                ఐదవ భాగం

యోగులు తరచుగా ఓంను ధ్యానం చేస్తారు.

 సన్యాసం తీసుకున్నవారు కేవలం ఓం మాత్రమే జపిస్తారు. రుద్ర నమకం ఒక్కటి పారాయణం చేయవచ్చు. ఇంక ఏ మంత్రములు చూడరు.

 సాధారణంగా ఓం అని ఉచ్ఛరించినప్పటికీ, మంత్రం వాస్తవానికి మూడు అక్షరాలను కలిగి ఉంటుంది, అ , ఉ మరియు o( మ్ .) ఉన్నాయి.


చంద్రుని యొక్క కళలు పదహారు. పాడ్యమి నుంచి పూర్ణమి వరకు తిథులు పదిహేను. కాగా పదహారవ కళ సాక్షాత్తూ ఆ పరమేశ్వరి అయి ఉన్నది.అదే కామకళ 


షోడశీ తు కళా జేయా సచ్చిదానంద రూపిణీ ||


అంటే పరమేశ్వరియే షోడశీకళ. సాదాఖ్యకళ, చిత్కళ, ధృవకళ, బ్రహ్మకళ, పరమాకళ, కామకళ అని పిలువబడుతోంది. 

కామము అంటే కోరిక. సాధకుని కోరికలు తీర్చేకళ. అదే కామకళ. సాధకుడి కోరికలు అనేకానేకాలు ముఖ్యంగా అవి రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఇహానికి సంబంధించినవి అర్ధకామాలు. పరానికి సంబంధించినవి ధర్మమోక్షాలు. సంసార లంపటంలో కూరుకుపోయిన మానవుడు తన కష్టాలన్నీ తీరిపోవాలని, సుఖాలు పొందాలనుకుంటాడు. అందుకోసం ధన సంపాదన కావాలి. ఈ రెండింటి కోసమే అతడు ప్రాకులాడతాడు. అయితే ఉత్తర జన్మ ఉత్తమ జన్మ కావాలంటే ధర్మము తప్పనిసరి.

దానిద్వారానే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ రకంగా భక్తులకు చతుర్విధ పురుషార్ధాలను తీర్చేది ఆ పరమేశ్వరియే. అందుచేతనే ఆమె భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. కాబట్టి

కామకళ అనబడుతుంది.


ఇది సచ్చిదానంద స్వరూపము. కాబట్టి బిందుమండలంలో ఉంటుంది. అనగా శ్రీచక్రంలోని బిందువులో ఈ పరమేశ్వరి ఉంటుంది. మరి అక్కడ ఒక్క పరమేశ్వరియే ఉంటుందా? అన్నప్పుడు ఆ దేవి పరబ్రహ్మ స్వరూపము. అంటే శివశక్తుల సమ్మేళనము. కాబట్టి 'శివేన వినాశక్తిః' శివుడు లేకుండా శక్తి లేదు.

 శివశక్తులు ఇద్దరూ కలిసిన లలితా సహస్ర నామాలలో కామకళను వివరించటం జరిగింది.ఆ నామాలు ఇక్కడ చూద్దాము 

కామ్యా - కోరదగినటువంటిది.

జ్ఞానముచే పొందబడినది. ముముక్షువులచే కోరదగినది.

పరమేశ్వరి జ్ఞానరూపిణి. సాధకులు జ్ఞానభావంతో జీవాత్మ పరమాత్మ వేరుకాదు అని ఆ పరమేశ్వరుణ్ణి అర్చించినట్లైతే, అట్టివారికి మోక్షం ప్రసాదిస్తుంది. అందుచేత దేవి కామ్యా అనబడుతుంది. సృష్టి ప్రారంభం కాక ముందు పరమేశ్వరుణ్ణి సృష్టికి సుముఖునిగా చేసిన రూపవిశేషము ఆ దేవి. అందుకే ఆమె కామ్యా అనబడుతోంది.

కామము అనగా కోరిక. ఈ కోరికలన్నీ బుద్ధివలన కలుగుతాయి. బుద్ధికి చైతన్యము కలిగినప్పుడు పూర్వజన్మలలో చేసిన కర్మానుసారము ఈ కోరికలు కలుగుతాయి. అంటే జీవుల స్థాయిని బట్టే కోరికలు కలుగుతాయి..

అయితే ఈ కోరికలు నాలుగురకాలుగా ఉంటాయి. వీటిని ధర్మ, అర్ద కామ మోక్షలు అనే క్రమంలో కాకుండా వారి స్వభావాన్ని వేరే విధంగా వ్రాయవలసి వచ్చింది అవి

1. తాత్కాలికంగా ఇప్పుడున్న కష్టాలు తొలగిపోయి సుఖాలు పొందాలి అనుకోవటం. ఇది కామము. సాధారణంగా ఎక్కువ మంది ఈ మార్గంలో ఉంటారు కదా 


2. జీవించి ఉన్నంతవరకు దుఃఖము లేకుండా ఉండటము, సుఖాలు పొందాలి అనుకోవటము ఇది అర్ధము.


3. తనకు రాబోయే జన్మలలో దుఃఖం లేకుండా సుఖం పొందేటట్లు కోరటం. ఇది ధర్మము.


4. అన్ని జన్మలలోను నిత్య నిరతిశయ ఆనందాన్నే కోరటం. ఇది మోక్షము.


వీటిలో ధర్మాన్ని కోరేవాడు - ఉత్తముడు

అర్ధాన్ని కోరేవాడు - మధ్యముడు

కామాన్ని కోరేవాడు - అధముడు

మోక్షాన్ని కోరేవాడు - ఉత్తమోత్తముడు

జీవులు వారి కర్మఫలాన్ననుసరించే ఈ కోరికలు కోరతాయి. ఈ కోరికలు అన్నీ తీరుస్తుంది. ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె కామ్యా అనబడుతుంది.

కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.కామేశ్వరుని యొక్క కళా రూపమే కామకళారూపా అనే నామము 

కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.

కళ్యాణీ - శుభ లక్షణములు కలది.

జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.

కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.

                       సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శ్రీమద్భాగవత కథలు*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹మంగళవారం 15 జూలై 2025🌹*

          ఈ రోజు నుంచి 

                   2️⃣``    

           *ప్రతిరోజూ...* 

  *మహాకవి బమ్మెర పోతనామాత్య..*

``

                  

     *శ్రీమద్భాగవత కథలు*               

```

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి తెనిగించి, ఆ అమృత భాండాగారాన్ని అచ్చతెలుగు వారందరికీ అందించారు. 


సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. 

```

‘పలికెడిది భాగవతమటనే పలికిన భవహర మగునట’``` అని తన 

వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో పోతన చెప్పారు.```

 

*భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలి కైన దమ్మిచూలి కైన*

*విభుదజనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపఱతు!*

```

పోతనార్యుని కవితా వైదుష్యానికి మచ్చుతునక ఈ పద్యం. ఈ చిన్న పద్యంలో ఎంతో గొప్ప భావం ఉన్నది. భాగవతం పురాణ గ్రంధమే కాక వేదాంత ధోరణి, తత్త్వము నిబిడీకృతమయిన మహా కావ్యము. దీనిలో భక్తితో పాటు వేదాంత ధోరణి అంతటా కనిపిస్తుంది. అందుకే భాగవతాన్ని అర్థం చేసుకొనుట కష్టమని పోతన విన్నవించుకున్నాడు. అదియునూ సామాన్యముగానా! శివునికి, బ్రహ్మకు కూడా సాద్యం కాదన్నాడు. మరి మహావిష్ణువు గురించి ఎందుకు చెప్పలేదు? 


ఈ కావ్యములో గాధలన్నియూ ఆయనవే కదా! అతని కధ చెప్పుకోవడం అతనికే సాద్యం. మరి పండితులకు కవులకు సామాన్యులకు కొరక బడేది కాదని సున్నితముగా చెబుతూ ఆ నారాయణుని కీర్తించాడు. భక్త శిఖామణి కృతికర్త. భక్త రక్షకుడు కృతి భర్త, కధానాయకుడు. దీనిలో ఇన్ని మర్మాలున్నాయి కనుకనే బ్రహ్మకు శివునకు మాత్రమే తప్ప నేనెంతవాడిని ‘విభుధ జనుల వలన విన్నంత కన్నంత’ అని సెలవిచ్చి తప్పించుకున్నాడు కాని వారెవరో చెప్పలేదు. 


ఆ కాలంలో విష్ణు కధలను చాలమంది పండితులు కధలు కధలుగా చెప్పుకునే సంప్రదాయముండెనేమో? ఆ వివరాలను సేకరించి, కావ్య రచనకు పూనుకున్నాడు. కాని అంతకు ముందే మూల భాగవతానికి (వ్యాసభాగవతం) వ్యాఖ్యానం వ్రాసిన శ్రీధర పండితుని మాత్రం చాలా వరకు కావలసిన చోట్ల వినియోగించుకున్న వివరాలు కావ్యమంతటా కనిపిస్తుంది. కొన్ని ఘట్టాలలో అతనిని మించి, సాహసించి, స్వతంత్రించి, ప్రయోగించిన, ఘాటుదనం కనిపిస్తుంది. ఇది ఈ భక్తకవి కవితారీతి.


```

*ఎన్నిసార్లు విన్నా.. పఠించినా.. పారాయణం* *చేసినా తనివితీరనివి భాగవత కథలు. పౌరాణికులు* *ధార్మికులు, మహాత్ములు ఈ కథలను సప్తాహంగానో, ప్రసంగాల ద్వారానో, సత్సంగాల్లోనో ప్రవచనాలందించడం సంప్రదాయం. ఈ భాగవత కథలను ఎంతో సరళంగా, ఆసక్తికరంగా, తమ కలం ద్వారా అందించారు*

 *ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనం జ్వాలానరసింహారావు గారు*

``

*చదివెడిది భాగవతమిది, చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్*

*చదివినను ముక్తి కలుగును, చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై*```

 

అంటూ సాక్షాత్తూ పోతనామాత్యులు ఆవహించినట్లుగా ఎంతో భక్తితో, అనురక్తితో, మీదు మిక్కిలి శ్రద్ధతో, దీక్షగా భాగవత కథాస్రవంతిని తమ కలం ద్వారా ఈ పుస్తకాన్ని, గళం ద్వారా సామాజిక మాధ్యమాల్లో అందించి అందరినీ ముగ్ధులను, పునీతులను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న విపత్కర సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమై స్వీయనిర్బంధంలో ఏదో వ్యాపకంతో కాలక్షేపం చేస్తుండగా, వనం జ్వాలానరసింహారావు గారు కేవలం ఆధ్యాత్మిక వ్యాపకంతో గత ఆరునెలలుగా క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. 


జ్వాలాగారు మొదట వేదభాష్య గ్రంథాలనన్నిటినీ తిరగేసి, తర్వాత భాగవత కథారచనను ఆరంభించి అంకితభావంతో ఒక పవిత్రయజ్ఞంలా పూర్తిచేశారు. గతంలో ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు (వాసుదాసస్వామి) తెనిగించిన ‘మందరం’ రామాయణం (పూర్వ) ఆరుకాండలను ఎంతో సరళంగా వచనంతో ‘మందర మకరందం’ గ్రంథాలుగా వెలువరించగా, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ఇస్తూ ఆరు గ్రంథాలను రామకార్యంగా సభాక్తికంగా ప్రచురించింది. దర్శనమ్ సహా వివిధ పత్రికల్లో వారు రాసిన వ్యాసాల సంకలనం ‘ధర్మధ్వజం’ అనే గ్రంథాన్ని కూడా దర్శనమ్ వెలువరించి పాఠకలోకానికి ఉచితంగా అందించింది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ చదవదగిన, ప్రతి ఇంటిలో దాచుకోదగిన

``` *శ్రీవనం జ్వాలానరసింహారావు* గారి *కలం నుంచి జాలువారిన ‘శ్రీమద్భాగవత కథలు'* పవిత్ర గ్రంథాన్ని కూడా ప్రచురించే భాగ్యం కలగటం దర్శనమ్ పరివారం భాగ్యం. ఈ అవకాశాన్ని కల్పించిన 

శ్రీ వనం జ్వాలానరసింహారావు గారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు. వారి ఆధ్యాత్మిక రచనాస్రవంతి ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పుస్తకానికి లేఔట్ సెట్టింగ్ అందించిన శ్రీనివాసరావు త్రిపురాన గారికి, అందమయిన ముఖచిత్రాన్ని అందించిన రామోజు గణేశ్ గారికి, పుస్తకాన్ని ముద్రించిన శ్రీ సాయి తిరుమల ప్రింటర్స్ అధినేత లక్ష్మి నర్సు గారికి ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు.

``

                              

             *(సశేషం)*


*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)

__________________ 

     *జ్వాలా వారి విశిష్ట* 

     *వ(ర)చనామృతం* 

                      

  *‘శ్రీమద్భాగవత కథలు'*


*మరుమాముల వెంకటరమణ శర్మ (పబ్లిషర్)

*సంపాదకులు, దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక.```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ప్రసాదాలలో పోషక విలువలు !!*

 *ప్రసాదాలలో పోషక విలువలు !!*


శరీరంలో ఉన్న షట్ చక్రాల 

అవరోధాలు తొలగి జాగృతం

అవ్వడం పూర్ణ ఆరోగ్యం కోసం

ఋషులు మనకు అందించిన

అద్భుతమైన విధానం 


ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .


*జీర్ణశక్తిని పెంచే ' కట్టె పొంగళి*

బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .


*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*

బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .! 

                          

*మేధస్సును పెంచే దద్యోధనం*

బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది !!      

                     

*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబప్రసాదం*

బియ్యం , చింతపండు , ఎండుమిర్చి, పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు , పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం!!                       

                                *శ్లేష్మాన్ని తగ్గించే పూర్ణాలు* "పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .!!


*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*

బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం !!


*కొబ్బరి పాల పాయసం*

కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.


ఈ ప్రసాదం లు 

స్త్రీ రూపంలో ఉన్న నారాయణి

 జగన్మాయ కనకదుర్గాదేవి 

అంశా దేవతలకు

ఇక్కడ అమ్మ దుర్గం అనే శరీర 

రూపమే దుర్గమ్మ 


పురుష రూపంలో ఉన్న

నారాయణుడు విష్ణుమాయ 

శ్రీ మహావిష్ణువు అవతార

స్వరూపం లకు

ఇక్కడ శరీరంలో స్థితి పాలక

రూపంలో ఉండేది

శ్రీ మన్నారాయణుడు 


నివేదన చేయవచ్చు


రూపములు వేరే కానీ

ఇరువురు ఒక్కటే


సర్వే జనాః సుఖినోభవంతు 

లోకా సమస్తా సుఖినోభవంతు

⚜ శ్రీ ఇరై లీమా / లైరెంబి ఆలయం

 🕉 మన గుడి : నెం 1174


⚜ మణిపూర్ : హియాంగ్‌థాంగ్


⚜  శ్రీ ఇరై లీమా /  లైరెంబి ఆలయం



💠 హియాంగ్‌థాంగ్ భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని ఒక పట్టణం . ఇది పురాతన మెయిటే దేవత ఇరై లీమా (హియాంగ్‌థాంగ్ లైరేంబి ) కి అంకితం చేయబడిన  హియాంగ్‌థాంగ్ లైరేంబి ఆలయానికి ప్రసిద్ధి చెందింది . ఇది ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఉంది . 


💠 "హియాంగ్‌థాంగ్ లైరెంబి ఆలయ సముదాయం" ఎల్లప్పుడూ భక్తులలో ఆధ్యాత్మిక భావనను రేకెత్తిస్తుంది.

ఈ దేవతను దేవి దుర్గాగా భావిస్తారు


💠 ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు, కానీ దేవతగా పూజించబడే ఒక రాతి ముక్క ఉంది. 

ఈ ఆలయం ఒక కొండపై ఉంది, చుట్టూ అటవీ ప్రాంతం ఉంది. 

ఆలయ నిర్మాణం జపనీస్ పగోడా శైలిని పోలి ఉంటుంది. 


💠 ఈ ఆలయం షరోదియ దుర్గా పూజను ఘనంగా జరుపుకుంటుంది. ప్రధాన ఆచారాలలో నబపత్రిక పూజ, సంధి పూజ మరియు కుమారి పూజ ఉన్నాయి. 

ఈ ఆలయంలో మరో ప్రత్యేక కార్యక్రమం పంథోయిబి పూజ, ఇక్కడ మణిపూర్ ప్రజల యుద్ధ దేవత అయిన పంథాయిబి దేవతను పూజిస్తారు. 

ఈ ఆలయంలో హిందూ మాసం చైత్రంలో బసంతి పూజ నిర్వహిస్తారు.


🔆 పురాణం:


💠 హీబోక్ నింగ్థౌ ఒకప్పుడు మంత్రవిద్య మరియు మాయాజాలంలో నిపుణుడైన ఒక గొప్ప వంశ రాజు. అతనికి ఇరై లీమా అనే అందమైన కుమార్తె ఉంది, ఆమె అసాధారణంగా అందంగా ఉంది.

ఇరై లీమా అందానికి మోహింపబడి, ఖుమాన్ రాజు కోక్పా ఆమెను వివాహం కోసం సంప్రదించాడు. 

ఆమె తన తల్లిదండ్రుల కోరికలను పాటిస్తానని బదులిచింది.. కాబట్టి అతను హీబోక్ రాజును సంప్రదించాడు, అతను అంగీకరించలేదు.


💠 రాజు క్వాక్పా ఇరై లీమా తండ్రికి బహుమతులు పంపినప్పుడు, రాజు వాటిని రాయిగా మార్చాడు, వివాహాన్ని తిరస్కరించాడు. 

ఇది క్వాక్పాను బాధపెట్టింది, కానీ అతను ఆమెతో  పెళ్లిపై కోరిక వదులుకోలేదు.


💠 ఒకరోజు అతను పడవలో ఇరై లీమా వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించాడు. 

అతను వస్తున్నాడని చూసి ఆమె పారిపోయింది, మరియు ఆమె తండ్రి మరోసారి తన మాయాజాలాన్ని ఉపయోగించి పడవను రాయిగా మార్చాడు. 

కోపంతో, క్వాక్పా హైబోక్ నింగ్‌థౌపై దాడి చేయడానికి ప్రయత్నించాడు, కానీ మాంత్రికుడు అతన్ని కూడా రాయిగా మార్చాడు. 


💠 జరుగుతున్న ప్రతిదానికీ భయపడి, ఇరై లీమా తన తండ్రి నుండి పారిపోయి స్థానిక గ్రామస్తుడైన సారంగ్థెమ్ లువాంగ్బా ఇంట్లో దాక్కుంది. దాక్కున్నప్పుడు, ఆ జంట లేనప్పుడు ఆమె రహస్యంగా ఇంటి పనులు చేసింది.


💠 సారంగ్థెం లువాంగ్బా తన భార్య తోయిడింగ్జామ్ చాను అమురేయితో కలిసి వరి పొలంలో పని చేయడానికి వెళ్ళినప్పుడు, ఇయారి బయటకు వచ్చి సారంగ్థెం కుటుంబం యొక్క ఇంటి పనులన్నీ చేసేది.

సారంగ్థెం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు.


💠 ఒక రోజు, అతను త్వరగా ఇంటికి తిరిగి వచ్చి ఇంటి పనులు చేస్తున్న ఒక అందమైన కన్యను చూశాడు మరియు అతను దగ్గరగా వచ్చేసరికి, ఆమె ధాన్యాగారం క్రింద అదృశ్యమైంది. అతను అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఏమీ కనిపించలేదు.

తరువాత ఇరై లీమా అతని కలలో కనిపించి, "ఓ తండ్రీ, ఈరోజు నుండి నేను మీ వంశంలో విలీనం అయ్యాను. నేను మీ కుమార్తెని మరియు ఆమె వెంటనే అదృశ్యమైంది" అని చెప్పింది.


💠 అతను అదే విషయాన్ని రాజు సేని క్యామాబాకు నివేదించాడు, అతను ఆ ఆ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత, వారు సారంగథెమ్ దేవతను చూశారని మరియు ఆమెను పూజించడానికి తగిన ఏర్పాట్లు మరియు ఆచారాలు నిర్వహించాలని నివేదించారు.


💠 రాజు క్యాంబా లువాంగ్బాను తన వంశ దేవతగా పూజించమని మరియు ప్రతి సంవత్సరం అతని వంశ సభ్యులందరూ కూరగాయలు, పండ్లు సమర్పించి దేవత గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేయాలని కోరాడు. ఇరై లీమా ధాన్యాగారంలోకి ప్రవేశించడాన్ని సారంగథెమ్ లువానాగ్బా చూసిన రోజు లాండా మొదటి సోమవారం మరియు మైబాలు మరియు మైబిలు వచ్చిన రోజు లాండా మొదటి మంగళవారం. 

క్యాబా రాజు కాలం నుండి నేటికీ, సారాంగథెన్ సలైలు ప్రతి సంవత్సరం హియంతాంగ్ లైరెంబి అని పిలువబడే దేవత గౌరవార్థం చక్లాంగ్ కట్పా (గొప్ప విందు) నిర్వహిస్తారు.


💠 ప్రతి సంవత్సరం, దుర్గా పూజ మూడవ రోజున "బోర్ నుమిత్" (వరం ఇచ్చే రోజు) అనే ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు దేవత కోరిన వారికి ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు. 

ఇరై లీమా కథ, ఆమె దేవతగా రూపాంతరం చెందడం మరియు ఆమె ఆలయం చుట్టూ ఉన్న సంప్రదాయాలు కొనసాగుతాయి, ఆమెను గౌరవించడానికి చుట్టుపక్కల ప్రజలను ఒకచోట చేర్చుతాయి.


💠 ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత మరియు ఆధ్యాత్మికతను అనుభవించడానికి భక్తులు మరియు సందర్శకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం ఇది.


💠 ఇది ఇంఫాల్ నగరానికి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న హియాంగ్‌థాంగ్‌లో ఉంది.


రచన

©️ Santosh Kumar

18-48-గీతా మకరందము

 18-48-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII స్వకీయకర్మము(స్వధర్మము) ఒకవేళ దోషముతో గూడియున్నదైనప్పటికిని దానిని వదలరాదని చెప్పుచున్నారు –


సహజం కర్మ కౌన్తేయ! 

సదోషమపి న త్యజేత్ | 

సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||  


తా:- ఓ అర్జునా! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను (దృశ్యరూపమైనను, లేక త్రిగుణాత్మకమైనను) దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడునట్లు సమస్తకర్మములును (త్రిగుణములయొక్క) దోషముచేత కప్పబడియున్నవికదా!


వ్యాఖ్య:- కర్మ యనునది ఇంద్రియాదులచే చేయబడునదిగనుక దృశ్యమం దంతర్భూతమైనది. త్రిగుణాత్మకమైనది. ప్రకృతి (మాయ) యందు వర్తించునది. కనుకనే 

"దోషేణ" అని చెప్పబడినది. కాబట్టి ఆత్మకాని దోషము, దృశ్యరూపమగు దోషము, త్రిగుణాత్మకమైన దోషము ప్రతికర్మయందును గలదు. అందుచేతనే 'సర్వారమ్భా హి’ (సమస్తకర్మలును) అని తెలుపబడినది. కావున పొగచే అగ్ని కప్పబడి యుండునట్లు సమస్తకర్మలు (దృశ్యరూపములు కనుక) ఈ దృశ్యరూప దోషముచే గప్పబడియున్నవి. అయినను స్వభావసిద్ధములగు కర్మలను వదలరాదు. ఏలయనగా వానిని నిష్కామ బుద్ధితో, భగవదర్పితబుద్ధితో నాచరించినచో అవి చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, మోక్షమును గలుగజేయగలవు. అయితే పాపకార్యములను మాత్రము చేయరాదు. సమస్తకర్మములును 'మాయా' రూప దోషముచే నావరింపబడియున్నప్పటికిని, అందు శుద్ధకర్మచే అశుద్ధకర్మను, పుణ్యకర్మచే పాపకర్మను, నిష్కామకర్మచే సకామకర్మను తొలగించివేసి ఆ పిదప క్రమముగ సాధనాతిశయముచే ఇంకను పైకిపోయి నైష్కర్మ్యాత్మరూపమున చేరవలయును.

ఈ విషయమును మఱియొకదృష్టితో గూడ విచారించవచ్చును. వారువారు చేయుకొన్ని కార్యములందు పంచసూనాది అనివార్యదోషము లేర్పడుచుండును. జీవితయాత్రకై ఆ యా కార్యములను జనులు తప్పక చేయవలసియేయున్నారు. కావున ఆ యా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తము లేర్పడినవి.

దోషము (పంచసూనములు) - ప్రాయశ్చిత్తము (పంచమహాయజ్ఞములు)

1. ధాన్యమును ఉత్పత్తి చేయునపుడు సంభవించు ప్రాణిహింస - బ్రహ్మయజ్ఞము (వేదాధ్యయనాదులను జేయుట)

2. విసరునపుడు - పితృయజ్ఞము (పితృదేవతలను తర్పణాదులచే

తృప్తిపఱచుట)

3. కట్టెలు నరకునపుడు వానిచే వంటవండునపుడు - దేవయజ్ఞము (హోమము మున్నగునవి చేయుట)

4. జలము తెచ్చునపుడు, కాచునపుడు - భూతయజ్ఞము (ప్రాణులకు అన్నాదుల నొసంగుట)

5. ఊడ్చునపుడు - మనుష్యయజ్ఞము (అతిథులను, బ్రహ్మనిష్ఠులను, దీనులను భోజనాదులచే తృప్తిపఱచుట)

ఈ ప్రకారముగ కర్మలవలన గలుగు ఆ యా అనివార్యదోషములు పుణ్యకార్యములచే, నిష్కామకార్యములచే తొలగిపోగలవు. ఇంతియేకాక బ్రహ్మవిచారణ, ఆత్మధ్యానము మున్నగు మహోన్నత పవిత్రకార్యములచే జీవులందలి ప్రకృతి దోషములు లెస్సగ తుడిచిపెట్టుకొని పోగలవు. కావున వారి వారి స్వభావసిద్ధ కార్యమునందు ప్రకృతిజన్యములగు దోషములున్నప్పటికిని వానిని త్యజించక, నిష్కామబుద్ధితో వాని నాచరించుచుండినచో క్రమముగ హృదయము నిర్మలమై జీవునకు జ్ఞానప్రాప్తి ఉత్తమ బ్రహ్మపదప్రాప్తి సిద్ధించగలవు.

తిరుమల సర్వస్వం -302*

 *తిరుమల సర్వస్వం -302*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-17


ఎవరు సమర్థులు ?

------------------------------

అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి ? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు ? తిరుమలక్షేత్రం లోనే కాకుండా - తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు - మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది ? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది..


అప్పట్లో - స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి - నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళై - వడగళై అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి - వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే !!


అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం - అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే - కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.  


జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ - కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా - వారిపాత్ర, పాలకవర్గానికి - అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేందుకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు. 


ఇలా - ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని; వారి వల్ల దేవాలయానికి, కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి మహంతులపై పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి -


◆ వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము - బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు ఆలయం పై పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు. 


◆ పైగా, మహంతుల పట్ల అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు - ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ - విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా అంతగా అభ్యంతరం ఉండదు.


◆ అంతే గాకుండా - మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారి వారసులకు సంక్రమించే అవకాశం లేదు.  


◆ మహంతులకు అప్పటికే - విస్త్రృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం - సమర్థత ఉన్నాయి. 


ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు - కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తదనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

తిరుమల సర్వస్వం -302*

 *తిరుమల సర్వస్వం -302*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-17


ఎవరు సమర్థులు ?

------------------------------

అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి ? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు ? తిరుమలక్షేత్రం లోనే కాకుండా - తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు - మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది ? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది..


అప్పట్లో - స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి - నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళై - వడగళై అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి - వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే !!


అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం - అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే - కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.  


జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ - కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా - వారిపాత్ర, పాలకవర్గానికి - అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేందుకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు. 


ఇలా - ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని; వారి వల్ల దేవాలయానికి, కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి మహంతులపై పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి -


◆ వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము - బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు ఆలయం పై పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు. 


◆ పైగా, మహంతుల పట్ల అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు - ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ - విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా అంతగా అభ్యంతరం ఉండదు.


◆ అంతే గాకుండా - మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారి వారసులకు సంక్రమించే అవకాశం లేదు.  


◆ మహంతులకు అప్పటికే - విస్త్రృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం - సమర్థత ఉన్నాయి. 


ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు - కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తదనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

 *సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*439 వ రోజు*


*అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని వధించుట*


రధిక త్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడిని ప్రమధగణాలు అదృశ్యరూపంలో వెంబడించ సాగాయి. కృపాచార్యుడు, కృతవర్మలను ముఖద్వారమున ఉంచి తాను మాత్రం పాండవశిబిరాలలో ప్రవేశించాడు. ముందుగా దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుడిని తలచుకొని, ఈశ్వర దత్తమైన కత్తి చేతబూని కసిగా ధృష్టద్యుమ్నుడిని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి ధృష్టద్యుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. నేల మీదికిలాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్ళతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హటాత్పరిణామానికి ధృష్టద్యుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నారిని విప్పి ధృష్టద్యుమ్నుడి కంటానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. చివరకు నోట పెగల్చుకుని " అశ్వత్థామా ! నన్ను నీ అస్త్రములు శస్త్రములు ప్రయోగించి చంపి నాకు ఉత్తమగతులు కల్పించు ఇలా నీచంగా చంపకు " అని ప్రార్ధించాడు. అశ్వత్థామ " వీలు లేదు నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమగతులు కలుగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపుతాను " అని పిడికిలితో గుద్దసాగాడు. అప్పటికే అక్కడ ఉన్న వారు మేల్కొన్నా ! అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసుడని ఎవరూ ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్ళతో పిడికిలితో తన్నితన్ని మోదిమోది ధృష్టద్యుమ్నుడిని అతి కౄరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. ధృష్టద్యుమ్నుడి శిబిరం విడిచి వేరొక శిబిరానికి వెళ్ళాడు.


*అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట*


అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నకాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేసారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి ధృష్టద్యుమ్నుడిని చంపాడని కాపలాదారులు చెప్పారు. " వాడిని పోనీయకండి పట్టుకోండి పొడవండి " అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరుగెత్తారు. అందరూ కలసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడి శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టుపట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగనరికాడు. అశ్వత్థామను అడ్డుకునే వారు లేక పోయారు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుకుతున్నాడు అశ్వత్థామ. శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపదకుమారుల శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు అశ్వత్థామ. అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులనూ గుర్రములనూ తెగనరికాడు. మనిషాపశువా అనే తేడా లేకుండా అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింప చేస్తున్నాడు అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం అందులో నిద్రిస్తున్న వారిని నరకడం మరియొక శిబిరంలో ప్రవేశించడం ఆ విధంగా మారణకాండ సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా " ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడు " అని భీతి చెందుతున్నాడు.


*అశ్వత్థామ ఉపపాడవులను సంహరించుట*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: తొమ్మిదవఅధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ 

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున (19)


అర్జునా.. నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుతున్నాను; కురిపిస్తున్నాను. అమృతమూ, మృత్యువూ నేనే. శాశ్వతమైన సత్తూ, అశాశ్వతమైన అసత్తూ నేనే.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *సుజీర్ణమన్నం సువిచక్షణః సుతః*

            *సుశాసితా స్త్రీ నృపతిః సుసేవితః౹*

            *సుచిన్త్య చోక్తం సువిచార్య యత్కృతం*

            *సుదీర్ఘ కాలోపిన యాతి విక్రియామ్౹౹*


తా𝕝𝕝 *బాగుగా జీర్ణమైన ఆహారం, వివేకియైన పుత్రుడు, సుశిక్షితురాలైన స్త్రీ, బాగుగా సేవింపబడిన రాజు, బాగుగా ఆలోచించి చెప్పిన మాట, విచారించి చేసిన పని ఇవన్నీ ఎంతకాలం గడిచినా మంచిఫలితాలనే ఇస్తాయి.....*


 ✍️🌹💐🌸🙏

అభివృద్ధి_సోపానాలు

 123b4;217c5;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *అభివృద్ధి_సోపానాలు*

                 ➖➖➖✍️


*మనిషి గొప్పవాడు కావాలని నిరంతరం కలలు కంటుంటాడు.*

*ధనాశ కలిగినవాడు కుబేరుణ్ని మించి పోవాలనుకుంటాడు. అధికారదాహం కలవాడు అత్యున్నతస్థాయి కుర్చీని ఆక్రమించుకోవాలనుకుంటాడు. జ్ఞాని పరమజ్ఞానిగా, సాధకుడు సిద్ధుడిగా, శూరుడు యోధుడిగా, వైద్యుడు ధన్వంతరి సమంగా... ఇలా ఉంటాయి ఆశల కలలు.*


*కలలు వేరు, వాస్తవం వేరు!*


*ధాన్యాన్ని సంచుల్లోనే ఉంచుకుని, పదింతల పంటకోసం కలలు కనడం ఎంతవరకు సబబు?*


*హలాలతో పొలాలు దున్ని భూమాతను నమ్ముకుని తగినంతగా కృషి చెయ్యాల్సి ఉంటుంది. కలలు కృషితో జత కలిసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి.*


*ఉద్యోగి తన ప్రజ్ఞకు పదును పెట్టుకుంటూ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదోన్నతులు లభిస్తాయి. తన కళ్లముందు తనకంటే వెనకవాళ్లు అభివృద్ధి సోపానాలు ఎక్కుతుంటే అసూయతో రగిలిపోవడం మన ఆరోగ్యానికే చేటు.*


*అలాగే విద్యార్థులు కూడా. అమూల్యమైన సమయాన్ని ఆటపాటలు, వినోదాలతో వ్యర్థం చేసుకుంటే ఉత్తీర్ణతే కష్టం కావచ్చు. ఇక ఉన్నతశ్రేణికి అవకాశం ఎలా ఉంటుంది?*


*గతించిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిరాదు. సర్వసమర్థుడైన భగవంతుడైనా కాలాన్ని వెనక్కితిప్పడు. కోట్లాది రూపాయలు గుమ్మరించినా గతించిన క్షణాల్ని తిరిగిపొందడం అసాధ్యం. కానీ, చాలామంది ఈ సత్యాన్ని గమనికలోకి తీసుకోరు.*


*‘నేను చాలా తప్పులు చేశాను. తల్లిదండ్రుల్ని హింసలుపెట్టాను. ఒక్కసారి వారికి మళ్ళీ సేవలు చేసే అవకాశం ఇవ్వు భగవంతుడా’ అని ఎంత మొత్తుకున్నా- పోయినవాళ్లు మళ్ళీ ప్రత్యక్షం కారు.*


*సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలి*. 


*యౌవనంలో ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. బాలుడిగా ఉన్నప్పుడే శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. మనసు మనమాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మంచిచెడుల విచక్షణ కల్పించే జ్ఞానాన్ని సదా రక్షించుకోవాలి*.


*కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది. అంతటి ధనసంపన్నుడూ ఎవరికీ ఎక్కడా దానధర్మాలు చేసిన కథలు కనిపించవు. అందువల్ల కుబేరుడికి భక్తులుండరు.*


*సిరుల దేవత శ్రీమహాలక్ష్మిని ఎందరో ఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎందుకంటే ఆ మహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.*


*ప్రపంచంలో కుబేర సమానులెంతమంది ఉన్నా- సత్కార్యాలు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు.*


*కాబట్టి, తన సంపదను పంచడంతోపాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి! అవధులెరుగని దాత అనిపించుకోదగినవాడు భగవంతుడొక్కడే. ఆయన దాతలకే దాత.*


*ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపదలు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు.*


*అసలు సత్యమేమిటంటే, మనలోని సంస్కారం ఒక్కో మెట్టు ఎదగాలి. సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూయ, ద్వేషాలు ఉండవు.*


*తులసి మొక్క సర్వలోకపూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ, తులసి మొక్క పవిత్రత ముందు అది ఎందుకూ కొరగాదు.*


*అభివృద్ధి సోపానాలు ఎక్కడానికి ఆరాటపడటం కంటే మన అర్హతలు పెంచుకునేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరోధం కనుక, ఆ భావాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సంస్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం!*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు 🙏

భగవంతుడు మనకు దాసుడు?*

 123b6;306c4;167e5;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*భగవంతుడు మనకు దాసుడు?*

             ➖➖➖✍️


```

భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తులకు దాసుడే.


చాలా ఉదాహరణలున్నాయి.


*శ్రీ వేంకటేశ్వరుడు అన్నమయ్య భక్తికి దాసుడై సకుటుంబముగా అన్నమయ్య వివాహానికి తరలివెళ్లి, అన్నమయ్య పల్లకీని, తనభుజాలమీద మోయలేదా?


*పాహి పాహి ఇతహః పరంబెరుంగ, అని గజేంద్రుడు ప్రార్ధిస్తే...అలవైకుంఠ పురంబులో అమూలసౌధంబులో, ఉన్న పరమాత్మ, పరుగెత్తి రాలేదా?


అదీ ఎలావచ్చాడు?


*సిరికించెప్పడు, శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు, అలా ఆగమేఘాలమీద పరుగు పరుగున పరుగెత్తి…! ఎవరికోసం వస్తాడండీ? ఆయన దీనజన బాంధవుడు. త్రికరణ శుద్ధిగా భక్తితో ప్రార్ధిస్తే భక్తికి దాసానుదాసుడు.


*కుచేలోపాఖ్యానములో కుచేలుడు (పరమ ప్రీతితో భక్తితో ) తెచ్చిన అటుకులకు పరవశించి అష్టైశ్వర్యములు ప్రసాదించలేదా


*కురుమహాసభలో ‘అన్నా నీవేదిక్కు’ అని ద్రౌపతి తన రెండు చేతులూ పైకి ఎత్తి ప్రార్ధించగానే శ్రీ కృష్ణపరమాత్మ తామర తంపరగా వస్త్రములను ప్రసాదించలేదా?


*శ్రీ త్యాగయ్య భక్తికి పరవశుడైన 

శ్రీ సీతా రామచంద్రులవారు, లక్ష్మణ స్వామీ, అంజయనేయ స్వామి సమేతంగా త్యాగయ్య ఇంటికివచ్చి విందారగించలేదా ?


*శ్రీ రామదాసు భక్తికి దాసుడై, చనిపోయిన రామదాసు పుత్రుణ్ణి బ్రతికించాలేదా ?


*’ఈ స్తంభములో నీ విష్ణువు ఉన్నాడా?’ అని హిరణ్యకశిపుడు అడుగగా, ప్రహ్లాదుడు ‘ఉన్నాడు!’ అని, ‘ఇందుగలడందులేడని సందేహమేల, ఖచ్చితంగా ఉన్నాడు.’ అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్దించగా తన భక్తుని మాటకోసం, తన భక్తుని మాట నెలబెట్టడంకోసం స్వామి స్తంభమునుండి బయటకు రాలేదా?వచ్చి హిరణ్యకశిపున్ణి సంహరిచలేదా?


*శ్రీ తులసీదాసు భక్తికి తులసీదాసు తల్లి దగ్గర, రామయ్య వీపు వాతలు పడేలా దెబ్బలుతినలేదా?


*వైర భక్తి పరాకాష్టకు నిదర్శనంగా హిరణ్యకశిపుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, రావణాసురుడు వీరంతా మోక్షాన్ని పొందాలేదా ?


*మూఢ భక్తికి నిదర్శనంగా తిన్నడు (కన్నప్ప ) తన కాలి చెప్పుతో, శివలింగము పై నిర్మాలిన్యాన్ని తీయగా, తిన్నడు శివునకు కన్ను పెట్టడానికి, కన్ను గుర్తుకోసం తన కాలి బొటనవ్రేలును ఉంచి తనకన్నును తనశరీరము నుండి పెకలించి పెట్టగానే మోక్షాన్ని ప్రసాదించలేదా ?


*ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నోనిదర్శనములు ఉన్నాయి. ఒక విషయం ఆలోచించండి పైన ఉదహరించిన వారందరూ మానవ మాత్రులు కారా? మరి మనమూ మానవులమేకదా, మరి వారికి మనకు ఎక్కడుంది తేడా? వారికి పలికిన భగవంతుడు మరి మనకెందుకు పలకడు? ఎందుకు మాట్లాడడు? ఎవరికోసం పలుకుతాడండీ, ఎవరికోసం మాట్లాడుతాడు? మనలో ఆ భక్తి పారవశ్యమేది?


*అసలు దాస్యం అంటే ఏమిటి అంటే సేవ అంటే ఏమిటి? దాస్యం ఎలాచేయాలి? సేవలు ఎలాచేయాలి ?తెలుసుకుంటే అలా చేస్తే భగవంతుడు మనకు దాసుడౌతాడా లేదా అనే విషయం తెలుస్తుంది.


*మహాభారతంలో పాండవుల పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు…. “ఓ ధర్మరాజా మీరింతవరకూ సేవలు చేయించుకొన్నవారే కానీ దాస్యం చేయడం, సేవలు చేయడం మీకు తెలియదు. మీరు విరాటరాజు కొలువులో సేవక వృత్తి, దాస్య వృత్తి చేయాలి. సేవ, దాస్యము అంటే ఒక తల్లి తనబిడ్డకు ఏ ఏ పనులు చేస్తుంది? బిడ్డ అడిగితేనే చేస్తుందా? లేక ఏది తనబిడ్డకు అవసరమో అవి చేస్తుందా? తల్లికి తెలుసు. స్నానపానాదులే కాక ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ కంటికి రెప్పలా తాను చూచుకొంటుంది కదా“ అంటూ...

*పాండవులకు సేవలుచేసే విధానాల గురించి పాండవుల పురోహితులైన శ్రీ ధౌమ్యుల వారు సవివరంగా వివరించారు.


*అలా మనము కూడా భగవంతునికి, త్రికరణ శుద్దిగా, పంచేద్రియాలను ఒకటిచేసి, తపన,ఆర్తితో దాస్యం, సేవ(శరణాగతి) చేస్తే, భగవంతుడు మనకు దాసుడవడం ఖాయం.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

శ్రీమద్భాగవత కథలు*

 167e4;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀3️⃣```ప్రతిరోజూ...

మహాకవి బమ్మెర పోతనామాత్య..

```

         *శ్రీమద్భాగవత కథలు*

                ➖➖➖✍️```

 

2.1. రఘువంశము: 


విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయేకాక, ప్రజలు ప్రభువునే దైవముగా భావించి, విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. 

కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు, 

మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు, దేశమందలి మంచిచెడ్డలను గమనించుచు, విచారించుచు, అతిశ్రద్ధాళుడై ప్రజలమధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడగుట చూచి యుక్తవయస్సుననే వివాహముజేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలెనని సంకల్పించి, అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలెనని విచారించి, కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు. సాధ్వియును, సరళ హృదయయునై, పతిననుసరించుచు, ప్రాణసమముగ ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడను, మహా గుణవంతుడగుటచే ఆమెకెట్టి లోటునూ లేకుండ చూచుకొనుచు, పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటిని తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును, శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు.


ఈవిధముగ కొంతకాలము గడచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్యపాలనా పట్టము గావించెను. నాటినుండియు దిలీపు మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండ, సకాల వర్షము కురిసి, సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడిపంటలకెట్టి కొరతయు లేక నిత్యకల్యాణములతో, వేద పారాయణములతో, శాస్త్రసమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతులవారు హాయిగా జీవించుచుండిరి.


కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటుల అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడచెను. ఇచ్ఛ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను.


ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈరీతిగా వెలిబుచ్చెను: “ప్రియా! మనకింత వరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింతకంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనొనరించిన ఏ పాపఫలమో కారణమయి ఉండ వచ్చును. దాని పరిహారార్ధమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వసిష్ఠులవారిని అడిగి తెలిసికొన వలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఇందుకు నీ ఉద్దేశ్యమేమి?” అని దిలీపుడు అడుగ సుదక్షిణ ఆలస్యము చేయక, ఆలోచించక, “నాథా! ఇదే ఆలోచన నాలోను చాలా దినములనుండి బాధించుచున్నప్పటికిని పతి ఆజ్ఞ లేక నా తలంపును బైట పెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడు సిద్ధమే అనునది తమకు విదితమే కదా. ఇందుకు ఆలస్యమెందుకు?” అని రాణి తన అంగీకారమును తెలుపగనే, దిలీపుడు రథమును సిద్ధము చేయించి, “ఈనాడు నావెంట పరివారము, రక్షక భటు లెవ్వరును రానక్కరలేద”ని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వసిష్ఠులవారి ఆశ్రమము చేరెను.


రథ శబ్దము వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్లి గురువుగారికి తెలుప, వసిష్ఠులవారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండ, రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి, ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్లెను. అంత, రాజుకూడను ప్రభు ధర్మము ననుసరించి, “ఆశ్రమ జనులకుకానీ, యజ్ఞ యాగాది సత్కర్మలకుకానీ, లేక ఆహార విహారములకుకానీ, ఎట్టి ఇబ్బందియు లేక అరణ్యమునందు క్రూర మృగముల బాధలులేక, తమతమ నిత్యానుష్ఠానములు సక్రమముగ జరుగుచున్నవి కదా?” అని గురువైన వసిష్ఠులవారిని, ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు, లోనికి వెళ్లి వారివారి ఆసనములు వారు స్వీకరించిరి.


అంత వసిష్ఠులవారు అచటున్న ఆశ్రమవాసులను తమతమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి, రాజు తన ఆశ్రమమునకు రాణీ సమేతుడై వచ్చిన కారణమును తెలుపుమని అడుగ, రాజు తనకుగల కొరతను, విచారమును, వినయముతో విన్నవించి, తమ అనుగ్రహము తప్ప, ఇందుకు అన్యమార్గము లేదని ప్రార్థించెను.✍️

(సశేషం)

    🙏శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష🙏

జ్వాలా వారి విశిష్ట వ(ర)చనామృతం ‘శ్రీమద్భాగవత కథలు’ ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

చెన్నై - కంచి*

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

132a;167e2. నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0268.పరమాచార్య పావన గాధలు…



                *చెన్నై - కంచి*

               ➖➖➖✍️

```

ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..


నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంబకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కోసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంబకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే. 


మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంబకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.


మేము కుంబేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు 

శ్రీ ఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. 


ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాళిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను. 


ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో “నా వద్దకు రండి” అని చెప్పారు. 

నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చూస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు. స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి వీడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము. 


కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాళికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు. 


మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము. 


మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన. 


కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. 


ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చేసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం. ✍️```

             --- మూలం : స్వస్తిక్ టివి.

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - కృష్ణ పక్షం -‌ షష్ఠి - ఉత్తరాభాద్ర -‌‌ సౌమ్య వాసరే* (16.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

15, జులై 2025, మంగళవారం

నన్ను నేను వెతుక్కుంటున్నా...

 *నన్ను నేను వెతుక్కుంటున్నా...!!*


సమస్త విశ్వానికి వెలుగు రేఖలా

నా ఆత్మ జ్యోతిని మండించుకుంటూ

అందులో నన్ను నేను వెతుక్కుంటా 

కీర్తి శిఖరానికి చేరుకుంటా...


ప్రపంచమంతా ఒకటే గీతికగా 

అందులో జాతుల వరసలు కలుపుకుంటూ 

ఖండాంతరాలు దాటుకుంటూ 

నా ఊపిరిని విశ్వమంతా నింపుతా..


ఆత్మవిశ్వాసాన్ని గుండె నిండా నింపుకొని 

కాంతి రేఖల వెలుగులను సృష్టించుకుని 

భూమిపైన మొలకలా నిలబడుతూ 

మహావృక్షమై నీడనియ్యాలని తపిస్తా..


అడుగున పడ్డ బడుగు జీవిలా కదులుతూ 

మట్టిలోని విత్తనాల్తా పైకి లేస్తూ 

పుష్పించి పండునై రాలిపోతూ 

జీవిత గమ్యాన్ని చేరేందుకు ప్రయత్నిస్తా...


మనసు నిండా దయా ఫలాలను నింపుకొని 

మానవత్వపు కోణాన్ని పెంచుకుంటూ 

మనిషిలో మంచితనాన్ని వెతుక్కుంటూ 

వింత నాటకంలో విరాగిగా తిరుగుతా...


నా జీవిత పరమార్ధం తెలుసుకుంటూ 

అక్షరాలతో నా వేదన తీర్చుకుంటూ 

ప్రతినిత్యం వాక్యాలను సృష్టించుకుంటూ 

నన్ను నేను మర్చిపోతూ సాగుతున్నాను...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

పుదీనా గురించి

 పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

     

ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది.  ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను 


 •. 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు - 

 

పిండిపదార్దాలు  - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా ,  ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.  

            

.  పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

 

•   పుదీనా ఆకుతో చికిత్సలు  - 

  

*  పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 

 

*  పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును. 

 

*  బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు . 

 

*  పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును. 


 *   క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది . 

 

*  నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 

 

*  దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 


 *  ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును. 


 *  గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును. 

 

*  పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును. 

 

*  కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 


 *  గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును. 

 

*  పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 

 

*  నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు . 

        

.       పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును. 

            

.                     సమాప్తం 

 

     

.    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.  నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.  ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.  కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.  9885030034

సామెతల్లో ఆయుర్వేదం!

 సామెతల్లో ఆయుర్వేదం!15-07-2025

--------------------

.🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !

.

పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !

.

త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !

.

"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట

.

వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..

.

అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "

.

పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...

.

వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "

.

కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత

.

ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "

.

అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...

.

ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !

.

పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?

.

సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?

.

అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!

జాతి జీవనాడి నశిస్తుంది!


ఇంగ్లీష్ మీడియం మోజులో పడ్డ తెలుగు జాతికి....

తెలుగు అంతరించాక మాత్రమే తెలుగు విలువ తెలుస్తుంది.🕉️🕉️🕉️

దక్షిణాయన పుణ్యకాలం

 *దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి* ?


జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది. 


సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని

 *సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని* 


ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.


 *సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే!* 


 *ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయన ములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సంక్రాంతి)... మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.* 


ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. *జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.* 


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. *సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు* . అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. *దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.* 


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. *దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.* 


దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.


సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే *మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.* ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.

ఆదిలోనే హంసపాదు*

 *ఆదిలోనే హంసపాదు*

ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు. గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోత్తాన్ని తమ భుజంపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు. హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది. వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి. ప్రారంభంలోనే అవాంతరం ఏర్పడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.


అలాగే 

వ్రాసేటప్పుడు తప్పిపోయిన పదాన్ని చెప్పడానికి అక్కడ ఒక గుర్తు పెట్టి దానిని మరొక చోట లేదా పుట క్రిందనో చూపుతారు.

అంటే మొదట్లో నే అవాంతరం ఏర్పడినది అని తెలపడానికి ఈ సామెత వాడతారు.

ఇది సాధారణంగా తాటియాకు మీద ఘంటంతో వ్రాసేటప్పుడు గాని వ్రాసిన తరువాత గాని ఎక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసినప్పుడు చెరిపి వేయడానికి గాని చేర్చడానికి గాని వీలుపడదు. అప్పుడు అంచపాదం గుర్తు పెట్టి ఆవతల వ్రాస్తారు.

ఈ వ్యవహారాలు నేడు ఇప్పటికీ దస్తావేజులు వ్రాసే వ్రాయసగాండ్రు చేస్తూ ఉండడం పరిపాటే.

మూల తాటియాకు ప్రతులల్లో కూడా ఉంటాయి.

ధనవంతుడు కడలికరణి

 *2173*

*కం*

ధనవంతుడు కడలికరణి

కనబడు దాహార్తిదీర్చ కర్మరహితుడౌ

ఘనగుణి కూపంపు చెలువ

జనులందరిదప్పిదీర్చ సరసుడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనవంతుడు సముద్రం వలెకనబడిననూ దాహార్తి తీర్చడానికి పనికిరాడు. గొప్ప గుణవంతుడు నుయ్యి వలె జనులందరి దప్పిక నూ తీర్చగలడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జగద్గురువులూ చతురులే*

 *జగద్గురువులూ చతురులే*

    ఒకసారి విద్వాంసుడు శృంగేరీ 34వ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీమహస్వామివారి దర్శనానికి శృంగేరీ వెళ్ళాడు. స్వామివారికి బిక్షావందనం చేసి...స్వామివారితో ఇలా అన్నాడట.

 "భగవద్గీతలో తాను నిష్టాతుడనని తనకెంతో ప్రావీణ్యం ఉన్నదని ఎన్నో దేవాలయాల్లో, సభల్లో భగవద్గీతమీద ప్రవచనాలు చేస్తానని, అందుకు తమరు కూడా శృంగేరీ పీఠ అనుబంధ శాఖల్లో తనకు అవకాశము ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రార్ధించాడు.

 మహాస్వామివారు ఆ విద్వాంసుని గౌరవపూర్వక అభ్యర్ధనని విని సంతృప్తిగా తగిన ఏర్పాట్లను బెంగుళూరులో ప్రథమంగా చేయించారు.

 వారి మొదటిరోజు భగవద్గీత ప్రవచనానికి వందమంది వరకు శ్రోతలు హాజరయి ఆ ప్రవచనాన్ని విన్నారు.

 రెండోరోజు శ్రోతల సంఖ్య బాగా తగ్గింది. ముప్ఫయి మంది వరకు ఆశీనులై విన్నారు.

 మూడోరోజున కేవలం ఒక ఐదుగురు వరకే వచ్చారు. సమావేశ మందిరం వెల వెల బోయింది. ఈ విషయం జగద్గురువుల దరికి చేరింది.

ఆ విద్వాంసుడు శృంగేరీకి వెళ్ళాడు.

అదే రోజు రాత్రి స్వామివారి పూజానంతరం, ఆ పండితుడు జగద్గురువులతో " ఇదేం పట్టణమండీ! భగవద్గీత అంటే బొత్తిగా ఎవరికీ ఇష్టం లేనట్లు ఉంది" అని మిక్కిలి బాధతో స్వామివారికి వినమ్రపూర్వకంగా విన్నవించారు. 

అందుకు స్వామివారు చిరు దరహాసంతో తమ అమృత వాక్కుతో ఇలా అన్నారు " ఎందుకు తమరు అంతలా చింతిస్తారు! భగవద్గీతను శ్రీకృష్ణుడు ఈ విశ్వానికి తెలిసేలా చెప్పినప్పుడు విన్నది ఎంతమందో కాదు కదా! కేవలం అర్జునుడొక్కడేగా!" అని ఆయన్ని సముదాయించి పంపారట.

కామెంటు చేసెముందు

 కామెంటు చేసెముందు మీ పేరు ఫొను నెంబెరు తెలుపండి

కామకళ -- స్వరూపం _నిరూపణ🙏 నాల్గవ భాగం

 🙏కామకళ -- స్వరూపం _నిరూపణ🙏

                   నాల్గవ భాగం

       వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము(మాయచేత చలించు లేదా స్పందించు బ్రహ్మము ). ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది.అనాహతం అంటే ప్రతిధ్వని లేని ధ్వని. అనాహత మొట్టమొదట ఆవిర్భవించినది అనాహతం నుంచి ఆవిర్భావించినవి శబ్దాలే కనుక దానిని అనాహతం లేదా మ్రోగించని శబ్దం అని అంటారు. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలు రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి.


       ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబశక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయింది . అప్పుడు మహత్‌ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి (వ్యాపాక శక్తి) విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య-అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు.(సృష్టి మొత్తం ఒకే పురుషుడుగా ఉండుట) అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్‌, అహంకారము అని పేరు కలిగినది.


కామకళ నిరూపణ


మూలకూటత్రయ-కళేబరా - లలితా సహస్రనామంలోని నామము .

మూలస్య కుటత్రయమేవ కళేబరం (=స్థూలరూపం) యస్యాః సా 


మూల మంత్రం యొక్క మూడు విభాగాలు ఆమె శరీరాన్ని ఏర్పరుస్తాయి.అదే అమ్మవారి స్థూలరూపం అని గ్రహించండి 


మంత్రం యొక్క మూడు కూటాలు ఆమె భౌతిక లేదా సూక్ష్మ రూపాన్ని ఏర్పరుస్తాయి.


అసలు అర్థంలో మూల అనే పదానికి కామకళ అని పిలువబడే సూక్ష్మ శరీరం అని అర్ధం , మరియు విభజనలు కామకళ యొక్క భాగాలు. కామకళ లోని మొదటి భాగాన్ని ఊర్ధ్వ బిందువు అని , రెండవ భాగాన్ని రెండు సూర్య చంద్ర బిందువులని మరియు చివరి భాగాన్ని సార్ధకళ అని అంటారు .

త్రయ అంటే మూడు. పంచదశి మంత్రంలోని మూడు కూటాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. పంచదశికి 'కామకళ ' మూలమని మనం చూశాం. కాబట్టి, ఆమె భౌతిక మరియు సూక్ష్మ రూపాలు రెండూ 'కామకళ'ను సూచిస్తాయని ఇది సూచిస్తుంది. మూడు సూక్ష్మ రూపాలలో, మొదటి సూక్ష్మ రూపం పంచదశి మంత్రం, . రెండవ సూక్ష్మ రూపం , కామకళ రూపం ఇక్కడ చర్చించబడింది. క్లుప్తంగా చెప్పాలంటే, మూడు బిందువులు త్రికోణంగా కలిగిన హంస మరియు సోహం (హంస మంత్రం) కలయికను కామకళ అంటారు. ఇది లలితాంబిక యొక్క వాస్తవ భౌతిక రేఖాచిత్రం. ఇందులో ఉన్న బీజం 'ఈం '. ఈ బీజం చాలా శక్తివంతమైనది మరియు షోడశీ మంత్రంలో ఈ బీజాన్ని ఎలా ఉపయోగించాలో ఈ అంశం తెలుసుకొని శ్రీం బీజం చేర్చుకోవాలి . 


మంత్రాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి - పురుష, స్త్రీ మరియు తటస్థ .


హుమ్ , వషట్ మరియు ఫట్‌తో ముగిసే మంత్రాలు పురుష మంత్రం.


స్వాహా మరియు వౌషట్ తో ముగిసేవి స్త్రీ దేవతా మంత్రాలు ;


నమః తో ముగియడం తటస్థ మంత్రాలు .


పురుష మరియు తటస్థ మంత్రాలను "మంత్రం" అని పిలుస్తారు మరియు స్త్రీ దేవతా మంత్రాలు " విద్య " అని పిలుస్తారు, అందుకే షోడశి మంత్రానికి శ్రీవిద్య అని పేరు.


జపం మూడు రకాలు:


1.వాచ్యం - వినబడేలా చేయబడింది


2. ఉపాంశు - గుసగుసల వలె జపించడం 


3. మానస – మానసికంగా చేస్తారు.

హ్రీం, శ్రీం సౌః వంటి బీజ మంత్రాలు అని పిలువబడే ఏక-అక్షర మంత్రాలు గుర్తుంచుకోవడానికి మరియు పఠించడానికి సులభమైనవి; అవి కూడా అత్యంత శక్తివంతమైనవి. ఒక చిన్న విత్తనంలో గంభీరమైన చెట్టు ఉన్నట్లుగా, ప్రతి బీజంలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సృజనాత్మక శక్తి ఉంటుందని గ్రహించండి . ఈ బీజాలలో పురాతనమైనది మరియు విస్తృతంగా తెలిసినది ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్ చెబుతోంది.

ఓంను ప్రణవ మని పిలుస్తారు, 

ఓం అనేది విశ్వం యొక్క “ప్రాథమిక బీజం ”-ఈ ప్రపంచం మొత్తం, “ఓం తప్ప మరొకటి కాదు” అని ఒక పురాతన వచనం చెబుతోంది. ఇది అన్ని ఇతర మంత్రాలు ఉద్భవించే మూల మంత్రంగా కూడా పరిగణించబడుతుంది మరియు వేదాల యొక్క అనేక వేల శ్లోకాల యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. కఠోపనిషత్తు ప్రకారం, ఓం అనేది "వేదాలన్నీ సాధన చేసే పదం."


అందుకని, ఓం అనేది ధ్యాన బీజం ., ఓం "మనలోని అనంతమైన అనుభవాన్ని" వ్యక్తపరుస్తుంది . ఈ విధంగా, ఓం జపించడం అనేది మనలో ఉన్న దైవాన్ని తాకడానికి సులభమైన మార్గం.

ఓం అనేది వైదిక కామకళ 

                     సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

చమత్కారాలు

 సేకరణ 

_.🌹..(శుభోదయం)...🌹_ 

*_👌భాషా చమత్కారాలు🤗_*

-----------------------

*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు.*

 

*"దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.*


*మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్ళి... "టిఫినేముంది?" అని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్! అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.*


*ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు.* 


*ప్లాట్ ఫాం మీద ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు.* 


*"లేదు ఊరికే..." అని బదులిచ్చాడు శ్రీశ్రీ.*


*ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కానీ నీరు దొరకదా?" అనడిగాడు.*


*ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ.. "అరే ఇంతకుముందు ఇక్కడ మనుషులుండే వారే...!!!" అనన్నాడు.*


*ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు," అని వల్లె వేయటం విని "ఒరే! మొద్దబ్బాయ్! అలాకాదురా ! అది _"ఎవడురా త్రిలోక కంటకుడు"_ అని సరి చేశాడు.*


*_"జమాల్ భాషా - తోక - మాల్ భాషా ఇట్లనెను"_ అనేది తప్పు. జమాల్ భాషాతో కమాల్ భాషా ఇట్లనెను అనేది రైటు.*


*ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి సహకరించమని అడిగాడు.* 


*_"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా!"_ అనన్నాడు సత్యనారాయణగారు.* 


*_"మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి"_ అనన్నాడా హరిదాసు.* 


*_"అయితే మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే"_ అనన్నాడు సత్యనారాయణగారు*

--------------------

*"దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో శివపార్వతుల కల్యాణం గురించిన పద్యం :*


_మత్తేభం._ 

*_జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్!_* 

*_నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి పూరీతి;పా_*

*_వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా_*

*_పడతిన్ బార్వతి బెండ్లియాడితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా!_*


_----స్వస్తి! 🙏----_

*‘ధర్మం’ అంటే ఏమిటి?*

 *‘ధర్మం’ అంటే ఏమిటి?*



ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న! ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాలా లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.


‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’


ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.


ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. 

(ధృ – ధారణే). 


ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.


ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.


శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|

హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||


“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. 


అంటే…,


1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి..

‘ఇది ధర్మం’.


2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కొనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు.    

‘ఇది ధర్మం’.


3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి.

‘ఇది ధర్మం’.


4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికొనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు.  

‘ఇది ధర్మం’.


5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. 

‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కింపురుషులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. 

కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి.‘ఇది ధర్మం’.


7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు. 

‘ఇది ధర్మం’.


8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం అవమానం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గొప్పదనాన్నీ పాతాళానికి త్రొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. 

‘ఇది ధర్మం’.


9. మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో, వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. 

‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా, భిక్షమెత్తి అయినా చదువుకోవాలి!’ అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. 

‘ఇది ధర్మం’.


10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నెడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. “తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.”

సందేహాలు

 🔵 నిత్య జీవితంలో చాలామందికి ఏర్పడే సందేహాలు ,

▫▫▫▫▫▫▫▫▫▫▫▫▫

🔵1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.

🔲2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

🔴3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

🔷4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగడం

5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.


6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.

12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.

15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.


16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.

23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.

24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.

27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.

28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.

32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.


36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.


41. దిగంబరంగా నిద్రపోరాదు.

42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.

43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.

44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.

45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.


46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.

50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.

అయిదు ప్రశ్నలకు

 ఈ అయిదు ప్రశ్నలకు 

సరైన జవాబులు వెతికి పట్టుకోగలవాడే జ్ఞానవంతుడు. 


ఆ జవాబులకు తగినట్టుగా 

జీవించటమే బుద్ధిమంతుడి లక్షణం. 


1 నేనెవరు, 

2 నా లక్ష్యం ఏమిటి, 

3. ఈ లక్ష్యం చేరేది ఎలా, 

4 మార్గం ఏమిటి, 

5 వీటికి విరోధి ఎవరు? 


ఈ ప్రశ్నపంచకాన్ని అర్థపంచకం అంటారు. 


మొదటి ప్రశ్న సమాధానంపై మిగతా నాలుగు ప్రశ్నల జవాబులు ఆధారపడి ఉంటాయి.


నేను జీవుడిని, నాకు ఆధారం దేవుడు. నేను అస్వతంత్రుడిని, భగవంతుడు సర్వస్వతంత్రుడు అన్న ఎరుక కలగటమే తొలి ప్రశ్నకు జవాబు. 


మనం ఏమిటన్నది మొదట తెలుసుకోవటం 

స్వరూప జ్ఞానం. జీవుడినైన నేను దేవుడికి దూరమయ్యాను, తిరిగి చేరువ కావటం నా లక్ష్యం అన్నది రెండో ప్రశ్నకు జవాబు. ఇది ఫలస్వరూప జ్ఞానం.


ఈ లక్ష్యం భగవంతుడి అనుగ్రహంవల్లే నెరవేరాలి. మార్గదర్శనం చేయించగల సమర్థుడు... ఆయనను నమ్మి మనస్ఫూర్తిగా ఆదుకొమ్మని ఆకాంక్షిస్తే, ఏదో ఒక దారి కనిపించకపోదు. 


అది కర్మ కావచ్చు, 

భక్తి కావచ్చు, 

జ్ఞానం కావచ్చు. అర్హతకు తగిన మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇది పరస్వరూప జ్ఞానం.


మార్గం అంటే ఉపాయం. 


ఏ మార్గంలో ఎలా వెళ్లాలో ముందుగా ఆలోచించి, అడుగు వేయడం చాలా అవసరం. చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి కలిగి, చేపట్టిన పనులు చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. కృష్ణార్పణంగా చేసే కర్మలే నిష్కామ కర్మలు.


 ‘కర్మ నీ వంతు, ఫలితం నా పూచీ’ అని కృష్ణుడు చెప్పనే చెప్పాడు. నదులన్నీ సముద్రంలో చేరే చందాన ఆ కర్మలు మోక్ష ద్వారానికి దారి తీస్తాయి, దగ్గరికి చేరుస్తాయి. 


ఈ దారిలో ఎదురుపడే విరోధులు ఎవరు? 


అహంకార 

మమకారాలు, 

రాగద్వేషాలు, 

స్వపర భేదాలు. వీరందరూ ఇంటి దొంగలు. 


మనలోని అజ్ఞానపు చీకటి గది వీరి నివాసం. 


యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు సాధనా రూప దీపాలు. వీటి వల్ల మనసుకు పట్టిన మకిలి దూరం అవుతుంది. మనసు నిలకడ ధారణ. తైల ధారలా సాగే మనోయానమే ధ్యానం. ధ్యానం పరాకాష్ఠ చెందడమే సమాధి. విరోధిని అధిగమించిన సమాధి అయిదో ప్రశ్నకు సమాధానం. అదే స్వస్వరూప జ్ఞానం. 


అంటే స్వతహాగా మనం అజ్ఞానులమని తెలుసుకోవటం. అజ్ఞానం తొలగితే అంతా జ్ఞానమయమే. 


శరణాగతికే మరో పేరు ఉపాయ స్వరూప జ్ఞానం.


భారత, 

భాగవత, 

రామాయణాలు జ్ఞాన భాండారాలు. నిత్యపారాయణ గ్రంథాలు కూడా. మనమేమిటో, మన స్వరూప, స్వభావాలు ఎలాంటివో, ఏ విధంగా మనం మన జీవితాలను మలచుకోవాలో, సర్వగమ్యమైన జీవిత పరమార్థం ఎలా సాధించాలో... వీటికి తగిన సమాధానాలు వాటిలో ఉన్నాయి. 


భారతం అంటే స్థూల శరీరం. 

భాగవతం సూక్ష్మశరీరం. 

రామాయణం కారణ శరీరం. 


భారతం చదివి మానవుడిగా, 

భాగవతం చదివి దేవుడిగా, 

రామాయణం చదివి ఆదర్శ మానవుడిగా మెలగటం నేర్చుకోవాలి. 


నేర్చినది జీవితానికి అనువదించాలి లేక ఆచరించాలి. అందుకే వ్యాస వాల్మీకులు వేదసారాన్ని సులభ సుందరంగా అక్షరానువాదం చేసి మనకు నిత్య సంసేవనంగా అందజేశారు. ఇహం లేనిది పరం దక్కదు. కర్మ చేయక జ్ఞానం దొరకదు. కర్మ జ్ఞానాలు భక్తిలో ఊరితేగాని పరిపూర్ణం కావు. 



ప్రతి మనిషిలో మూడు భాగాలున్నాయి. 


ఒకటి పశు భాగం. 

రెండోది ప్రాణ భాగం. 

మూడోది ఆత్మ భాగం. 


శరీరం, ప్రాణం, ఆత్మ... ఈ మూడూ మనుగడకు, అస్తిత్వానికి ఆధారభూతాలు.


 ‘నేను జీవుడిని... నాకు ఆధారం ఆ దేవుడు’ అన్న మొదటి సమాధానమే భవ్య దివ్య జీవన సంవిధానానికి మూలాధారం.

మంగళవారం🍁* *🌹15 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

  *🌹15 జూలై 2025🌹*       

    *దృగ్గణిత పంచాంగం*  

             

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి  : పంచమి* రా 10.38 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : శతభిషం* ఉ 06.26 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : సౌభాగ్య* మ 02.12 వరకు ఉపరి *శోభన*

*కరణం   : కౌలువ* ప 11.21 *తైతుల* రా 10.38 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 08.00 సా 04.30 - 06.30*

అమృత కాలం  : *రా 09.59 - 11.33*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.39*

*వర్జ్యం      : మ 12.39 - 02.13*

*దుర్ముహూర్తం  : ఉ 08.19 - 09.11 రా 11.08 - 11.52*

*రాహు కాలం   : మ 03.29 - 05.06*

గుళికకాళం       : *మ 12.13 - 01.51*

యమగండం     : *ఉ 08.58 - 10.36*

సూర్యరాశి : *మిధునం*  

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 05.50*

సూర్యాస్తమయం :*సా 06.54*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.43 - 08.19*

సంగవ కాలం         :      *08.19 - 10.55*

మధ్యాహ్న కాలం    :     10.55 - 01.32

అపరాహ్న కాలం    : *మ 01.32 - 04.08*

*ఆబ్ధికం తిధి: ఆషాఢ బహుళ పంచమి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.56*

రాత్రి కాలం           :*రా 08.56 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 04.59*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  *🚩శ్రీ ఆంజనేయ స్తోత్రం🚩*


*గతి నిర్జిత వాతాయ* 

*లక్ష్మణ ప్రాణదాయచ*

*వనౌకసాం వరిష్ఠాయ* 

*వశినే వననాసినే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷