15, సెప్టెంబర్ 2025, సోమవారం

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి

 ✒️💐తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి సందర్భంగా💐✒️


*జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు.* తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి, అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు........


*ఉత్తమమైన కవిత్వం అలవడితే సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమపదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.*


*#ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.*


‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి.

ఈయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్‌ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.


400 లకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చెళ్లపిళ్ల సత్యం గారి ముత్తాతగారే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.


ఆ కాలంలోనూ చెళ్లపిళ్లవారి రచనా వ్యాసంగం తిరుపతి వేంకటీయంగానే సాగింది. అవధానాల రూపంలో ఈ జంట కవులు పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.


*#కవులకు మీసాలెందుకని......*


తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!


దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.


*#అష్టావధాన, శతావధానాలు:*


తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.


*#బాల్యం-ఉద్యోగం:*


వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 8-8-1870న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్యలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వేంకటాచలం. బాల్యంలో బడికి వెళ్లకుండా తోటి పిల్లలతో గోళీలు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరిగినా, కాలక్రమంలో బుద్ధి కలిగి ఏళ్లలో నేర్వదగిన విద్య నెలల్లో ఆర్జించారు. ‘శాస్త్రి సామాన్యం ఎత్తు, చామనఛాయ, బహు చురుకైన మొహం, పిల్ల జుట్టు, కంచు గంట లాంటి గొంతుక, పండిత శాలువా పైనవేసుకొని, పంచ ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.


 వేంకట కవి బందరు హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించింది.


*#కంచు కంఠం:*


‘కవనార్థంబుదయించితిన్‌ సుకవితా కావ్యంబె నా వృత్తి’ అని చెప్పుకొన్నారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. పద్య పఠనంలో ఆయనది ఒక కొత్త తీరు. ఆయనలా పద్యాలు చదవాలని ఎందరో ప్రయత్నించినా, ఆ కంచు కంఠం అందరికీ రాదు కదా. ప్రతి విషయంలో తనదొక ప్రత్యేకత అన్నట్టు వేంకటశాస్త్రి వ్యవహరించేవారు.


చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు.


*#శతకంల రచన:*


 ఆయన కామేశ్వరి శతకం, ఆరోగ్య కామేశ్వరి శతకం రచించారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కామేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ వీరు రాసిన ఆరోగ్య కామేశ్వరి శతకంలో స్వవిషయాలు, తిరుపతి కవి గురించిన పద్యాలు ఉన్నాయి. అనంతర కాలంలో వెలువడిన ఆరోగ్య శతకాలకు వీరి శతకం మార్గదర్శనమైంది. తాను వ్రణంతో బాధపడుతున్నప్పుడు శారీరక బాధను, మానసిక వేదనను కామేశ్వరి శతకంలో దేవికి విన్నవించుకున్నారు.


*#గొప్ప వక్త.:*


వేంకటశాస్త్రి గొప్ప వక్త. అమిత భాషి. యౌవనంలో ఆయన ఉపన్యాస వాణి మేజువాణి. షష్టిపూర్తి తరవాతా వారి కంఠంలో ఝంకారం, మాధుర్యం తగ్గలేదు. ఆయనది శాఖాచంక్రమణం. అనేక విషయాల్లోకి చొచ్చుకుపోయేవారు. పద్యాలను, పిట్ట కథలను, సంఘటనలను, గానాన్ని, హాస్యాన్ని మేళవించి పంచామృతంగా ఉపన్యాసం అందించేవారు. ఏం మాట్లాడినా అది ధ్వని కావ్యం.

‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు. 


*#శిష్యగణం:*


వేంకట కవికి గణనీయమైన గొప్ప శిష్యగణం ఉంది. ఆయన బందరు పర్రల్లో కవుల్ని సృష్టించారని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. పింగళి, కాటూరి, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి వీరి శిష్యులు విద్వత్‌ కవులుగా వాసికెక్కారు. పింగళి, కాటూరి కవులు తమ సౌందరనంద కావ్యాన్ని చెళ్లపిళ్ల వారి షష్టిపూర్తి సందర్భంలో సమర్పిస్తూ వారిని ‘అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’గా సంభావించారు.


శాస్త్రి గ్రాంథిక భాషా కవిత్వంలో పుట్టి పెరిగినా, చివరి దశలో వ్యావహారిక భాషను ఆదరించారు. వచనంలోనూ అమూల్యమైన రచన చేశారు. కృష్ణా పత్రికలో ప్రచురితమైన వారి కథలు, గాథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి తెలుగు భాషా సాహిత్యాలకు విజ్ఞాన సర్వస్వాలు. వ్యావహారిక భాషా సౌందర్యానికి తరగని గనులు. 


*#అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే.....*


అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.


ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స

న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె

వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర

జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!


*#కాశీయాత్ర:*


వారి ‘కాశీయాత్ర’ యాత్రా సాహిత్యంలో విశిష్టమైనది. ఆధునిక, సాంఘిక చరిత్రకు విలువైన ఆధార గ్రంథం. ఆనాటి ఉత్తర హిందూస్థానం విశేషాలు, నాటి సామాజిక పరిస్థితులు ఈ గ్రంథంలో చూడవచ్చు. 


*#మానవతావాది:*


చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు గొప్ప మానవతావాది. వీరు కవికోకిల శ్రీ జాషువా గారి పాదాలు కడిగి, వారికి కాలికి గండపెండేరం తొడిగి, ఇలా అన్నారు--- "ఈ మహాకవి పాదాలు తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను"


*#పాండవ ఉద్యోగ విజయాలు:*


పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే

సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.


#వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ. వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు మొదలైన వారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

80వ పడిలో 1950 ఫిబ్రవరి15న శివైక్యం  పొందారు వేంకటశాస్త్రి.

*బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.*

🙏🙏🏵️🌷🌸🙏🙏

Collected by 

Dr.A.Srinivasa Reddy

9912731022

Zphs Munugodu Amaravathi mandal Palanadu district.

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగినఅలంకారములు.వానికితగినమాటలు .మాటలకు దగిన చక్కనిపదములబంధములు, పోతన పాత్రచిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము!!


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కజ్జలశిక్తమై కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! "భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు "అంతవాడ వింతవాడ వైతివే!! యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷💄💄🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అర్చకుని తపస్సు

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


అర్చకశ్య తపోయోగాత్, 

అర్చకస్యాతి శ్యాయనాత్,

అభి రూప్యాచ్చ బింబానాం, 

దేవ సాన్నిధ్య మృచ్ఛతి.


తాత్పర్యము: అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహములు దైవ సాన్నిధ్య శక్తిని కలిగి లోకానుగ్రహము కలిగించగలవు.... మనుస్మృతి ..  


విశ్లేషణ: ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయం వద్ద కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది.


అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. 

యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. 

ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. 

భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. 

ప్రపత్తి కలిగివుండాలి. 

ప్రపత్తి అంటే శరణాగతి. 

ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి ఆ మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఆ ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. అందుకే కొన్ని ఆలయాలలో నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో అర్చకునిదే.


                     🙏🙏

సోమవారం🕉️* *🌹15సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹15సెప్టెంబర్2025🌹*   

   *దృగ్గణిత పంచాంగం*                     


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : నవమి* రా 01.31 వరకు ఉపరి *దశమి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : మృగశిర* ఉ 07.31 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : వ్యతీపాత* రా 02.34 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : తైతుల* మ 02.15 *గరజి* రా 01.31 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 09.05 - 10.38*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*


*వర్జ్యం      : సా 03.39 - 05.12*

*దుర్ముహూర్తం  : మ 12.27 - 01.16 & 02.54 - 03.43*

*రాహు కాలం   : ఉ 07.27 - 08.59*

గుళికకాళం       : *మ 01.34 - 03.06*

యమగండం     : *ఉ 10.31 - 12.02*

సూర్యరాశి : *సింహం*       

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.18* 

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.16*

అపరాహ్న కాలం    : *మ 01.16 - 03.43*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ నవమి*

సాయంకాలం        :*సా 03.43 - 06.09*

ప్రదోష కాలం         :  *సా 06.09 - 08.31*

రాత్రి కాలం           :*రా 08.31 - 11.39*

నిశీధి కాలం          :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.09*

++++++++++++++++++++++++++

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*హవ్యం తే లక్షసంఖ్యైర్హుత* 

*వహవదనే నార్పితం* 

*బీజమంత్రైః ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

Panchaag



 

_ఒక_పద్యం

 _ఒక_పద్యం



"కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపైపేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములైఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!"


ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు అతనన్న మాటలు ఇవి.పోతన భాగవతంలో రెండే పాత్రలు భగవంతుడు, కవి. మిగిలిన వాళ్ళంతా నిమిత్తమాత్రులు. అంచేత నిజానికి ఈ మాటలు బలి పేరుతో పోతన గారే అంటున్నవని అనుకోవటం తప్పుకాదు.ఇంతకు ముందు ఒక సంచికలో వేలూరి గారు “ఎవ్వనిచే జనించు…” పద్యం గురించి అన్నట్లు, ఇక్కడ కూడ కొంత విచిత్రమైన భాషా ప్రయోగం కనిపిస్తుంది. “కారే రాజులు?” అనటమే ఒక వింత వాడుక. ఆ రెండు పదాల్నే తీసుకుని అర్థాన్ని సాధించాలంటే కష్టం కూడా. ఎవరో ఏమిటో చెప్పకుండా “వాళ్ళెక్కడ?” అంటే ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? కాని అలా సందర్భాన్ని వివరించకుండా పద్యాన్ని ఎత్తుకోవటంలో బలి ఎంత భావావేశంలో వున్నాడో, అతని మనసు కన్నా వేగంగా మాటలు ఎలా పరుగిడుతున్నాయో ఇక్కడ పోతన గారు చూపిస్తున్నారు. ఇలాటి సందర్భాలు మనందరికీ అనుభవంలో వున్నవే. మరో విధంగా కూడ ఈ పద్యం ఎత్తుగడని వివరించొచ్చు. “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణరావు గారు అన్నట్లు, తెలుగు భారత భాగవత పురాణాలు నిజానికి ఎవరికివారు చదివి ఆనందించటానికి ఉద్దేశించినవి కావు ఒక పౌరాణికుడు వీటిలోని పద్యాలను మధ్య మధ్యలో వాడుతూ తనదైన కథనంతో ప్రవచనం చేసే పద్ధతికి అనుకూలమైనవి. అంచేత, ఒక పౌరాణికుడు ప్రసంగిస్తూ, బహుశా రకరకాల దేశాల పేర్లు చెప్పి, యుగాల పేర్లు చెప్పి, “అప్పట్నుంచి ఇప్పటివరకు

ఎందరెందరో..” అని ముందు చేర్చి “కారే రాజులు?” అని పద్యాన్ని ఎత్తుకుంటే అప్పుడు సరిగ్గా సరిపోతుందన్న

మాట. ఇక ఈ పద్యంలో పోతన గారు అంటున్నది, “ఎందరో రాజులయ్యారు, వాళ్ళకి రాజ్యాలు కలిగాయి, కాని అందువల్ల జరిగిందల్లా వాళ్ళకు గర్వం పెరగటం త ప్ప మరేమీ కాదు” అని. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు

ఏమయ్యారు? ఆ సంపదని మోసుకుపోలేదు కదా! పోనీ, భూమ్మీద వాళ్ళ పేరైనా నిలబడిందా? అదీ లేదు. వాళ్ళెవరో

ఎవరికీ పట్టదు. అదే శిబి లాటి దాతలు కీర్తి కోసం కోరికలు తీర్చారు. వాళ్ళ పేర్లు ఇప్పటివరకూ నిలిచాయి. కొంచెం లోతుగా చూస్తే ఇక్కడ కనిపించేది గర్వోన్నతులైన రాజులకు చివరికి ఏ గతి పడుతుందంటే వాళ్ళ సిరిని ఇంకా బలవంతులైన వాళ్ళు వచ్చి కొట్టుకుపోతారు; ఆ పనిలో వాళ్ళెలాగూ ఈ గర్వోన్నతుల్నీ వాళ్ళ వంశాల్నీ నాశనం చేస్తారు; అంచేత వాళ్ళ వంశాలు కూడ మిగలవు ఆ విధంగా వాళ్ళ పేర్లు కాలగర్భంలో కలిసిపోతాయి; అనేది. చారిత్రకంగా చూస్తే ఇది నిజమే మరి. రాజుల జీవితాలు దినదిన గండాలుగా వుండేవి. వృద్ధాప్యంలో సహజ మరణాల్తో పోయిన వాళ్ళు చాలా కొద్దిమందే! కనుక నిజంగా విష్ణువే తనని నాశనం చెl ు్యటానికి వచ్చినప్పుడు దానం చేసి పేరు నిలబెట్టుకోవటమో లేక ఆ గర్వోన్నత రాజుల దారిలో నడిచి వంశనాశనం చేసుకోవటమో ఈ రెండే మార్గాలున్నాయి బలికి (పోతన గారి దృష్టిలో). అంచేత దానం ఇవ్వటం అనే మార్గాన్ని ఎంచుకోవటంలో బలి చేస్తున్న త్యాగం పెద్దగా ఏమీ లేదు. అది అతనికీ తెలుసు. మరో విషయం ఈ పద్యం “పేరు నిలబడటం” అనేది గొప్ప లక్ష్యమని ప్రతిపాదిస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాదస్తంగా, మౌఢ్యంగా అనిపిస్తుంది కాని వందేళ్ళ క్రితం కూడ అభిమానధనం ముందు ధనానికి విలువ తక్కువగానే వుండేది. అందుకు ముఖ్యకారణం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబం మీద మచ్చ పడితే అది మాసిపోవటానికి ఏడు తరాలు పడుతుందని భావించే సమాజంలో ఏ విధమైన చెడ్డ పేరూ రాకుండా చూడటం ప్రతి వ్యక్తికీ బాధ్యతే. అలా చెయ్యకపోతే అతను తన వంశాన్ని ఎన్నో తరాల ముందు వరకు శాపగ్రస్తం చేసిన వాడౌతాడు. కుటుంబ వ్యవస్థ కూలిపోయి వ్యక్తులు సర్వస్వతంత్రులై, వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళు వ్యక్తిగత బాధ్యతని వహించే ఈ నాటి పాశ్చాత్య,

పాశ్చాత్య ప్రభావిత, సమాజాల్లో అప్పటి విలువలు పనికిరావు కనుక ఈ పద్యం చెప్పే నీతి ఇప్పుడు మనకు

అంగీకారయోగ్యం కానక్కర లేదు. ఐనా చక్కటి పద్యానికి ఉన్న శక్తి, దాన్లోని విషయం మనకు నచ్చకపోయినా


పదే పదే మన చేత మననం చేయించటం!

14, సెప్టెంబర్ 2025, ఆదివారం

లిపిడ్ ప్రొఫైల్

 *లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?*

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను చాలా చక్కగా వివరించాడు మరియు దానిని ఒక ప్రత్యేకమైన రీతిలో వివరించే అందమైన కథను పంచుకున్నాడు.


మన శరీరం ఒక చిన్న పట్టణం అని ఊహించుకోండి. ఈ పట్టణంలో అతిపెద్ద సమస్య సృష్టించేది - *కొలెస్ట్రాల్*


అతనికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. నేరంలో అతని ప్రధాన భాగస్వామి - *ట్రైగ్లిజరైడ్*


వీధుల్లో తిరగడం, గందరగోళం సృష్టించడం మరియు రోడ్లను అడ్డుకోవడం వారి పని.


*హృదయం* ఈ పట్టణం యొక్క నగర కేంద్రం. అన్ని రోడ్లు హృదయానికి దారి తీస్తాయి.


ఈ సమస్య సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు, ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు. వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.


కానీ మన శరీర పట్టణంలో కూడా ఒక పోలీసు దళం మోహరించబడింది - *HDL*


మంచి పోలీసు ఈ సమస్య సృష్టించేవారిని పట్టుకుని జైలులో పెడతాడు *(కాలేయం)*.


అప్పుడు కాలేయం వారిని శరీరం నుండి తొలగిస్తుంది - మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా.


కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న ఒక చెడ్డ పోలీసు - *LDL* కూడా ఉన్నాడు.


 LDL ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్లి వీధుల్లోకి పంపుతుంది.


మంచి పోలీసు *HDL* తగ్గిపోయినప్పుడు, పట్టణం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది.


అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు?


మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా?


*నడక* ప్రారంభించండి!


ప్రతి అడుగుతో *HDL* పెరుగుతుంది మరియు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్* మరియు *LDL* వంటి దుర్మార్గులు తగ్గుతాయి.


మీ శరీరం (పట్టణం) మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది.


మీ గుండె - నగర కేంద్రం - దుండగుల అడ్డంకి *(హార్ట్ బ్లాక్)* నుండి రక్షించబడుతుంది.


మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.


కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడల్లా - నడవడం ప్రారంభించండి!


*ఆరోగ్యంగా ఉండండి...* మరియు *మీకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను*

**ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచడానికి మరియు LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించడానికి అంటే నడకకు ఉత్తమ మార్గాన్ని మీకు చెబుతుంది.*

ప్రతి అడుగు HDL ను పెంచుతుంది. కాబట్టి - *రండి, ముందుకు సాగండి మరియు కదులుతూ ఉండండి.*




ఈ విషయాలను తగ్గించండి:-


1. ఉప్పు


2. చక్కెర


3. శుద్ధి చేసిన పిండి


4. పాల ఉత్పత్తులు


5. ప్రాసెస్ చేసిన ఆహారాలు


*ప్రతిరోజూ ఈ విషయాలను తినండి:-*


1. కూరగాయలు


2. పప్పులు


3. బీన్స్


4. గింజలు


5. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్


6. పండ్లు


*మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:*


1. మీ వయస్సు


2. మీ గతం


3. మీ మనోవేదనలు


*అలవాటు చేసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:*


1. మీ కుటుంబం


2. మీ స్నేహితులు


3. సానుకూల ఆలోచన


4. ఇంటిని శుభ్రపరచడం మరియు స్వాగతించడం


*అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:*


1. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి


2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి


3. మీ బరువును తనిఖీ చేసుకోండి మరియు నియంత్రించండి


*మీరు అలవర్చుకోవాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలి అలవాట్లు:*

1. నీరు త్రాగడానికి దాహం వేసే వరకు వేచి ఉండకండి. 2. విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు వేచి ఉండకండి.


3. వైద్య పరీక్షల కోసం అనారోగ్యంతో బాధపడే వరకు వేచి ఉండకండి.


4. అద్భుతాల కోసం వేచి ఉండకండి, దేవునిపై నమ్మకం ఉంచండి.


5. మీపై ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి.


6. సానుకూలంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశిస్తారు.


ఈ వయస్సులో మీకు స్నేహితులు ఉంటే *(45-80 సంవత్సరాలు)* దయచేసి వారికి దీన్ని పంపండి.




మీకు తెలిసిన మంచి సీనియర్ సిటిజన్లందరికీ దీన్ని పంపండి.



🙏 🌹🌹🌹🙏

బృహద్ధర్మపురాణంలో

 బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి


బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివినవారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టిన రోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.


బ్రహ్మఉవాచ:-


1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ; సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరివలన ఈ జన్మవచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సులవల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.


2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే; సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ


సెప్టెంబర్-2015-


సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమాన మైనవారు సకల పుణ్యతీర్ధములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు,


3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః; సదా... పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివ రూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు,


4. దుర్లభం మానుషమిదం యేనలబ్దం మాయా వపుః సంభావనీయం ధర్మార్దే తస్మై పిత్రే నమో నమః ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు.


5. తీర్ధస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం: మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః ఎవరిని చూసినంతనే అనేక తీర్ధస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురు వులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.


6. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం; అశ్వమేధ శతై: తుల్యం తస్మై పిత్రే నమో నమః ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరు లకు నమస్కారములు.


ఫలశృతి:


ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం నానాపకర్మకృత్వాపి యఃసౌతి పితరం సుతః సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి


-యస్.వి.యస్.ఎన్.శర్మ


35

వెంటనే జరుగుతుంది.

 కాలాన్తరేహ్యనర్థాయ 

 గృధ్రో గేహోపరిస్థితః |

ఖలో గృహసమీపస్య సద్యోనర్థాయదేహినామ్ || 


ఒక డేగ ఇంటిపై కూర్చుంటే, అప్పుడప్పుడు చెడు జరగవచ్చు. ఒక దుష్టుడు ఇంటి దగ్గర ఉంటే, చెడు వెంటనే జరుగుతుంది.


...కలివిడంబనమ్

13, సెప్టెంబర్ 2025, శనివారం

భువనవిజయం

 శ్రీకృష్ణదేవరాయల కాలంలోని "భువనవిజయం"లో ఉన్న ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజ కవులు అంటారు. 

వారు:-

1. అల్లసాని పెద్దన (మనుచరిత్ర, హరికథా సారం).

2. నంది తిమ్మన (పారిజాతాపహరణం).

3. ధూర్జటి (శ్రీకాళహస్తీశ్వర శతకం).

4. మాదయ్యగారి మల్లన (రాజశేఖర చరిత్ర).

5. అయ్యలరాజు రామభద్రుడు (రామాయణ కథ).

6. పింగళి సూరన (ప్రభావతీ కళ్యాణం, కళాపూర్ణోదయం).

7. రామరాజభూషణుడు (వసుచరిత్ర).

8. తెనాలి రామకృష్ణుడు (ఉద్భట, పాండురంగ మహత్యం).


అష్టదిగ్గజాలు :-

ఎనిమిది దిక్కులయందలి ఏనుగులు ( భార్యలతో సహా )


1. ఐరావతం (అభ్రం)

2. పుండరీకం (కపిల)

3. వామనం (పింగళ)

4. కుముదం (అనుపమ)

5. అంజనం (తామ్రపర్ణి)

6. పుష్పదంతం (శుభ్రదంతి)

7. సార్వ భౌమం (అంగన)

8. సుప్రతీకం (అంజనా వతి)

మలేరియా జ్వరమునకు

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -

      

మలేరియా జ్వరం వర్షాకాలం నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 

  

. నివారణోపాయాలు - 

 

* 7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న మలేరియా జ్వరం 3 రోజులలో హరించును . 

 

* మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 

 

* తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 

 

* మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 

 

* తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 

 

* మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.

  

గమనిక - 

      

తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.

  

తులసితో వైద్యంలో నా అనుభవ యోగం. - 

        

. ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 



 మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

కొడుకుల్ పుట్టరటంచు


కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై! కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్ వడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! 28


ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవచక్రవర్తి దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. "జ్ఞానేనహి నృణాం మోక్షః"



Panchaag



 

11, సెప్టెంబర్ 2025, గురువారం

Panchaag



 

9, సెప్టెంబర్ 2025, మంగళవారం

దేవరకొండ బాగంగాధర తిలక్

 🙏దేవరకొండ బాగంగాధర తిలక్ 🙏

తెలుగు కవితావరణంలో అమృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ … ఎప్పటికీ గుర్తుండిపోతాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1న పుట్టిన తిలక్‌ … తన 11వ ఏటనే కథ రాయడం, 16వ ఏట నుంచే కవిత్వం అల్లడం ప్రారంభించారు. విశాఖపట్నం ఏవిఎన్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, అనారోగ్య కారణాల చేత ఉన్నత విద్య అభ్యసించలేకపోయారు. తణుకులో ‘సాహితీ సరోవరం’ పేరిట విజ్ఞాన పరిషత్‌ను స్థాపించి, సాహిత్య సృజన సాగించారు.

తిలక్‌ అనారోగ్య సమస్య మానసికమైనది. లేనిపోని జబ్బులు తనకే ఉన్నాయనే భావం హైపో కాండ్రియాసిస్‌ వల్ల సైకోన్యూరోసిస్‌, గుండె సంబంధమైన వ్యాధులతో 1946 నుంచి 1954 వరకు ఎనిమిదేళ్లపాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ దశలోనే ‘బాధాగళము’, ‘మండోదరి’ వంటి పద్య కవిత్వం రాశారు తిలక్‌. ఆరోగ్యం కుదుట పడ్డాక 1954 – 1966 మధ్య ఒక పుష్కర కాలం పాటు అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ విస్తారంగా రచనలు చేశారు. ఇరుగు- పొరుగు, సుచిత్ర ప్రణయం, సుప్తశిల, పొగ, భరతుడు (ఏకపాత్రాభినయం) వంటి నాటికలు; సుశీల పెళ్ళి, సాలెగూడు వంటి నాటకాలు కూడా రాశారు. కావ్యసృష్టి, గాంధీ జీవితం ఒక మహాకావ్యం, హేమంత హసంతిక, కావ్యరసం, యుద్ధం వంటి వ్యాసాలు రాశారు. తన మిత్రులకు గొప్ప జీవిత స్పర్శ, సాహిత్య సౌరభం ఉన్న లేఖలు రాశారు. మాక్సిం గోర్కీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్ఫూర్తితో కథలు రాశారు. సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు కథలు ఎంతో ప్రసిద్ధం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన సృజియించిన వచన కవిత్వం మరొక ఎత్తు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావంతో ఆయన భావాభ్యుదయ కవిత్వాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్‌ అమతం కురిసిన రాత్రి సాహితీ ప్రపంచంలో విహరిద్దామనుకునే పాఠకులకు, వర్ధమాన కవులకు రెండు అద్భుత ద్వారాలుగా నిలుస్తాయి. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం తిలక్‌కు కరతళామలకం. ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక శ్రీశ్రీ లాగానే, వచన గేయాన్ని ఎంచుకున్నారు. అది తన చేతిలో ఒకనొక ప్రత్యేకతని సంతరించుకొని, సౌందర్యాన్ని సేకరించుకుంది.

‘అమృతం కురిసిన రాత్రి’లో ”అందరూ నిద్ర పోతున్నారు- నేను మాత్రం- తలుపు తెరచి ఇల్లు విడిచి- ఎక్కడికో దూరంగా- కొండ దాటి కోన దాటి- వెన్నెల మైదానంలోకి వెళ్లి నిలుచున్నాను” అంటూ పాఠకున్ని కూడా వెన్నెల మైదానంలోకి తీసుకుపోతారు. ”నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకోనే అందమైన ఆడపిల్లలు” అని తిలక్‌ చెప్పుకున్నారు. ఇందులోని మొదటి రెండు వాక్యాలూ తిలక్‌ తన వస్తువుల గురించి, మూడవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ”పాడువోయిన ఊరు”లో – అది అంతా యిసుక- చరిత్రలో ఒక మసక- ఇది నశించిన గ్రామం- విశ్వసించే ఒక శ్మశానం- కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతుంది- కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనబడింది అంటూ భాష సరళతను భావగాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు తిలక్‌. ‘సైనికుడి ఉత్తరంలో’ ఇక్కడ నేను క్షేమం- అక్కడ నువ్వు కూడా- ముసలి అమ్మ- పాత మంచం కోడు- మన చిన్నబ్బాయి- చెరువులో కొంగా” అంటూ ప్రారంభమైన ఉత్తరం- ”నేనిది వరకటి నేను కాను – నాకు విలువల్లేవు – చంపడం, చావడం తప్ప- కనిపించే ఈ యూనిఫారం కింద- ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలా రహస్యంగా ఉంది” అని సైనికుడు భార్యకు రాసే ఉత్తరాన్ని వివరించారు తిలక్‌.

సంఘవంచితుల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తారో సంఘ దురన్యాయాల పట్ల అంతే క్రోధాన్ని ప్రదర్శిస్తారు తిలక్‌. ‘ఆర్తగీతం’లో ”నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలి వాణ్ణి- నేను చూసాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద- నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని- నేను చూశాను నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక, ఏడుస్తూ ఏడుస్తూ- ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసి బాలుణ్ణి …” ఇలా వంచితుల దీన గాధల్ని వివరిస్తూ- ఇది ఏ నాగరికతకు ఫలశృతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి? ఏ బుద్ధ దేవుని జన్మభూమికి గర్వ స్మ ృతి” అనే ప్రశ్నలతో తన క్రోధాన్ని ప్రదర్శించారు. ‘న్యూ సిలబస్‌’ అనే కవితలో సౌత్‌ ఆఫ్రికా ప్రధాన మంత్రికి సామరస్యం ప్రధాన లక్ష్యం- రష్యా నేత కశ్చేవ్‌కి ప్రపంచ శాంతి ఒకటే గమ్యం- అమెరికన్‌ కెనడీకి పరోపకారం స్పూనుతో పెట్టిన ఆహారం అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడు! అది మన ప్రారబ్దం అంటూ అని ఆనాడే వాపోయారు. కష్ణశాస్త్రి, శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాసినా వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళిన వాడు తిలక్‌.

‘నవత కవిత’లో – ”గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు- ఖద్దరు ధరించిన ప్రతివాడు గాంధేయుడు కాడు- ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతీదీ శిరోధార్యం కాదు- ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవడు- అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్‌ భావం పోయెట్రీ అవదు- కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును- కాళిదాసుకు తెలుసు- పెద్దన్నకి తెలుసూ – కృష్ణ శాస్త్రికి తెలుసు- శ్రీశ్రీకి తెలుసు” అంటూ కవిత్వానికి ప్రామాణికాలను నిర్దేశించారు తిలక్‌. ‘నీడలు’ కవితలో ”చిన్నమ్మా – నేను వెళ్ళొస్తాను- చీకటి పడుతోంది- చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకొంది- శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది- దారంతా గోతులు ఇల్లేమో దూరం- చేతిలో దీపం లేదు- ధైర్యమే ఒక కవచం” అంటూ ఆశావాహ దక్పథాన్ని పాఠకులకు కలిగిస్తారు.

తిలక్‌ రాసిన ‘తపాలా బంట్రోతు’ గేయం బాగా ప్రాచుర్యం పొందింది. ”ఎండలో, వానలో – ఎండిన చివికిన- ఒక చిన్న సైజు జీతగాడు – చెవిలో పెన్సిల్‌- చేతిలో సంచి- ఖాకీ దుస్తులు- అరిగిన చెప్పులు- ఒక సాదా పేదవాడు- ఇంటింటికి- వీధి వీధికి ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమినిష్టరా ఏం అని అంటూనే అదృష్టాద్వం మీద నీ గమనం- శుభా శుభాలకి నువ్వు వర్తమానం- నీ మ్యాజిక్‌ సంచిలో- ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!” అంటూ తన పోస్టుమేన్‌ స్నేహితున్ని రాజును చేశారు తిలక్‌. ”ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినపుడు – తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు” అనే ముగింపు గుండెల్ని పిండేసినట్లుంటుంది.

కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’ లాగా, శ్రీశ్రీ మహాప్రస్థానం లాగా తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ కూడా ఆధునికాంధ్ర కవిత్వ చరిత్రలో ఒక మైలురాయి. అనేక ముద్రణలు పొంది ప్రజల అభిమానాన్ని ఈనాటికీ చూరగొంటోంది. ఎందరో యువతీ యువకుల్ని కవులుగా తీర్చిదిద్దుతోంది. ఈ కవితా సంపుటికి 1969లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తిలక్‌ మరణానంతరం లభించాయి, ునజు చీ×+ను ఉఖీ చీజుజుA= గా ఇంగ్లీష్‌ లో అనువాదమైంది.

”సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు- అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు- చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి” అంటూ బలమైన కంఠంతో విశ్వ మానవ కళ్యాణానికి నిబద్ధుడై కరుణ కలికితురాయిగా తమ అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతం కురిసిన రాత్రులను, కవిత ఝరులను ప్రవహింపచేశారు దేవరకొండ బాలగంగాధర తిలక్‌. సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో – 45 ఏళ్ళ నడి వయసులో ఆయన 1966 జూన్‌ 30న అనారోగ్యంతో కన్నుమూయడం తెలుగు సాహితికి తీరని లోటు! ”యువకవి- లోక ప్రతినిధి- నవ భావామృత రసధుని- కవితా సతినొసట నిత్య రస గంగాధర తిలకం – సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్ఫటిక ఫలకం- నడి నింగి మాయమయాడా – మన మిత్రుడు కవితా పుత్రుడు- కదన క్షాత్రుడు- సకల జగన్మిత్రుడు” అంటూ శ్రీశ్రీ తిలక్‌కు నివాళులు అర్పించారు. మనమూ స్మరించుకుందాం.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

8, సెప్టెంబర్ 2025, సోమవారం

నీలకంఠేశ్వరా


నీలకంఠేశ్వరా!   


మ: నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ/

ఘనకోటీ శకటీకటీ తటిపటీ గంధేభవాటీ పటీ/

ర, నటీ, హారిసువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్/

కనదామ్నాయమహాతురంగ!

శివలింగా! నీలకంఠేశ్వరా!


ఎఱ్ఱాప్రెగ్గడ:-నీలకంఠేశ్వర శతకం.


         కాకతి రాజుల కాలంలో వీరశైవం మహోన్నత స్థితిని అందుకొన్నది. ఆమహా తరుణంలో శివకవులు నలుముఖముల విజృభించి అద్భుతమైన సాహిత్య సృజన చేశారు. నాడు శతకసాహిత్యం ఆవిర్భావ దశలో ఉన్నను మంచి మంచి శతకాలు వెలిశాయి. అందులో నీలకంఠశతకం ఒకటి."ట"కార యమకంతో నాట్యంచేసిన యీపద్యం నాటి కవులకు గల భాషాధికారానికి నిలువుటద్దం!


అర్ధములు: వీటీవధూటీ ఘటీ-వారాంగనా సముదాయము;కోటీ:కోటిధనము;శకటీకటీ- వాహన(బండ్లు)సముదాయము;తటిపటీర:నదీతీరములయందుపెరిగినచందనవృక్షములు;గంధేభవాటీ- మదగజ సముదాయము;పటీర-చందన: నటీ-నాట్యకత్తెలు;హారి-మనోహరమైన; సువర్ణహార-బంగరుహారములు;మకుటీ-కిరీటములు;ప్రఛ్ఛోటికా-పల్లకీలు;పేటికల్- పెట్టెలు; కనత్-ప్రకాశించు; ఆమ్నాయమహాతురంగ-వేదములే గుర్రములైనవాడా!; 


భావము:- ఓనీలకంఠేశ్వరా! వేదాశ్వా! నిను పూజించిన వారికి ఏమికొదవ?వారాంగనా సముదాయములేమి,అనేకకోట్ల ధనమేమి?వాహన సముదాయములేమి? ,చందనవృక్షాదులేమి, మదగజాదులేమి, కర్పూరాది సుగంధద్రవ్యాదులేమి,నట్టువరాండ్రేమి? బంగరు హారాదులేమి.సర్వము సంపన్నమే! నీవు శంకరుడవుగదా! స్వామీ !సదానీసేవాభాగ్యము ననుగ్రహింపుము.


విశేషాంశములు: భోగపుకాంతలు నాటి విలాస జీవనమునకు ప్రతీకలు.


గజాంతమైశ్వర్యం"-అనునది నాటి నానుడి. మదగజములు గలిగినవాడు ధనవంతులలో మేటి.

.చందనము కర్పూరాది సుగంధవస్తుసేవనము నాటిధనికుల జీవనరీతి.


బంగరుగద్దెలు హారములు మంజూషలు వారి అపారమైన ఐశ్వర్యమునకు నిదర్శనములు.


అలంకారం: వృత్యనుప్రాసము.

7, సెప్టెంబర్ 2025, ఆదివారం

Panchaag


 

ఉపవాసం చేయడం

 ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు - 


 * జీర్ణక్రియ - 


      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 


 * మలాశయం - 


       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 


 * మూత్రపిండములు - 


       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 


 * ఊపిరితిత్తులు - 


        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 


 * గుండె - 


       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 


  * లివర్ , స్ప్లీన్ - 


        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 


 * రక్తప్రసరణ - 


       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 


 * కీళ్లు - 


        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 


 * నాడి మండలము - 


        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 


 * జ్ఞానేంద్రియములు - 


        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 


 * చర్మము -  


        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 


 * మనస్సు - 


        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 


        పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తరవాతి పోస్టులలో వివరిస్తాను . 


  

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి

 

 దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి 

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తెలియని తెలుగువారు వుండరు. నిజానికి పండిత పామరులకు ఎల్లప్పుడూ నాలుకమీద ఆడే సామెత ఇది.దీనిని సాధారణ సామాజిక అర్ధంలో యేమని అంటారంటే క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పనులు ముగించుకోవాలి. కాలం గడచినతరువాత వగచిన ప్రయోజనం లేదు. ఇంకా కొంచం వివరంగా చెప్పాలంటే సమయంలో చేయాల్సిన పనులు సమయంలోనే చేయాలి కానీ కాలయాపన చేయకూడదు. ఒక రైతు వర్షం రాగానే భూమి దున్ని పైరు వేయటానికి సిద్ధపడాలి, అదే కాలం దాటినదాకా కాలయాపన చేస్తే పైరు పండదు సరికదా పెట్టిన పెట్టుబడికూడా వృధా అవుతుంది

అసలు సామెత ఎలా పుట్టిందా అని ఆలోచిస్తే నాకు తట్టినది. పూర్వం కిరోసిన్ దీపాలు కూడా లేనప్పుడు అంటే అప్పుడు కరంట్ అస్సలు లేదనుకోవాలి. ఆముదంతో దీపాలు వెలిగించేవారట. చిన్న మట్టి ప్రమిదలో ఒకటో రెండో ప్రత్తివత్తులు వేసి ఆముదం పోసి దీపం వెలిగించేవారు. ఇప్పడు మనం దీపావళికి వెలిగిస్తున్నాము. అయితే దీపం ప్రమిదలో ఆముదం వున్నంతవరకు మాత్రం వెలుగుతూ ఉండేది. తరచూ దానిలోని ఆముదాన్ని చూసుకుంటూ రాత్రిపూట ఇంట్లో పనులు చేసుకునేవారు. అంటే వారు దీపం ఆరిపోకముందే అన్నీ పనులు ముగించుకొని మంచం మీదకు చేరాలి. అది వారి దిన చర్య. అంటే త్వర త్వరగా పనులు చేసుకోవాలి. సామెతను మనం ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా అన్వయించుకోవచ్చు

ప్రపంచం మొత్తం వెలుగుతో నిండి వున్నది వెలుగు మనకు పగటిపూట సూర్యభగవానులద్వారా వస్తున్నదన్నది అందరకు  తెలిసిన సత్యం. వెలుగు ఉంటేనే ప్రతి వస్తువు ప్రకాశిస్తుంది. వెలుగుతోటె మనకు మనముందు వున్న కుండ కుండగా, గ్లాసు గ్లాసుగా, మనిషి మనిషిగా కనిపించుతున్నాడు. మరి ఆలా కనిపిస్తున్నది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం ఇస్తాము నేను ఎవరు అని ఆలోచించి మన మేధావులు మనకు ఇచ్చిన సమాధానం నాలో వున్న నేను నేను అనే ప్రకాశం వలననే నేను నేనుగా బాసిల్లుతున్నాను( తెలియపడుతున్నాను) ప్రకాశాన్ని మన ఋషులు ఆత్మ అని ఆత్మ పరమాత్మ అంశమని మనకు తెలియపరిచారు. మన ఉపనిషత్తులు కూడా సత్యాన్నే తెలుపుతున్నాయి. "అహం బ్రహ్మస్మి' అనే మహా వాక్యము ఇంకా 'తత్వమసి' అనే మహావాక్యాలు విషయాన్నే తెలుపుతున్నాయి. ఒక సూర్యుడు నీరు వున్న అనేక కుండలలో అనేక సూర్యుళ్ళలాగా ఎలా కనపడుతున్నాడో అదేవిధంగా ఒక పరమాత్మా అనేక జీవులలో అనేక ఆత్మలుగా మనకు గోచరిస్తున్నాడు. ఆత్మే జీవులలో (మనుషులలో) వెలిగే ప్రకాశం లేక దీపంగా మనం అభివర్ణించవచ్చు. దీపం ఎంతసేపు వెలుగుతూ వుండాలని నిర్ధారించే ఆముదము మనిషి ఆయుష్షు గా మనం తెలుసుకోవచ్చు. ఏరకంగా అయితే మనం ఇంట్లో దీపం ఆరిపోకముందే ఇంటి కార్యాలన్నీ చక్కదిద్దుకుంటామో అదే విధంగా జీవుడు తనలోని దీపం (ఆయుష్షు) ఆరిపోకముందు తన జీవన వ్యాపారాలన్నీ ముగించుకోవాలి

నేను పుట్టింది శారీరిక సుఖాలను, భోగాలను అనుభవించటానికి కాదు ఇవన్నీ శరీరానికి సంబందించినవి, మరియు తాత్కాలికమైనవి అని ఎప్పుడైతే సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు అతని మనస్సు నిత్యం సత్యము, శాశ్వితము అయిన పరబ్రహ్మ సుఖం వైపు మళ్లుతుంది. అది తెలుసుకున్న ముముక్షువు మోక్షార్ధి అయి సాధన చేసి జీవైక్యం పొందుతాడు. అద్వితీయ అనుభవానికోసం ప్రతి సాధకుడు కృషిచేయాలి. సాధనాత్ సాధ్యతే సర్వం.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ